BCCI vs PCB: నీయవ్వ తగ్గేదేలే.. పాకిస్థాన్ డిమాండ్లకు నో చెప్పిన బీసీసీఐ!
- కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ
- పాకిస్థాన్ డిమాండ్లకు నో చెప్పిన బీసీసీఐ
- ద్వైపాక్షిక సిరీస్లు ఆడే ఆలోచన లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PCB Demands Rejected By BCCI Ahead of IND vs PAK Match: భారత్-పాకిస్థాన్ క్రికెట్ సంబంధాలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పెట్టిన అన్ని డిమాండ్లను బీసీసీఐ తిరస్కరించినట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో భారత్తో మ్యాచ్ ఆడాలంటే.. పీసీబీ పలు షరతులు పెట్టిన విషయం తెలిసిందే. ఆ షరతులపై బీసీసీఐ తన స్పష్టమైన వైఖరిని తెలిపింది. పాకిస్థాన్ డిమాండ్లకు అస్సలు ఒప్పుకునేది లేదని బీసీసీఐ ఐసీసీకి తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. పాకిస్థాన్తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్లు ఆడే ఆలోచనలో భారత్ లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ, భద్రతా పరిస్థితుల కారణంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదని భారత బోర్డు స్పష్టం చేసింది. అదేవిధంగా ఆసియా కప్ లేదా వరల్డ్కప్ మ్యాచ్ల కోసం భారత్ పాకిస్థాన్కు వెళ్లబోదని కూడా స్పష్టంగా తెలిపింది. భవిష్యత్తులో జరిగే ఏ అంతర్జాతీయ టోర్నమెంట్ అయినా.. భారత్ పాల్గొంటే, అది న్యూట్రల్ వేదికలోనే జరుగుతుందని బోర్డు వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read
- Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Lionel Messi: ఫుట్బాల్ ప్రపంచంలో శకం సమాప్తం.. అర్జెంటీనా దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్..
- Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
మరో కీలక అంశంగా బంగ్లాదేశ్తో ద్వైపాక్షిక సిరీస్ల విషయమూ చర్చకు వచ్చింది. తాజా పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్తో కూడా ప్రస్తుతం ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్లు ఆడే ప్రణాళిక లేదని సమాచారం. ఈ నిర్ణయం కూడా క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే భారత్-పాకిస్థాన్ మ్యాచ్లలో హ్యాండ్షేక్ అంశంపై మాత్రం ఇంకా చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఆట ముగిసిన తర్వాత లేదా మ్యాచ్ ముందు ఆటగాళ్ల మధ్య హ్యాండ్షేక్ ప్రోటోకాల్పై స్పష్టత రావాల్సి ఉంది. ఈ అంశంపై తుది నిర్ణయం ఇంకా వెలువడలేదని సమాచారం.
Also Read: Nandan Yadav: ఎంఎస్ ధోనీలా సిక్సులు కొట్టాలి.. ఇదే మేం నేర్చుకున్న గుణపాఠం: నేపాల్ క్రికెటర్
భారత్తో మ్యాచ్ ఆడాలంటే ఐసీసీకి పీసీబీ మూడు డిమాండ్స్ పెట్టింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగాలి, మ్యాచ్ ముందు అండ్ తర్వాత ప్లేయర్స్ హ్యాండ్షేక్ ఇచ్చుకోవాలి, ఎక్కువ వాటా శాతం అంటూ డిమాండ్స్ చేసింది. పీసీబీ పెట్టిన డిమాండ్లకు బీసీసీఐ ‘నో’ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయాలు భారత్–పాకిస్థాన్ క్రికెట్ సంబంధాల్లో మరో కీలక మలుపుగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్ తన భద్రత, విధానాల విషయంలో ఎలాంటి రాజీకి సిద్ధంగా లేదని ఈ పరిణామాలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి.
తాజావార్తలు
-
YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
-
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
-
Times Square Stabbing: న్యూయార్క్లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్లో హతం!
-
Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
-
Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!