PM Modi: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై ప్రధాని మోడీ ఏమన్నారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narendra Modi: హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంపై ప్రధాని మోడీ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాల నుండి కొత్త సవాళ్లు ఉత్పన్నమవుతున్నాయన్నారు. గ్లోబల్ సౌత్లోని దేశాలు పెద్ద ప్రపంచ శ్రేయస్సు కోసం ఒకే గొంతుతో మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన చెప్పుకొచ్చారు. ఇవాళ భారత్ లో నిర్వహించిన వర్చువల్ వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ సమ్మిట్ యొక్క రెండవ ఎడిషన్లో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Kulgam Encounter : కుల్గామ్లో ఎన్కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం
Also Read
- Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
- ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
- Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
- Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ఇక, అక్టోబరు 7న ఇజ్రాయెల్పై జరిగిన అనాగరికమైన ఉగ్రదాడిని భారత్ ఖండించింది. అలాగే, ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరిగిన ఘర్షణలో పౌరుల మరణాలను భారతదేశం తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. పశ్చిమాసియాలో అభివృద్ధిలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న ఆందోళనలు, సవాళ్లను హైలైట్ చేయడానికి జనవరిలో ‘వాయిసెస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ సమ్మిట్’ మొదటి ఎడిషన్ను భారత్ నిర్వహించింది.
Read Also: Doctors advised: ప్రచారంతో పరేషాన్ కాకండి.. జర ఆరోగ్యం కూడా చూస్కోండి సారూ.!
అయితే, వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ అనేది 21వ శతాబ్దపు మారుతున్న ప్రపంచాన్ని ప్రతిబింబించే అత్యంత ప్రత్యేకమైన వేదిక అని ప్రధాని మోడీ అన్నారు. సంప్రదింపులు, కమ్యూనికేషన్, సహకారం, సృజనాత్మకత, సామర్థ్యం పెంపుదల – ‘ఫైవ్ సి’ల ఫ్రేమ్వర్క్ కింద సహకారం కోసం కూడా ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. భారత్ కృషి వల్ల ఆఫ్రికన్ యూనియన్ను జీ20లో శాశ్వత సభ్యదేశంగా చేర్చిన ఆ చారిత్రాత్మక ఘట్టాన్ని మరచిపోలేనని ఆయన చెప్పుకొచ్చారు. భారతదేశం యొక్క జీ20 ప్రెసిడెన్సీలో ఒక ముఖ్యమైన మైలురాయిగా, సెప్టెంబర్లో ఆఫ్రికన్ యూనియన్ 1999లో ప్రారంభమైనప్పటి నుండి ప్రభావవంతమైన కూటమి విస్తరణలో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల సమూహంలో కొత్త శాశ్వత సభ్యు దేశంగా అవతరించింది.
Read Also: Police Vaari Hechharika: శరవేగంగా ‘పోలీసు వారి హెచ్చరిక’ షూట్
ఇక, భారతదేశం యొక్క జీ20 ప్రెసిడెన్సీలో గ్లోబల్ సౌత్ సాధించిన విజయాలను వివరిస్తూ.. ఈసారి క్లైమేట్ ఫైనాన్స్పై తగిన చర్యలు తీసుకున్నామని ప్రధాన మంత్రి మోడీ అన్నారు. వాతావరణ మార్పుల కోసం గ్లోబల్ సౌత్ దేశాలకు సులభమైన నిబంధనలపై ఆర్థిక, సాంకేతికతను అందించడానికి జీ 20లో ఏకాభిప్రాయం ఉందని ఆయన వెల్లడించారు. గ్లోబల్ సౌత్, నార్త్ మధ్య దూరాన్ని కొత్త టెక్నాలజీ పెంచకూడదని భారత్ విశ్వసిస్తోందని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
-
ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
-
Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
-
Rishab Shetty: రామాయణ ట్రైలర్కి ఫిదా అయిన రిషబ్ శెట్టి.. ఏం అన్నారంటే!
-
Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!