Devendra Fadnavis: బంపర్ మెజారిటీలో మూడోసారి ప్రధాని మోడీ అధికారం చేపడుతారు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devendra Fadnavis: ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి ప్రధానిగా గెలిపించాలని దేశ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం అన్నారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయవచ్చనే ఊహాగానాలను దేవేంద్ర ఫడ్నవీస్ తోసిపుచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీకి బంపర్ మెజారిటీ ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, ప్రజలు మనసు మార్చుకోరని అన్నారు.
Read Also: Israel: గాజా ఆస్పత్రి కంప్యూటర్లలో ఇజ్రాయిల్ బందీల సమాచారం..
Also Read
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
వచ్చే ఏడాది జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాను నాగ్పూర్ నుంచి పోటీ చేస్తానని, లోక్ సభ ఎన్నికల పోటీపై వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. తాను బీజేపీలో ఉంటానని, పార్టీ తనకు ఇచ్చిన ఏ బాధ్యతనూనా నిర్వహిస్తానని చెప్పారు. మరాఠా కోటా, దాని కోసం పోరాడుతున్న మనోజ్ జరాంగే రాష్ట్రవ్యాప్త పర్యటన గురించి మాట్లాడుతూ.. శాంతిభద్రతలను కాపాడటమే తన ప్రాధాన్యత అని అన్నారు. మరాఠా కోటాకు హమీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఓబీసీ కోటాలో మరాఠా సమాజానికి వాటా ఇవ్వడాన్ని సీనియర్ మంత్రి ఛగన్ భుజ్ బల్ వ్యతిరేకించడం గమనార్హం. వచ్చే శీతాకాల సమావేశాల్లోపు మంత్రివర్గ విస్తరణకు ప్రయత్నిస్తామని చెప్పారు. రామ మందిర ప్రారంభోత్సవం ప్రజలంతా ఉత్సాహంగా ఉన్నారని, అయోధ్యలో మహారాష్ట్ర భవన్ నిర్మాణానికి భూమి కేటాయించడానికి యూపీ ప్రభుత్వం అంగీకరించిందని ఆయన తెలిపారు.
ప్రస్తుతం మహారాష్ట్ర సర్కార్లో బీజేపీ, ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలు భాగస్వాములుగా ఉన్నాయి. ఇటీవల మూడు పార్టీలు కలిసి మహారాష్ట్ర గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి బంపర్ విక్టరీని నమోదు చేశాయి. మెజారిటీ స్థానాలను బీజేపీ కూటమి కైవసం చేసుకుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని ఎంపీ స్థానాలు బీజేపీకి కీలకంగా మారాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!