US Reciprocal Tariffs: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ‘‘సుంకాల’’తో ప్రపంచదేశాలను భయపెడుతున్నాడు. ‘‘పరస్పర సుంకాలు’’ తప్పకుండా ఉంటాయని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మెక్సికో, కెనడా, చైనాలపై సుంకాలు విధించారు. మరోవైపు సుంకాలు విధింపులో భారత్ అగ్రస్థానంలో ఉందంటూ పలు సందర్భాల్లో ట్రంప్ తన అక్కసును వెళ్ళగక్కారు.
భారత్కి ట్రంప్ ‘‘F-35 స్టెల్త్ ఫైటర్ జెట్స్’’ ఆఫర్ చేశారు. ప్రపంచంలో ఉన్న యుద్ధవిమానాల్లో F-35 అత్యంత అడ్వాన్సుడ్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇది అత్యంత ప్రమాదకరమైన యుద్ధవిమానంగా పేరుంది. ఈ ఉంటే శత్రుదేశాలు హడలి చావాల్సిందే. ‘‘మేము భారతదేశానికి సైనిక అమ్మకాలను అనేక బిలియన్ డాలర్లకు పెంచుతాము. చివరికి భారతదేశానికి F-35 స్టీల్త్ ఫైటర్లను అందించడానికి కూడా మేము మార్గం సుగమం చేస్తున్నాము’’ అని ట్రంప్ స్యంగా ప్రకటించారు.
PM Modi: అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ సమయంలో ఆయన మాట్లాడుతూ.. యూఎస్లో అక్రమంగా ఉంటున్న తమ పౌరుల్ని భారత్ తిరిగి స్వీకరింస్తుందని చెప్పారు. అదే సమయంలో మానవ అక్రమ రవాణాని అంతం చేయడానికి ప్రయత్నాలు అవసరమని చెప్పారు.
PM Modi: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత తొలిసారి భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్లారు. వైట్ హౌజ్లో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాల గురించి చర్చించారు. ఈ పర్యటనలో రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇదిలా ఉంటే, ట్రంప్తో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో, ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘మేక్ ఇండియా గ్రేట్ ఎగైన్(MIGA)’ అని అన్నారు. ట్రంప్ అమెరికాని ‘‘మేక్ అమెరికా…
Donlad Trump: ప్రధాని నరేంద్రమోడీ, డొనాల్డ్ ట్రంప్తో భేటీపై రెండు దేశాలతో పాటు ప్రపంచవ్యా్ప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ మేరకు ఇద్దరు నేతల మధ్య ప్రపంచ రాజకీయాలు ప్రస్తావనకు వచ్చాయి. బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలను ట్రంప ఖండించినట్లు తెలుస్తోంది. అయితే, బంగ్లాదేశ్కి సంబంధించిన విషయాన్ని మోడీకి వదిలేస్తున్నట్లు ట్రంప్ చెప్పారు.
India US: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనలో ఉన్న వేళ మరో వార్త సంచలనంగా మారింది. అమెరికాలో డాక్యుమెంట్లు లేకుండా అక్రమంగా ఉంటున్న భారతీయ వలసదారులను ట్రంప్ సర్కార్ బహిష్కరిస్తోంది. ఇప్పటికే, ఫిబ్రవరి 05న 104 మంది భారతీయులను యూఎస్ మిలిటరీ విమానంలో అమృత్సర్కి తరలించారు. ఇదిలా ఉంటే, తాజాగా మరో విడత బహిష్కరణ మొదలైనట్లు తెలుస్తోంది. రెండో విడత భారతీయులతో శనివారం(ఫిబ్రవరి 15)న మరో విమానం అమృత్సర్ వస్తున్నట్లు తెలుస్తోంది.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని అమెరికా చేరారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత తొలిసారి మోడీ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనపై ఇరు దేశాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి. సుంకాలు, అక్రమ వలసదారులు, ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పలు అంశాలు ఇరు దేశాధినేతల చర్చల్లో ముఖ్యాంశాలుగా ఉండబోతున్నాయి.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన అమెరికా పర్యటనకు ముందు కీలక సందేశం ఇచ్చారు. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మోడీ భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ..‘‘ నా మిత్రుడు డొనాల్డ్ ట్రంప్ని కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని ఎక్స్లో ట్వీట్ చేశారు. ట్రంప్ మొదటి పదవీకాలంలో నిర్మించబడిన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడాని పర్యటన సహకరిస్తుందని మోడీ అన్నారు. ప్రధాని మోడీ ముందుగా మూడు రోజుల పర్యటన…
IMEC: ఈ వారం ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోడీ భేటీ కానున్నారు. అయితే, వీరిద్దరి మధ్య ఇరు దేశాల సంబంధాలు, రక్షణ, ఇతర అంశాలు చర్చకు రాబోతున్నాయి. ముఖ్యంగా ‘‘ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEC)’’ ప్రాజెక్టు ఇరువురి మధ్య కీలకంగా మారబోతోంది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(BRI) కు ప్రత్యామ్నాయంగా IMEC ఉండబోతోంది. ఈ ప్రాజెక్టులో బిలియనీర్ అదానీ కీలకంగా ఉన్నారు.
Delhi: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆప్ అధికారానికి బ్రేకులు వేసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ 48 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే, ప్రస్తుతం ఢిల్లీ సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే, ప్రధాని నరేంద్ర మోడీ ఈ వారం అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాతే ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి.