Mamata Banerjee: బీజేపీ చెప్పినట్లు చేసేవారిని నియమించారు.. బెంగాల్ అధికారుల మార్పుపై మమతా ఫైర్..
- ఎన్నికలకు ముందు మమతా వర్సెస్ ఈసీ..
- అధికారుల బదిలీపై బెంగాల్ సీఎం తీవ్ర ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్తో పాటు కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. ఇది జరిగిన ఒక రోజు తర్వాత బెంగాల్ వ్యాప్తంగా కీలక అధికారుల్ని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. కీలకమైన డీజీపీ, సీఎస్, కోల్కతా పోలీస్ కమిషనర్ వంటి పోస్టుల్లో పనిచేస్తున్న వారిని తొలగించి, వేరే వారికి బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు, ఇది రాజకీయ వివాదంగా మారింది. ఈసీ నిర్ణయంపై తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు.
Read Also: Al-Aqsa Mosque: రంజాన్ మాసంలో పవిత్ర ‘‘అల్-అక్సా మసీదు’’ మూసివేత.. ముస్లిం దేశాల ఆగ్రహం..
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులను తొలగించడాన్ని నిరసిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు లేఖ రాశారు. ఈ చర్యలు ‘‘ఏకపక్షమైనవి’’, ‘‘తీవ్ర ఆందోళన కలిగించే విషయాలు’’ అని ఆమె పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ ఇలాంటి ఏకపక్ష చర్యలు తీసుకోకుండా ఉండాలని ఆమె లేఖలో రాశారు. ఇలాంటి మార్పులు చేసే అధికారం కమిషన్కు ఉన్నప్పటికీ, గత ఎన్నికల సమయంలో “రాజ్యాంగ సముచితం, పరిపాలనా సంప్రదాయం ప్రకారం వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు” అని బెనర్జీ అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం చర్య ఎన్నికల సంఘం విశ్వసనీయత, సంస్థాగత సమగ్రతను నీరుగార్చే ప్రమాదం ఉందని ఆమె అన్నారు. ఇది రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘిస్తుందని చెప్పారు.
ఎన్నికల తేదీలను ప్రకటించిన కొద్దిసేపటికే, ప్రధాన కార్యదర్శి నందిని చక్రవర్తి, రాష్ట్ర పోలీసు అధిపతి పీయూష్ పాండే, కోల్కతా పోలీసు కమిషనర్ సుప్రతీమ్ సర్కార్, పశ్చిమ బెంగాల్ హోం కార్యదర్శి జగదీష్ ప్రసాద్ మీనాలను ఎన్నికల సంఘం తొలగించింది. దీనిపై మమతా బెనర్జీ ఆగ్రహంగా ఉన్నారు. ఇదే కాకుండా ఈ అధికారులకు ఎలాంటి ఎన్నికల బాధ్యతలు అప్పగించవద్దని ఎన్నిక సంఘం ఆదేశించింది. సమర్థులైన బెంగాలేతర అధికారుల్ని కూడా ఈసీ తొలగించిందని, కేవలం బీజేపీ చెప్పినట్లు నడుచుకునే వారిని మాత్రమే ఎంపిక చేసిందని మమతా బెనర్జీ మండిపడ్డారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!