PM Modi: కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉన్నా ఉగ్రవాదం, నేరాలే..
PM Modi: రాజస్థాన్ పోలింగ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్, బీజేపీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆ రాష్ట్రంలో పర్యటించారు. భరత్ పూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు విధానంతో సంఘ విద్రోహ శక్తులకు అవకాశం ఇస్తోందని మండిపడ్డారు. నేరాలు, అల్లర్లలో రాష్ట్రాన్ని టాప్ ప్లేస్లో ఉంచిందని విమర్శించారు.
కాంగ్రెస్ నేత, సీఎం అశోక్ గెహ్లాట్ టార్గెట్గా విమర్శలు చేశారు. ప్రజలు ‘‘జాదుగర్’’కి ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నారని, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కనుమరుగు అవుతుందని అన్నారు. డిసెంబర్ 3న కాంగ్రెస్ ‘ఛూ మంతర్’ అని ఎద్దేవా చేశారు.
Also Read
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
ఒకవైపు భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతోంది.. మరోవైపు రాజస్థాన్లో గత ఐదేళ్లలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు అని ప్రధాని అన్నారు. రాజస్థాన్ రాష్ట్రాన్ని అవినీతి, అల్లర్లు, నేరాల్లో కాంగ్రెస్ అగ్రగామిగా నిలిపింది. అందుకే అశోక్ గెహ్లాట్కి ఓట్లు పడవని ప్రధాని అన్నారు.
Read Also: Rohit Sharma: ప్రెస్ కాన్ఫరెన్స్ సమయంలో ఫోన్ రింగ్.. రోహిత్ శర్మ ఫైర్..!
కాంగ్రెస్ తన బుజ్జగింపు విధానాలతో నేరస్తులకు స్వేచ్ఛనిస్తోందని, కాంగ్రెస్ ఎక్కడ అధికారం వచ్చినా ఉగ్రవాదం, నేరస్తులు, అల్లరిమూకల్ని వదులుతుందని, కాంగ్రెస్ బుజ్జగింపులే సర్వస్వమని, మీ ప్రాణాలను పణంగా పెట్టైనా కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. హోలీ, రామనవమి, హనుమాన్ జయంతి పండగ ఏదైనా మీరు ప్రశాంతంగా జరుపుకోలేరని, అల్లర్లు, రాళ్లదాడులు, కర్ఫ్యూ ఇవన్నీ రాజస్థాన్లో కొనసాగాయని పీఎం అన్నారు.
రాజస్థాన్ మహిళల విశ్వాసాన్ని కాంగ్రెస్ వమ్ము చేసిందని, మహిళలు నకిలీ రేప్ కేసులు పెడతారని ముఖ్యమంత్రి అంటున్నారని ఇలాంటి ముఖ్యమంతికి ఒక్క క్షణం కూడా కుర్చీలో కూర్చునే అర్హత ఉందా..? అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తి మహిళలకు రక్షణ కల్పించగలరా అని అడిగారు. నవంబర్ 25న రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉండనుంది.
తాజావార్తలు
-
Washington Hilton Gunfire: వైట్ హౌస్ కార్యక్రమంలో కాల్పుల కలకలం.. భయంతో టేబుళ్ల కింద దాక్కున్న అతిథులు.!
-
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!
-
1 Nenokkadine: కల్ట్ క్లాసిక్ ‘1 నేనొక్కడినే’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్..
-
SRH vs RR: వైభవ్ సెంచరీ వృథా.. అభిషేక్-కిషన్ జోడీ సునామీ! జైపూర్లో కొనసాగిన SRH జైత్రయాత్ర.!
-
Thalaivar 173: తలైవర్ 173 నుంచి షాకింగ్ న్యూస్.. శంకర్ వర్సెస్ రజనీకాంత్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!