PM Modi: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై ప్రధాని మోడీ ఏమన్నారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narendra Modi: హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంపై ప్రధాని మోడీ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాల నుండి కొత్త సవాళ్లు ఉత్పన్నమవుతున్నాయన్నారు. గ్లోబల్ సౌత్లోని దేశాలు పెద్ద ప్రపంచ శ్రేయస్సు కోసం ఒకే గొంతుతో మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన చెప్పుకొచ్చారు. ఇవాళ భారత్ లో నిర్వహించిన వర్చువల్ వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ సమ్మిట్ యొక్క రెండవ ఎడిషన్లో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Kulgam Encounter : కుల్గామ్లో ఎన్కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం
Also Read
ఇక, అక్టోబరు 7న ఇజ్రాయెల్పై జరిగిన అనాగరికమైన ఉగ్రదాడిని భారత్ ఖండించింది. అలాగే, ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరిగిన ఘర్షణలో పౌరుల మరణాలను భారతదేశం తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. పశ్చిమాసియాలో అభివృద్ధిలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న ఆందోళనలు, సవాళ్లను హైలైట్ చేయడానికి జనవరిలో ‘వాయిసెస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ సమ్మిట్’ మొదటి ఎడిషన్ను భారత్ నిర్వహించింది.
Read Also: Doctors advised: ప్రచారంతో పరేషాన్ కాకండి.. జర ఆరోగ్యం కూడా చూస్కోండి సారూ.!
అయితే, వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ అనేది 21వ శతాబ్దపు మారుతున్న ప్రపంచాన్ని ప్రతిబింబించే అత్యంత ప్రత్యేకమైన వేదిక అని ప్రధాని మోడీ అన్నారు. సంప్రదింపులు, కమ్యూనికేషన్, సహకారం, సృజనాత్మకత, సామర్థ్యం పెంపుదల – ‘ఫైవ్ సి’ల ఫ్రేమ్వర్క్ కింద సహకారం కోసం కూడా ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. భారత్ కృషి వల్ల ఆఫ్రికన్ యూనియన్ను జీ20లో శాశ్వత సభ్యదేశంగా చేర్చిన ఆ చారిత్రాత్మక ఘట్టాన్ని మరచిపోలేనని ఆయన చెప్పుకొచ్చారు. భారతదేశం యొక్క జీ20 ప్రెసిడెన్సీలో ఒక ముఖ్యమైన మైలురాయిగా, సెప్టెంబర్లో ఆఫ్రికన్ యూనియన్ 1999లో ప్రారంభమైనప్పటి నుండి ప్రభావవంతమైన కూటమి విస్తరణలో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల సమూహంలో కొత్త శాశ్వత సభ్యు దేశంగా అవతరించింది.
Read Also: Police Vaari Hechharika: శరవేగంగా ‘పోలీసు వారి హెచ్చరిక’ షూట్
ఇక, భారతదేశం యొక్క జీ20 ప్రెసిడెన్సీలో గ్లోబల్ సౌత్ సాధించిన విజయాలను వివరిస్తూ.. ఈసారి క్లైమేట్ ఫైనాన్స్పై తగిన చర్యలు తీసుకున్నామని ప్రధాన మంత్రి మోడీ అన్నారు. వాతావరణ మార్పుల కోసం గ్లోబల్ సౌత్ దేశాలకు సులభమైన నిబంధనలపై ఆర్థిక, సాంకేతికతను అందించడానికి జీ 20లో ఏకాభిప్రాయం ఉందని ఆయన వెల్లడించారు. గ్లోబల్ సౌత్, నార్త్ మధ్య దూరాన్ని కొత్త టెక్నాలజీ పెంచకూడదని భారత్ విశ్వసిస్తోందని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Rohit Sharma: ఒకసారి కాదు..2సార్లు కాదు..ఏకంగా 30సార్లు.. హిట్మ్యాన్ ఖాతాలో వింత రికార్డు!
-
Vaibhav Suryavanshi: ‘నేనే ఇండియా కోచ్ అయితే వైభవ్ని పీకి పక్కన పెట్టేవాడిని..’టీమిండియా మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
-
US Iran deal 2026: అమెరికా-ఇరాన్ వివాదానికి ముగింపు.. అవగాహన ఒప్పందంపై సంతకాలు
-
Astrology: ఎవరినైనా సులభంగా నమ్మే 4 రాశులు.. అందుకే ఎక్కువసార్లు మోసపోతారా?
-
DA Hike: విద్యుత్ ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్..
ట్రెండింగ్
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!