BCCI vs PCB: నీయవ్వ తగ్గేదేలే.. పాకిస్థాన్ డిమాండ్లకు నో చెప్పిన బీసీసీఐ!
- కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ
- పాకిస్థాన్ డిమాండ్లకు నో చెప్పిన బీసీసీఐ
- ద్వైపాక్షిక సిరీస్లు ఆడే ఆలోచన లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PCB Demands Rejected By BCCI Ahead of IND vs PAK Match: భారత్-పాకిస్థాన్ క్రికెట్ సంబంధాలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పెట్టిన అన్ని డిమాండ్లను బీసీసీఐ తిరస్కరించినట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో భారత్తో మ్యాచ్ ఆడాలంటే.. పీసీబీ పలు షరతులు పెట్టిన విషయం తెలిసిందే. ఆ షరతులపై బీసీసీఐ తన స్పష్టమైన వైఖరిని తెలిపింది. పాకిస్థాన్ డిమాండ్లకు అస్సలు ఒప్పుకునేది లేదని బీసీసీఐ ఐసీసీకి తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. పాకిస్థాన్తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్లు ఆడే ఆలోచనలో భారత్ లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ, భద్రతా పరిస్థితుల కారణంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదని భారత బోర్డు స్పష్టం చేసింది. అదేవిధంగా ఆసియా కప్ లేదా వరల్డ్కప్ మ్యాచ్ల కోసం భారత్ పాకిస్థాన్కు వెళ్లబోదని కూడా స్పష్టంగా తెలిపింది. భవిష్యత్తులో జరిగే ఏ అంతర్జాతీయ టోర్నమెంట్ అయినా.. భారత్ పాల్గొంటే, అది న్యూట్రల్ వేదికలోనే జరుగుతుందని బోర్డు వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read
- Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
- Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
- IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
- Rohit Sharma: ఇంగ్లండ్తో మూడో వన్డే మ్యాచ్.. అదే రోహిత్కు ప్రధాన సమస్య!
మరో కీలక అంశంగా బంగ్లాదేశ్తో ద్వైపాక్షిక సిరీస్ల విషయమూ చర్చకు వచ్చింది. తాజా పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్తో కూడా ప్రస్తుతం ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్లు ఆడే ప్రణాళిక లేదని సమాచారం. ఈ నిర్ణయం కూడా క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే భారత్-పాకిస్థాన్ మ్యాచ్లలో హ్యాండ్షేక్ అంశంపై మాత్రం ఇంకా చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఆట ముగిసిన తర్వాత లేదా మ్యాచ్ ముందు ఆటగాళ్ల మధ్య హ్యాండ్షేక్ ప్రోటోకాల్పై స్పష్టత రావాల్సి ఉంది. ఈ అంశంపై తుది నిర్ణయం ఇంకా వెలువడలేదని సమాచారం.
Also Read: Nandan Yadav: ఎంఎస్ ధోనీలా సిక్సులు కొట్టాలి.. ఇదే మేం నేర్చుకున్న గుణపాఠం: నేపాల్ క్రికెటర్
భారత్తో మ్యాచ్ ఆడాలంటే ఐసీసీకి పీసీబీ మూడు డిమాండ్స్ పెట్టింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగాలి, మ్యాచ్ ముందు అండ్ తర్వాత ప్లేయర్స్ హ్యాండ్షేక్ ఇచ్చుకోవాలి, ఎక్కువ వాటా శాతం అంటూ డిమాండ్స్ చేసింది. పీసీబీ పెట్టిన డిమాండ్లకు బీసీసీఐ ‘నో’ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయాలు భారత్–పాకిస్థాన్ క్రికెట్ సంబంధాల్లో మరో కీలక మలుపుగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్ తన భద్రత, విధానాల విషయంలో ఎలాంటి రాజీకి సిద్ధంగా లేదని ఈ పరిణామాలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
-
Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!