Delhi: ప్రధాని మోడీ అమెరికా పర్యటన తర్వాతే ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం..
- ప్రధాని మోడీ యూఎస్ విజిట్ తర్వాతే ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం..
- ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ..
- 27 ఏళ్ల తర్వాత అధికారం..
- భారీగా ప్రమాణస్వీకార కార్యక్రమం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆప్ అధికారానికి బ్రేకులు వేసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ 48 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే, ప్రస్తుతం ఢిల్లీ సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే, ప్రధాని నరేంద్ర మోడీ ఈ వారం అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాతే ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 13న ప్రధాని మోడీ అమెరికా పర్యటన ఉంది. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడంతో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఎన్డీయే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన నేతలు హాజరవుతారని తెలుస్తోంది.
Read Also: BJP Celebrations: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా ఢిల్లీ విజయోత్సవ సంబరాలు
Also Read
- SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
- Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
- BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
దేశ రాజధానిలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవనున్నారు. ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా ఈ సాయంత్రం కొత్తగా ఎన్నికైన 48 మంది ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. నిన్న సాయంత్రం బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డాలు ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణస్వీకార కార్యక్రమం గురించి చర్చించారని తెలుస్తోంది.
బీజేపీ ఇప్పటికీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేదానిని ప్రకటించినప్పటికీ, న్యూఢిల్లీలో కేజ్రీవాల్ని ఓడించిన పర్వేష్ వర్మ ముందు వరసలో ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమ ఢిల్లీ నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన వర్మకు గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా అవకాశం ఇవ్వలేదు. వ్యూహాత్మకంగా ఢిల్లీ అసెంబ్లీ రేసులో నిలిపింది. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ని పర్వేష్ వర్మ 4000 ఓట్ల తేడాతో ఓడించారు. పర్వేష్ వర్మ ఢిల్లీ మాజీ సీఎం, దివంగత సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు.
తాజావార్తలు
-
SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
-
DC Success Gift : అందరికి ఇచ్చి ‘వామికాగబ్బీ’కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
-
BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
-
iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?