కేంద్రం ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్.. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలు కోసం చేపట్టాల్సిన కార్యాచరణ, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలు, వరి ధాన్యం సేకరణ మరియు జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణపై ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా కేంద్రం విధానాలను…
మరోసారి ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీపై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అచ్చే దిన్ అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు నేటితో 8 ఏళ్లు పూర్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి కేటీఆర్ కాసేపటి క్రితం వ్యంగ్యంగా విమర్శలు చేశారు. మోదీ అచ్చే దిన్కు 8 ఏళ్లు నిండాయన్న కేటీఆర్… ఈ 8 ఏళ్లలో మోదీ సర్కారు సాధించిందేమిటి అన్న వాటిని ప్రస్తావిస్తూ కేటీఆర్ ట్వీట్ సంధించారు. ఈ…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండో దశ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్రకు శనివారం ముగింపు సభ నిర్వహించారు. అయితే ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి హజరై ప్రసంగించారు. ఇదిలా ఉంటే.. నేడు ఇటీవల పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న సాయి గణేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఖమ్మం వెళ్తుండగా మార్గ మధ్యలో బండి సంజయ్ కు ప్రధానమంత్రి నుంచి ఫోన్ వచ్చింది. ఈ నేపథ్యంలో.. శభాష్ బండి సంజయ్.. కష్టపడి పని చేస్తున్నారని అభినందించారు…
దేశరాజధాని ఢిల్లీ ఉలిక్కిపడింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 27 మంది సజీవ దహనమయ్యారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందంటున్నారు. పశ్చిమ ఢిల్లీలోని ముంద్రా మెట్రో స్టేషన్ 544 పిల్లర్ వద్దనున్న నాలుగంతస్తుల వాణిజ్యం భవనంలో నిన్న సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న సీసీ టీవీ కెమెరా, రూటర్ తయారీ కంపెనీ…
ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా ఉన్న సమీర్ శర్మ పదవీకాలాన్ని పొడిగించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే దీనిపై కేంద్రానికి విజ్ఞప్తి చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అయితే, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సీఎస్ సమీర్ శర్మ పదవీకాలాన్ని ఈ ఏడాది నవంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.. ఏపీ సీఎస్ పదవీకాలాన్ని మరో 6 నెలల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది డీవోపీటీ.…
ప్రధాని మోదీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మోదీ జీ.. మీరు గుజరాత్ కే కాదు భారత దేశానికి కూడా ప్రధాని అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎనిమిదేండ్లుగా రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీని కూడా మంజూరు చేయలేదన్నారు. కేంద్రం చర్యతో వైద్య విద్యకు దూరమయ్యే యువత పరిస్థితి ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణపై వివక్ష ఎందుకు? అని కేటీఆర్ ప్రశ్నించారు. అయితే గుజరాత్లో జరిగిన ఓ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరై…
జులైలో జరగనున్న భారత రాష్ట్రపతి ఎన్నిక కోసం అవసరమైన సంఖ్యా బలాన్ని కూడగట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ ఎన్నికల్లో విపక్షాలన్నీ కలిసి ఐక్య పోరాటం చేయవచ్చనే అందోళన బీజేపీలో ఉంది. ఈ నేపథ్యంలో, అధికార పార్టీ ముందుగానే అప్రమత్తమై కాంగ్రెస్ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలపై దృష్టి సారించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు గల ఎలక్టోరల్ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఇందులో ప్రతిపక్షాల ఉమ్మడి బలం బీజేపీ, దాని మిత్రపక్షాల కంటే కాస్త ఎక్కువగా ఉంది. కనుక,…
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపుతోంది. అయితే ఈ ఘటనపై ప్రధాని మోదీ నిర్ఘాంత పోయారు. మృతుల కుటుంబాలకు సానుభూతి, గాయపడిన వారితో ప్రార్థనలని తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున మరణించిన వారి బంధువులకు అందజేయబడుతుందని తెలిపారు. గాయపడిన వారికి రూ. 50వేలు అందించనున్నట్లు ప్రధాని మోదీ ట్విటర్ ద్యారా వెల్లడించారు. కాగా .. కామారెడ్డి రోడ్డు ప్రమాదంపై ఎమ్మెల్సీ కవిత…
* నేడు కర్నూలు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన. 9గంటలకు కర్నూలు ఎయిర్ పోర్ట్ చేరుకోనున్న పవన్ కళ్యాణ్. రోడ్డు మార్గంలో సిరువెళ్ల వెళ్లనున్న పవన్ * మాతృమూర్తులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు *పుట్టపర్తిలో నేడు CPI కార్యాలయాన్ని ప్రారంభించనున్న రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ * గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రెండవ రోజు కొనసాగనున్న వైఎస్ఆర్సీపీ జాబ్ మేళా. *ఉదయగిరిలో వై.ఎస్.ఆర్.సున్నా వడ్డీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి…ఎం.ఎల్.ఏ.మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి *ఆత్మకూరులో…
యూరప్ పర్యటన ముగించుకుని భారత్కు తిరిగి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ.. వెంటనే వివిధ సమస్యలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.. ఆయా శాఖల మంత్రులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమావేశమైన ప్రధాని.. దేశంలో పెరిగిన ఉష్ణోగ్రతలు, ఎండవేడి, వడగాలులు, వర్షాకాల సన్నద్ధత, కరెంట్ కోతలపై సమీక్ష నిర్వహించారు.. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలు, ఫలితంగా పెరిగిన విద్యుత్ డిమాండ్, బొగ్గు సరఫరాలో అంతరాలు, తదితర సంబంధిత అంశాలపై చర్చించారు. Read Also: Union minister Danve:…