T20 World Cup: టీ20 వరల్డ్ కప్ వివాదాలు ఇంకా ముగియడం లేదు. బంగ్లాదేశ్ భారత్లో భద్రతా కారణాలు చూపుతూ ఆడేందుకు నిరాకరించింది. దీంతో ఐసీసీ ఆ దేశాన్ని టోర్నీ నుంచి బహిష్కరించింది. మరోవైపు, బంగ్లాకు మద్దతుగా భారత్తో తాము మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వెల్లడించింది.
ICC Warns Pakistan: మరో మూడు రోజుల్లో ప్రారంభమయ్యే ( ఫిబ్రవరి 7న) టీ20 వరల్డ్ కప్ 2026పై వివాదం కొనసాగుతుంది. ఈ నెల (ఫిబ్రవరి) 15న కొలంబోలో భారత్తో టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను బహిష్కరించినందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)పై న్యాయపరమైన చర్యలు తప్పవని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) హెచ్చరించింది.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆర్థిక పరిస్థితిపై మాజీ ఛైర్మన్, మాజీ క్రికెటర్ రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత్ డబ్బులపైనే పాకిస్థాన్ క్రికెట్ బతుకుతుంది? అని పరోక్షంగా చెప్పారు. రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీశాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రమీజ్ రాజా.. పీసీబీ ఆదాయంలో సగానికి పైగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నుంచి వస్తుందని అంగీకరించారు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే.. ఐసీసీకి వచ్చే…
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మరోసారి అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో నవ్వులపాలవుతోంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి ప్రత్యామ్నాయంగా.. తమకంటూ ఒక ఐసీసీ స్థాయి క్రికెట్ సంస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో పీసీబీ చేసిన ప్రయత్నం పూర్తిగా ఫెయిల్ అయినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు మద్దతు కోరుతూ పీసీబీ ఏకంగా 8 క్రికెట్ బోర్డులను సంప్రదించినట్లు తెలుస్తోంది. అందులో కేవలం రెండు దేశాలు మాత్రమే మద్దతు ఇవ్వడంతో పీసీబీకి భారీ షాక్ తగిలింది. కొత్త క్రికెట్ బోర్డు…
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై లెజెండరీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. టీ20 వరల్డ్కప్ 2026లో బంగ్లా ఆడకపోతే.. పాకిస్థాన్ కూడా బహిష్కరిస్తుంది అనే పీసీబీ ఆలోచనపై అక్రమ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తరహా ఆలోచనలు పాకిస్థాన్ క్రికెట్కు మేలు చేయవని స్పష్టం చేశారు. పొట్టి ప్రపంచకప్లో భాగంగా భారత్తో మ్యాచ్ను పాక్ బహిష్కరించిన విషయం తెలిసిందే. దాయాదుల మధ్య లీగ్ మ్యాచ్…
Pakistan vs ICC: క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసేలా భారత్తో జరగాల్సిన తమ టీ20 వరల్డ్కప్ మ్యాచ్ను (ఫిబ్రవరి 15) “బహిష్కరిస్తున్నట్లు” పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, భారత్తో మ్యాచ్ను మాత్రమే బహిష్కరించి మిగతా అన్ని జట్లతో ఆడేందుకు అనుమతి ఇవ్వడం తీవ్ర వివాదానికి దారి తీస్తోంది.
పాకిస్థాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. అతడి బౌలింగ్ యాక్షన్పై ఇప్పటికే అనేకసార్లు ప్రశ్నలు తలెత్తగా.. ఇప్పుడు అవి మరింత తీవ్రతరం అయ్యాయి. తాజా సమాచారం ప్రకారం.. తారిక్ బౌలింగ్ యాక్షన్పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారికంగా ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతోందట. ఈ పరిణామం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. లాహోర్లోని గడ్డాఫీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో తారిక్ బౌలింగ్ చేయడమే…
Ajinkya Rahane: టీ20 వరల్డ్ కప్ వివాదాలు ఇంకా ముగియడం లేదు. భద్రతా కారణాల వల్ల తాము భారత్లో ఆడమని చెప్పిన బంగ్లాదేశ్, చివరకు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక, బంగ్లాదేశ్కు సంఘీభావంగా మేము కూడా టోర్నీని బహిష్కరించే ఆలోచన చేస్తామని చెప్పిన పాకిస్తాన్, ఇంకా టోర్నీ ఆడుతుందా లేదా అనే క్లారిటీ ఇవ్వలేదు.
భద్రత కారణాల దృష్ట్యా భారత్లో టీ20 వరల్డ్కప్ 2026 మ్యాచ్లు ఆడటానికి బంగ్లాదేశ్ నిరాకరించిన విషయం తెలిసిందే. బంగ్లాను మెగా టోర్నీ నుంచి ఐసీసీ బహిష్కరించింది. బంగ్లాదేశ్కు సంఘీభావంగా తాము కూడా టోర్నీ నుంచి వైదొలుగుతామని పాకిస్థాన్ టీం కామెంట్స్ చేసింది. ఈ నేపథ్యంలో పాక్ మెగా టోర్నీలో ఆడుతుందా? లేదా? అనే సస్పెన్స్ కొనసాగుతోంది. టీ20 వరల్డ్కప్ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ టోర్నీలో పాల్గొనాలా? వద్దా?…
T20 World Cup: భారత్లో ఆడమని ప్రకటించి బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ నుంచి బహిష్కరణకు గురైంది. బంగ్లాకు మద్దతుగా తాము కూడా టోర్నీని బహిష్కరిస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) ప్రగల్భాలు పలికింది. అయితే, టోర్నీని బాయ్కాట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఆంక్షలు విధిస్తామని ఐసీసీ హెచ్చరించింది. ఈ దెబ్బతో పాకిస్తాన్ దిగొచ్చింది. చివరకు టీ20 ప్రపంచ కప్ 2026 కోసం తన జట్టును ప్రకటించింది. ఐసీసీ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే పీసీబీ 15 మందితో…