India vs Pakistan: వాటా, సిరీస్లు, హ్యాండ్షేక్.. పాకిస్థాన్ డిమాండ్స్ ఇవే!
- భారత్తో మ్యాచ్ ఆడమని ప్రకటించిన పాకిస్థాన్ ప్రభుత్వం
- భారత్తో మ్యాచ్కు సిద్ధమంటూ పాక్ సంకేతాలు
- భారత్తో మ్యాచ్ కోసం పాక్ డిమాండ్స్ ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్ 2026లో భారత్తో మ్యాచ్ ఆడేది లేదని పాకిస్థాన్ ప్రభుత్వం తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం అధికారికంగా ఐసీసీకి ఇంకా ఏమీ చెప్పలేదు. మ్యాచ్ ఆడకుంటే కఠిన చర్యలు తప్పవని పీసీబీని ఐసీసీ హెచ్చరించింది. అయితే మొన్నటి వరకు బీరాలకు పోయిన పీసీబీ.. ఇప్పుడు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తాజాగా ఐసీసీతో జరిగిన సమావేశంలో పాల్గొన్న పీసీబీ.. భారత్తో మ్యాచ్కు తాము సిద్ధమంటూ, మూడు కీలక డిమాండ్లను ముందుంచినట్లు తెలుస్తోంది. ఆ డిమాండ్స్ ఏవో చూద్దాం.
తాజా సమాచారం ప్రకారం.. భారత్తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్థాన్ మూడు ప్రధాన డిమాండ్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో మొదటిది ఐసీసీ రెవెన్యూలో ఎక్కువ వాటా. భారత జట్టు మ్యాచ్ల వల్ల ఐసీసీకి భారీ ఆదాయం వస్తున్న నేపథ్యంలో.. ఆ లాభాల్లో తమకు కూడా ఎక్కువ శాతం ఇవ్వాలని పీసీబీ కోరుతోందని సమాచారం. రెండో డిమాండ్ సంచలనం అనే చెప్పాలి. అదే భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్ల పునరుద్ధరణ. గత కొన్నేళ్లుగా రాజకీయ పరిస్థితుల కారణంగా రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. భారత్తో ఆడేది లేదు అని ప్రకటించిన పీసీబీ.. ఇప్పుడు మాత్రం ద్వైపాక్షిక సిరీస్ కావాలని కోరడం విశేషం.
Also Read
- Jai Moondra: రెండు మ్యాచ్లకే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అండ్ 'సిరీస్'.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
- Team India: పసికూన ఎంత పనిచేసే.. 1050 రోజుల తర్వాత టీమిండియాకు షాక్.. అజేయ పరంపరకు బ్రేక్!
- Lorcan Tucker: టీమిండియాపై టీ20 సిరీస్ గెలిచామా.. నేను ఇంకా నమ్మలేకపోతున్నా!
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
Also Read: Sanju Samson: రెండు ప్రపంచకప్లు, 10 మ్యాచ్లు.. సంజు శాంసన్ ఎన్ని రన్స్ చేశాడంటే?
మూడో డిమాండ్ హ్యాండ్షేక్ ప్రోటోకాల్. మ్యాచ్ ముందు, తర్వాత భారత ఆటగాళ్లు తప్పనిసరిగా హ్యాండ్షేక్ చేయాలన్న నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని ఐసీసీ పాకిస్థాన్ కోరుతోంది. ఇది స్పోర్ట్స్మన్షిప్ పేరుతో పెట్టిన డిమాండ్ అయినా.. దీనిపై కూడా చర్చ జరుగుతోంది. ఈ డిమాండ్లపై ఐసీసీ, బీసీసీఐ ఎలా స్పందిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు.. కోట్లాది అభిమానుల భావోద్వేగాలతో కూడిన హై-వోల్టేజ్ ఈవెంట్. కానీ ఆ మ్యాచ్కు షరతులు పెట్టడం ఎంతవరకు సరైనదన్న చర్చ ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్గా మారింది.
తాజావార్తలు
-
Jai Moondra: రెండు మ్యాచ్లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
-
Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
Unbeaten Directors of Tollywood : ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుల సినిమాలపై భారీ అంచనాలు
-
Shraddha Kapoor: శ్రద్ధా కపూర్ ‘ఈత’ సినిమాకు ఊహించని చిక్కు.. కోర్టు మెట్లు ఎక్కనున్న కుటుంబం
-
Pawan Kalyan : ఓవర్ స్పీడ్లో దూసుకెళ్తున్న OG 2
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!