Delhi: ప్రధాని మోడీ అమెరికా పర్యటన తర్వాతే ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం..
- ప్రధాని మోడీ యూఎస్ విజిట్ తర్వాతే ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం..
- ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ..
- 27 ఏళ్ల తర్వాత అధికారం..
- భారీగా ప్రమాణస్వీకార కార్యక్రమం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆప్ అధికారానికి బ్రేకులు వేసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ 48 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే, ప్రస్తుతం ఢిల్లీ సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే, ప్రధాని నరేంద్ర మోడీ ఈ వారం అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాతే ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 13న ప్రధాని మోడీ అమెరికా పర్యటన ఉంది. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడంతో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఎన్డీయే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన నేతలు హాజరవుతారని తెలుస్తోంది.
Read Also: BJP Celebrations: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా ఢిల్లీ విజయోత్సవ సంబరాలు
Also Read
- Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
- Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
దేశ రాజధానిలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవనున్నారు. ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా ఈ సాయంత్రం కొత్తగా ఎన్నికైన 48 మంది ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. నిన్న సాయంత్రం బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డాలు ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణస్వీకార కార్యక్రమం గురించి చర్చించారని తెలుస్తోంది.
బీజేపీ ఇప్పటికీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేదానిని ప్రకటించినప్పటికీ, న్యూఢిల్లీలో కేజ్రీవాల్ని ఓడించిన పర్వేష్ వర్మ ముందు వరసలో ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమ ఢిల్లీ నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన వర్మకు గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా అవకాశం ఇవ్వలేదు. వ్యూహాత్మకంగా ఢిల్లీ అసెంబ్లీ రేసులో నిలిపింది. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ని పర్వేష్ వర్మ 4000 ఓట్ల తేడాతో ఓడించారు. పర్వేష్ వర్మ ఢిల్లీ మాజీ సీఎం, దివంగత సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు.
తాజావార్తలు
-
Sabari River Flood: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
-
Explainer: టార్గెట్ ఇండియా? పాక్కు బాంబులు పంపుతున్న టర్కీ!
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Vivo T5 5G: వివో T5 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 7,050mAh బ్యాటరీ, 144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే
-
Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
ట్రెండింగ్
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!