PM Modi: మిత్రుడు ‘‘ట్రంప్’’ని కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న.. మోడీ సందేశం..
- మిత్రుడు ట్రంప్ని కలిసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్న..
- యూఎస్ పర్యటనకు ముందు ప్రధాని మోడీ సందేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన అమెరికా పర్యటనకు ముందు కీలక సందేశం ఇచ్చారు. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మోడీ భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ..‘‘ నా మిత్రుడు డొనాల్డ్ ట్రంప్ని కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని ఎక్స్లో ట్వీట్ చేశారు. ట్రంప్ మొదటి పదవీకాలంలో నిర్మించబడిన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడాని పర్యటన సహకరిస్తుందని మోడీ అన్నారు.
ప్రధాని మోడీ ముందుగా మూడు రోజుల పర్యటన కోసం ఫ్రాన్స్ వెళ్తున్నారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్తో కలిసి ఏఐ యాక్షన్ సమ్మిట్లో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఆయన అమెరికా వెళ్తారు. ట్రంప్ జనవరిలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మొదటిసారిగా అమెరికా పర్యటనకు వెళ్తున్నారు.
Also Read
- Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
- Beggar Woman’s Surprising Savings: జీవితాంతం వీధుల్లో భిక్షాటన చేసిన మహిళ.. మరణానంతరం బయటపడ్డ రూ.8.40 లక్షలు!
- Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్ విచారణ
- Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
Read Also: Ranveer Allahbadia: ‘‘తల్లిదండ్రులు అది చేస్తుంటే చూస్తావా.?’’ యూట్యూబర్ అరెస్టుకి రంగం సిద్ధం..
“ఫ్రాన్స్ నుండి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు నేను రెండు రోజుల అమెరికా పర్యటనకు వెళ్తాను. నా స్నేహితుడు అధ్యక్షుడు ట్రంప్ను కలవడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. జనవరిలో ఆయన చారిత్రాత్మక ఎన్నికల విజయం, పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది మా మొదటి సమావేశం అయినప్పటికీ, భారతదేశం, అమెరికా మధ్య సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించడంలో ఆయన మొదటి పదవీకాలంలో కలిసి పనిచేయడం నాకు గుర్తుంది’’ అని ఆయన సందేశాన్ని తెలిపారు.
టెక్నాలజీ, వాణిజ్యం, రక్షణ మరియు శక్తితో సహా కీలక రంగాలలో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ పర్యటన మంచి అవకాశంగా ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. వాషింగ్టన్లో ట్రంప్తో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించిన తర్వాత అక్కడ వ్యాపారవేత్తలు, ఇండియన్ కమ్యూనిటీతో మోడీ మాట్లాడనున్నారు. సుంకాలు విధిస్తానని, అక్రమ వలసదారుల్ని అమెరికా నుంచి పంపిస్తానని ట్రంప్ హెచ్చరిస్తు్న్న నేపథ్యంలో, మోడీ పర్యటన కీలకంగా మారింది.
తాజావార్తలు
-
Anasuya: హిందూ ఆచారాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు.. అసలు స్కెచ్ ఇదేనా!
-
Tollywood Wedding: సైలెంట్గా న్యూజిలాండ్లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాక్టర్.. తన రియల్ హీరోయిన్తో ఫోటోలు వైరల్!
-
Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
-
Kriti Sanon: రాఖీ కట్టడానికి ఇలాంటి బట్టలే దొరికాయా?.. కృతి సనన్ లుక్పై నెటిజన్ల ఫైర్!
-
Janvi : డర్టీ ఇమేజ్ నుంచి బయట పడాల్సింది పోయి ఇవేం పనులు జాన్వీ?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!