Ayodhya Ram Mandir: అయోధ్యలో రామమందిర నిర్మాణం పనులు తుదిదశకు చేరుకున్నాయి. హిందువులంతా ఎంతో అపురూపంగా భావిస్తున్న ఈ రామ మందిర ప్రారంభోత్సవం 2024 జనవరి 22న జరగనుంది. ఈమేరకు ప్రధాని నరేంద్రమోడీని ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారులు ప్రధాని నివాసానికి వచ్చారు.
కులతత్వం, ప్రాంతీయత వంటి సామాజిక వక్రీకరణలను రూపుమాపాలని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీలోని ద్వారకాలోని రామ్లీలా మైదాన్లో జరిగిన దసరా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ, కనీసం ఒక పేద కుటుంబం సామాజిక-ఆర్థిక స్థితిని పెంపొందించడంతో సహా 10 ప్రతిజ్ఞలు తీసుకోవాలని ప్రజలను కోరారు.
PM Modi: భారత గగన్యాన్ మిషన్లో భాగంగా ఇస్రో ఈ రోజు ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని చేపట్టింది. ప్రయోగాత్మకంగా ‘టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్(టీవీ-డీ1) పరీను శనివారం విజయవంతంగా నిర్వహించింది. క్రూమాడ్యుల్ని రాకెట్ ద్వారా నింగిలోకి పంపించారు, ఆ తరువాత క్రూ మాడ్యుల్, రాకెట్ నుంచి విడిపోయి పారాశ్యూట్ల సాయంతో బంగాళాఖాతంలో సురక్షితంగా పడింది.
నవరాత్రి పండుగ సందర్భంగా బాలికలు కచ్లోని హస్తకళలతో తయారు చేసిన చనియా-చోళీని ధరించి గర్బాను జరుపుకుంటున్నారు. అదే కళ, సంస్కృతి కారణంగా, కచ్లోని ధోర్డో గ్రామం ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక గ్రామంగా ఐక్యరాజ్యసమితి నుంచి బిరుదును పొందింది.
అంతరిక్ష రంగ అభివృద్ధికి ప్రభుత్వం రోడ్మ్యాప్ను రూపొందించిందని, స్వదేశీయంగా నిర్మించిన అంతరిక్ష నౌకలో భారతీయుడు చంద్రునిపైకి వెళ్లే రోజు ఎంతో దూరంలో లేదని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం అన్నారు.
బెంగళూరు మెట్రో పర్పుల్ లైన్లోని బైయప్పనహళ్లి నుంచి కృష్ణరాజపుర వరకు, కెంగేరి నుంచి చల్లఘట్ట కాళ్ల వరకు మెట్రో రైలు సేవలు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయని, లక్షలాది మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
Smriti Irani: సిద్దిపేటకి రైలు ఇచ్చిన ఘనత ప్రధాని మోడీదే అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి అనే పదానికి కవల పిల్లలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అన్నారు.
PM Modi: పశ్చిమాసియా, మధ్యప్రాచ్యంలో ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం తీవ్ర ఉద్రిక్తతలను పెంచుతోంది. అక్టోబర్ 7న హమాస్, ఇజ్రాయిల్పై దాడితో యుద్ధం మొదలైంది. ఇదిలా ఉంటే తాజాగా ప్రధాని నరేంద్రమోడీ, పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్తో మాట్లాడారు.
Kishan Reddy: తెలంగాణలో రాహుల్, ప్రియాంక గాంధీ పర్యటిస్తున్నారు..రామప్ప దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పీఎం మోడీకి ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే.. రామప్ప దేవాలయాన్ని పీఎం అభివృద్ధి చేశారని బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.