Shaktikanta Das: మొరాకోలోని మారాకేష్ నగరంలో శనివారం జరిగిన గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ కార్డ్స్ 2023లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్కి 'A+' ర్యాంక్ లభించింది.
2036 Olympics: 2036 ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహణకు భారత్ ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టదని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహించాలనే ఇండియా అభిప్రాయాన్ని ఆయన నొక్కిచెప్పారు. 2036 ఒలింపిక్స్ నిర్వహించేందుకు భారత్ బిడ్డింగ్ వెస్తుందని తెలిపారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(IOC) 141వ సెషన్ని మోడీ ప్రారంభించారు. 40 ఏళ్ల విరామం తర్వాత ఇండియాలో ఒలింపిక్ సెషన్ జరుగుతోంది. భారతదేశంలో చివరి ఒలింపిక్ సెషన్ 1983లో న్యూఢిల్లీలో జరిగింది. 2029 యూత్ ఒలింపిక్స్కు…
PM Modi: నవరాత్రి ఉత్సవాల ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ రాసిన ‘గర్భా’ సాంగ్ రిలీజైంది. ముఖ్యంగా గుజరాతీలు శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో యువతీయువకులు సంప్రదాయ నృత్యమైన ‘గర్బా’ చేస్తారు. దీంట్లో భాగంగా గర్బా పాటల ఆల్బమ్ రిలీజైంది. ఈ పాటను ప్రధాని నరేంద్రమోడీ రాయడం విశేషం. ఈ విషయాన్ని ఎక్స్(ట్విట్టర్)లో ఈ విషయాన్న వెల్లడించారు.
Shehla Rashid: జేఎన్యూ మాజీ విద్యార్థి నాయకురాలు, ఒకప్పుడు నరేంద్రమోడీని తీవ్రంగా విమర్శించే విమర్శకురాల, ఇప్పుడు ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించింది. షెహ్లా రషీద్, ఇజ్రాయిల్-పాలస్తీనా సంఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో భారతీయులుగా పుట్టినందుక చాలా అదృష్టవంతులమని వ్యాఖ్యానించారు. దీర్ఘకాలిక శాంతి, భద్రతకు భరోసా ఇచ్చినందుకు ప్రధాని మోడీ, భారత సైన్యానికి, కేంద్రమంత్రి అమిత్ షాలను ఆమె ప్రశంసించారు.
Modi-Putin: భారత ప్రధాని నరేంద్రమోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య త్వరలో భేటీ కాబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై రష్యన్ మీడియాలో విస్తృత కథనాలు వస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో ఇరు దేశాధినేతల మధ్య సమావేశం ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. మాస్కోలోని భారత రాయబారి పవన్ కపూర్ మాట్లాడుతూ..
P20 summit: జీ20 సమ్మిట్ తర్వాత ఢిల్లీలో మరోసారి ప్రపంచం నలుమూలల నుంచి నేతల సమావేశం జరగనుంది. రేపటి నుంచి రెండు రోజుల పాటు పీ20 సదస్సు నిర్వహించనున్నారు. అక్టోబరు 13న ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించనున్నారు.
ఆదిలాబాద్లో బీజేపీ జనగర్జన సభ నిర్వహించింది. ఈ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. తెలంగాణ ఓకే ఒకే భూమి ఆంగ్లేయులు.. breaking news, latest news, telugu news, amit shah, bjp, cm kcr, pm modi
PM Modi:ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూతో భారత ప్రధాని నరేంద్రమోడీ ఫోన్కాల్ లో మాట్లాడారు. ఇజ్రాయిల్-హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో భారతదేశం అన్ని రూపాల్లో ఉగ్రవాదాన్ని ఖండిస్తోందని నరేంద్రమోడీ అన్నారు. ఈ విషయాన్ని ప్రధాని స్వయంగా ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రామచంద్రపురం పట్టణం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి పాలాభిషేకం నిర్వహించారు.
భారత వైమానిక దళం 91వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు (ఆదివారం) జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వైమానిక దళ దినోత్సవం సందర్భంగా వైమానిక దళ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా.. వారి గొప్ప సేవ, త్యాగం మన గగనతల భద్రతకు భరోసానిస్తుందని అన్నారు. భారత వైమానిక దళం యొక్క ధైర్యసాహసాలు, నిబద్ధత, అంకితభావానికి భారతదేశం గర్విస్తోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.