India vs Pakistan: భారత్తో మ్యాచ్ ఆడేందుకు పాక్ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. ఇక, 15న దబిడి దిబిడే
- భారత్తో మ్యాచ్ ఆడేందుకు పాక్ సర్కార్ గ్రీన్ సిగ్నల్..
- మిత్ర దేశాల విజ్ఞప్తితో భారత్తో మ్యాచ్ ఆడేందుకు పాక్ నిర్ణయం..
- ఈ నెల 15వ తేదీన కొలంబో వేదికగా భారత్- పాక్ మ్యాచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan: టీ20 ప్రపంచకప్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ షెడ్యూలు ప్రకారమే కొనసాగనుంది. ఆ మ్యాచ్ను బహిష్కరించాలన్న తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం సోమవారం ( ఫిబ్రవరి 9న) ప్రకటించింది. చర్చల ద్వారా వచ్చిన ఫలితంతో సంతృప్తి చెందడంతో పాటు మిత్ర దేశాల విజ్ఞప్తితో భారత్తో మ్యాచ్ ఆడేందుకు తమ టీంకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు వెల్లడించింది. టీమిండియా- పాక్ మ్యాచ్ ఈ నెల 15వ తేదీన కొలంబోలో జరగనుంది.
Read Also: Naravane Book Leak: మాజీ ఆర్మీ చీఫ్ ఆత్మకథ లీక్.. ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో బయటపడే నిజాలేమిటి.?
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
అయితే, గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), ఐసీసీ మధ్య సుధీర్ఘ చర్చలు జరిగాయి. భారత్తో మ్యాచ్ బహిష్కరణ నిర్ణయంపై మరోసారి ఆలోచించాలని శ్రీలంక, ఎమిరేట్స్ బోర్డులు పీసీబీని కోరాయి. టీమిండియాతో మ్యాచ్ ఆడాలని పాక్ కు తాను విజ్ఞప్తి చేసినట్లు బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లామ్ పేర్కొన్నాడు. శ్రీలంక ప్రధాని అనురకుమార కూడా పాక్ ప్రధాని షరీఫ్తో ఫోన్లో మాట్లాడినట్లు దాయాది దేశం వెల్లడించింది. ఇక, పాక్, భారత్, బంగ్లాదేశ్లతో ముక్కోణపు సిరీస్ను నిర్వహించాలని పీసీబీ పెట్టిన డిమాండ్ను ఐసీసీ పూర్తిగా తిరస్కరించింది.
Read Also: Tragedy : పెళ్లి వేడుకలో విషాదం.. స్విమ్మింగ్ పూల్లో పడి బాలుడి మృతి..
ఇక, ప్రపంచకప్కు దూరంగా ఉండటంతో బంగ్లాదేశ్ బోర్డుకు జరిగిన ఆర్థిక నష్టాన్ని పూడ్చేందుకు పీసీబీ ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తుంది. భారత్తో ద్వైపాక్షిక క్రికెట్ పునరుద్ధరణకు కూడా పీసీబీ డిమాండ్ చేయగా.. అది ఐసీసీ చేతుల్లో లేదని వెల్లడించింది. అయితే, వచ్చే అండర్-19 ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను బంగ్లాకు కట్టబెట్టే ఛాన్స్ ని ఐసీసీ పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. భారత్లో టీ20 ప్రపంచకప్ ఆడేందుకు తిరస్కరించడంతో బంగ్లాదేశ్పై ఎలాంటి ఆంక్షలు విధించమని ఐసీసీ తేల్చి చెప్పింది.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!