Delhi: ప్రధాని మోడీ అమెరికా పర్యటన తర్వాతే ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం..
- ప్రధాని మోడీ యూఎస్ విజిట్ తర్వాతే ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం..
- ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ..
- 27 ఏళ్ల తర్వాత అధికారం..
- భారీగా ప్రమాణస్వీకార కార్యక్రమం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆప్ అధికారానికి బ్రేకులు వేసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ 48 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే, ప్రస్తుతం ఢిల్లీ సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే, ప్రధాని నరేంద్ర మోడీ ఈ వారం అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాతే ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 13న ప్రధాని మోడీ అమెరికా పర్యటన ఉంది. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడంతో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఎన్డీయే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన నేతలు హాజరవుతారని తెలుస్తోంది.
Read Also: BJP Celebrations: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా ఢిల్లీ విజయోత్సవ సంబరాలు
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
దేశ రాజధానిలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవనున్నారు. ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా ఈ సాయంత్రం కొత్తగా ఎన్నికైన 48 మంది ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. నిన్న సాయంత్రం బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డాలు ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణస్వీకార కార్యక్రమం గురించి చర్చించారని తెలుస్తోంది.
బీజేపీ ఇప్పటికీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేదానిని ప్రకటించినప్పటికీ, న్యూఢిల్లీలో కేజ్రీవాల్ని ఓడించిన పర్వేష్ వర్మ ముందు వరసలో ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమ ఢిల్లీ నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన వర్మకు గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా అవకాశం ఇవ్వలేదు. వ్యూహాత్మకంగా ఢిల్లీ అసెంబ్లీ రేసులో నిలిపింది. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ని పర్వేష్ వర్మ 4000 ఓట్ల తేడాతో ఓడించారు. పర్వేష్ వర్మ ఢిల్లీ మాజీ సీఎం, దివంగత సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!