Mohsin Naqvi Trolls: ఒకటే తరహా ప్రకటనలు, పదే పదే యూ టర్న్లు.. ‘సీవీ’ అంటూ మోసిన్ నఖ్వీపై ట్రోల్స్!
- అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా నఖ్వీ పేరు
- నఖ్వీ వరుస నిర్ణయాలపై సోషల్ మీడియాలో ట్రోల్స్
- 'సీవీ' అంటూ మోసిన్ నఖ్వీపై ట్రోల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మోసిన్ నఖ్వీ పేరు ఇటీవలి కాలంలో అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. భారత్కు సంబంధించిన టోర్నీలు, హైబ్రిడ్ మోడల్లు, బహిష్కరణ హెచ్చరికలు.. ఇలా నఖ్వీ తీసుకున్న వరుస నిర్ణయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయాపై ట్రోల్స్ మొదలయ్యాయి. ‘సీవీ ఆఫ్ మోసిన్ నఖ్వీ’ అంటూ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రతి ఐసీసీ టోర్నీ ముందు ఒకే తరహా ప్రకటనలు, అదే తరహా హెచ్చరికలను జిత్తుల మారి నక్క నఖ్వీ చేస్తున్నాడని విమర్శలు వస్తున్నాయి.
ఆసియా కప్ 2023 సందర్భంగా హైబ్రిడ్ మోడల్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని మోసిన్ నఖ్వీ స్పష్టం చేశాడు. భారత్లో మ్యాచ్లు ఆడే ప్రసక్తే లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి. ఇదే క్రమంలో వన్డే వరల్డ్కప్ 2023కి కూడా భారత్కు వెళ్లబోమని పీసీబీ అధికారికంగా ప్రకటించింది. ఐసీసీ రంగంలోకి దిగడంతో నఖ్వీ వెనక్కి తగ్గగ తప్పలేదు. అతడి నిర్ణయాలు క్రికెట్ రాజకీయాలను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
Also Read
- Suryakumar Yadav: తప్పంతా నాదే.. వన్డే కెరీర్పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు!
- Fit India Ambassador: గౌతమ్ గంభీర్కు భావోద్వేగ క్షణం.. కుమార్తె ఆజీన్కు అరుదైన గౌరవం
- Asia Cup 2026: పాకిస్థాన్తో హ్యాండ్షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
- BCCI-Team India: ఉన్నపళంగా బెంగళూరుకు టీమిండియా స్టార్ క్రికెటర్లు.. ఎందుకో తెలుసా?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విషయంలో కూడా హైబ్రిడ్ మోడల్ను తిరస్కరిస్తామని మోసిన్ నఖ్వీ మరోసారి కఠిన వైఖరి ప్రదర్శించాడు. భారత్–పాకిస్తాన్ మ్యాచ్లపై స్పష్టత లేకుండా టోర్నీలు జరగవని ఆయన చేసిన వ్యాఖ్యలు ఐసీసీపై తీవ్ర ఒత్తిడి పెంచేలా చేశాయి. అదే సమయంలో ఆసియా కప్లో అంపైర్ అండి పైక్రాఫ్ట్ను తొలగించకపోతే.. టోర్నీనే బహిష్కరిస్తామని హెచ్చరించడం మరో సంచలనంగా మారింది. నఖ్వీ నక్క మారి జిత్తులు ఇక్కడితో ఆగలేదు.
Also Read: T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ను బహిష్కరించినా.. బంగ్లాదేశ్కు ఐసీసీ శుభవార్త!
2026 టీ20 వరల్డ్కప్లో భారత్తో జరిగే మ్యాచ్ను కూడా బహిష్కరిస్తామని పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ హెచ్చరించాడు. ఈ ప్రకటనతో క్రికెట్ ప్రపంచం మరోసారి ఉలిక్కిపడింది. భారత్తో మ్యాచ్ ఆడడానికి కొన్ని డిమాండ్స్ కూడా చేశాడు. అయితే ఐసీసీ బ్యాన్ హెచ్చరికల నేపథ్యంలో భారత్తో ఆడతాం అని వెన్నక్కి తగ్గాడు. ఇలా నఖ్వీ తీసుకున్న నిర్ణయాలు, చేసిన ప్రకటనలే ఆయన ‘సీవీ’గా మారిపోయాయని సోషల్ మీడియాలో సరదాగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. క్రికెట్ పాలనలో స్థిరమైన నిర్ణయాలే కీలకమని, లేకపోతే ఇలాంటి అపవాదులే మిగులుతాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Nepal Floods: “నువ్వు దేవుడు సామీ”.. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
-
Suryakumar Yadav: తప్పంతా నాదే.. వన్డే కెరీర్పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు!
-
IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
-
NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
-
Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!