IPL 2026 : క్రికెట్ పండగకు ముహూర్తం ఖరారు.. కానీ చిన్న ట్విస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026 : ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 (IPL 19వ సీజన్) సందడి మొదలైంది. అయితే, షెడ్యూల్ విషయంలో బీసీసీఐ (BCCI) ఒక కీలక మార్పు చేసినట్లు సమాచారం. తొలుత మార్చి 26న ప్రారంభం కావాల్సిన ఈ ధనాధన్ టోర్నీ, ఇప్పుడు రెండు రోజులు ఆలస్యంగా అంటే మార్చి 28 (శనివారం) నుండి ప్రారంభం కానుందని సమాచారం. మే 31న గ్రాండ్ ఫైనల్ జరగనుందని టాక్. ఈ నేపథ్యంలో అసలు ఐపీఎల్ ఎందుకు ఆలస్యమవుతోంది? ఎన్నికల ఎఫెక్ట్ ఏయే జట్లపై పడనుంది? బీసీసీఐ ప్లాన్ ఏంటి? వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
Also Read
- నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
- Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
- Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం తేదీలే కాదు, వేదికల విషయంలో కూడా ఈసారి అనూహ్య మార్పులు ఉండబోతున్నాయని ప్రచారం జరుగుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలి మ్యాచ్ ఆడాల్సి ఉన్నా, చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ నిర్వహణపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.
ఎన్నికల కమిషన్ షెడ్యూల్ను బట్టి బీసీసీఐ (BCCI) ఐపీఎల్ పాక్షిక షెడ్యూల్ను విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో ఐపీఎల్ 2026 గ్రాండ్ ఓపెనింగ్ మార్చి 26 అనుకున్నప్పటికీ, ఇప్పుడు రెండు రోజులు ఆలస్యంగా మార్చి 28న ప్రారంభం కానుందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మే 31న జరగనుందని తెలుస్తుంది.
ఆలస్యం ఎందుకు..
తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల తేదీల ప్రకటన కోసం బీసీసీఐ వేచి చూస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఆయా తేదీల్లో మ్యాచ్లు నిర్వహించడం కష్టం కాబట్టి, ఎన్నికల షెడ్యూల్ వచ్చాకే పూర్తి ఐపీఎల్ షెడ్యూల్ ఖరారవుతుందని సమాచారం. అలాగే మార్చి 8న ముగిసే టీ20 ప్రపంచకప్ 2026 తర్వాత స్టేడియాలను ఐపీఎల్ కోసం సిద్ధం చేయడానికి కనీసం రెండు వారాల సమయం పడుతుంది. ఈ ఐపీఎల్ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భద్రతా కారణాల దృష్ట్యా ఇంకా అనుమతులు రాలేదు. ఒకవేళ అక్కడ సాధ్యం కాకపోతే, నవీ ముంబై, రాయ్పూర్ లేదా పూణేలలో ఏదో ఒక స్టేడియంలో తొలి మ్యాచ్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి ఈ ఏడాది ఐపీఎల్ అనుకున్న టైంలో రావచ్చని చెబుతున్నారు.
READ ALSO: Pakistan Cricket: పాక్ క్రికెట్ హిస్టరీలో బిగ్గెస్ట్ సర్జరీ.. ఈ స్టార్ల కెరీర్ ఇక ముగిసినట్టేనా?
తాజావార్తలు
-
Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
-
నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
-
Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
-
Praggnanandhaa: తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ 2026 టైటిల్కైవసం
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!