India vs Pakistan: వాటా, సిరీస్లు, హ్యాండ్షేక్.. పాకిస్థాన్ డిమాండ్స్ ఇవే!
- భారత్తో మ్యాచ్ ఆడమని ప్రకటించిన పాకిస్థాన్ ప్రభుత్వం
- భారత్తో మ్యాచ్కు సిద్ధమంటూ పాక్ సంకేతాలు
- భారత్తో మ్యాచ్ కోసం పాక్ డిమాండ్స్ ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్ 2026లో భారత్తో మ్యాచ్ ఆడేది లేదని పాకిస్థాన్ ప్రభుత్వం తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం అధికారికంగా ఐసీసీకి ఇంకా ఏమీ చెప్పలేదు. మ్యాచ్ ఆడకుంటే కఠిన చర్యలు తప్పవని పీసీబీని ఐసీసీ హెచ్చరించింది. అయితే మొన్నటి వరకు బీరాలకు పోయిన పీసీబీ.. ఇప్పుడు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తాజాగా ఐసీసీతో జరిగిన సమావేశంలో పాల్గొన్న పీసీబీ.. భారత్తో మ్యాచ్కు తాము సిద్ధమంటూ, మూడు కీలక డిమాండ్లను ముందుంచినట్లు తెలుస్తోంది. ఆ డిమాండ్స్ ఏవో చూద్దాం.
తాజా సమాచారం ప్రకారం.. భారత్తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్థాన్ మూడు ప్రధాన డిమాండ్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో మొదటిది ఐసీసీ రెవెన్యూలో ఎక్కువ వాటా. భారత జట్టు మ్యాచ్ల వల్ల ఐసీసీకి భారీ ఆదాయం వస్తున్న నేపథ్యంలో.. ఆ లాభాల్లో తమకు కూడా ఎక్కువ శాతం ఇవ్వాలని పీసీబీ కోరుతోందని సమాచారం. రెండో డిమాండ్ సంచలనం అనే చెప్పాలి. అదే భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్ల పునరుద్ధరణ. గత కొన్నేళ్లుగా రాజకీయ పరిస్థితుల కారణంగా రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. భారత్తో ఆడేది లేదు అని ప్రకటించిన పీసీబీ.. ఇప్పుడు మాత్రం ద్వైపాక్షిక సిరీస్ కావాలని కోరడం విశేషం.
Also Read
- Tilak Varma: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు..!
- Pujara Team: కోహ్లీ, సచిన్లకు మిడిల్ ఆర్డర్ బాధ్యతలు.. రహానేకు షాక్... లక్ష్మణ్కే ఓటు..
- Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
- Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
Also Read: Sanju Samson: రెండు ప్రపంచకప్లు, 10 మ్యాచ్లు.. సంజు శాంసన్ ఎన్ని రన్స్ చేశాడంటే?
మూడో డిమాండ్ హ్యాండ్షేక్ ప్రోటోకాల్. మ్యాచ్ ముందు, తర్వాత భారత ఆటగాళ్లు తప్పనిసరిగా హ్యాండ్షేక్ చేయాలన్న నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని ఐసీసీ పాకిస్థాన్ కోరుతోంది. ఇది స్పోర్ట్స్మన్షిప్ పేరుతో పెట్టిన డిమాండ్ అయినా.. దీనిపై కూడా చర్చ జరుగుతోంది. ఈ డిమాండ్లపై ఐసీసీ, బీసీసీఐ ఎలా స్పందిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు.. కోట్లాది అభిమానుల భావోద్వేగాలతో కూడిన హై-వోల్టేజ్ ఈవెంట్. కానీ ఆ మ్యాచ్కు షరతులు పెట్టడం ఎంతవరకు సరైనదన్న చర్చ ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్గా మారింది.
తాజావార్తలు
-
SCO Summit: పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్
-
Tilak Varma: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు..!
-
Imran Khan Gets Relief: ఇమ్రాన్ ఖాన్కు పాక్ కోర్టులో భారీ ఊరట..
-
Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంట్లో విషాదం.. మేనకోడలు ఆత్మహత్య
-
AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!