Mamata Banerjee: బీజేపీ చెప్పినట్లు చేసేవారిని నియమించారు.. బెంగాల్ అధికారుల మార్పుపై మమతా ఫైర్..
- ఎన్నికలకు ముందు మమతా వర్సెస్ ఈసీ..
- అధికారుల బదిలీపై బెంగాల్ సీఎం తీవ్ర ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్తో పాటు కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. ఇది జరిగిన ఒక రోజు తర్వాత బెంగాల్ వ్యాప్తంగా కీలక అధికారుల్ని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. కీలకమైన డీజీపీ, సీఎస్, కోల్కతా పోలీస్ కమిషనర్ వంటి పోస్టుల్లో పనిచేస్తున్న వారిని తొలగించి, వేరే వారికి బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు, ఇది రాజకీయ వివాదంగా మారింది. ఈసీ నిర్ణయంపై తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు.
Read Also: Al-Aqsa Mosque: రంజాన్ మాసంలో పవిత్ర ‘‘అల్-అక్సా మసీదు’’ మూసివేత.. ముస్లిం దేశాల ఆగ్రహం..
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులను తొలగించడాన్ని నిరసిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు లేఖ రాశారు. ఈ చర్యలు ‘‘ఏకపక్షమైనవి’’, ‘‘తీవ్ర ఆందోళన కలిగించే విషయాలు’’ అని ఆమె పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ ఇలాంటి ఏకపక్ష చర్యలు తీసుకోకుండా ఉండాలని ఆమె లేఖలో రాశారు. ఇలాంటి మార్పులు చేసే అధికారం కమిషన్కు ఉన్నప్పటికీ, గత ఎన్నికల సమయంలో “రాజ్యాంగ సముచితం, పరిపాలనా సంప్రదాయం ప్రకారం వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు” అని బెనర్జీ అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం చర్య ఎన్నికల సంఘం విశ్వసనీయత, సంస్థాగత సమగ్రతను నీరుగార్చే ప్రమాదం ఉందని ఆమె అన్నారు. ఇది రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘిస్తుందని చెప్పారు.
ఎన్నికల తేదీలను ప్రకటించిన కొద్దిసేపటికే, ప్రధాన కార్యదర్శి నందిని చక్రవర్తి, రాష్ట్ర పోలీసు అధిపతి పీయూష్ పాండే, కోల్కతా పోలీసు కమిషనర్ సుప్రతీమ్ సర్కార్, పశ్చిమ బెంగాల్ హోం కార్యదర్శి జగదీష్ ప్రసాద్ మీనాలను ఎన్నికల సంఘం తొలగించింది. దీనిపై మమతా బెనర్జీ ఆగ్రహంగా ఉన్నారు. ఇదే కాకుండా ఈ అధికారులకు ఎలాంటి ఎన్నికల బాధ్యతలు అప్పగించవద్దని ఎన్నిక సంఘం ఆదేశించింది. సమర్థులైన బెంగాలేతర అధికారుల్ని కూడా ఈసీ తొలగించిందని, కేవలం బీజేపీ చెప్పినట్లు నడుచుకునే వారిని మాత్రమే ఎంపిక చేసిందని మమతా బెనర్జీ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!