Mohsin Naqvi Trolls: ఒకటే తరహా ప్రకటనలు, పదే పదే యూ టర్న్లు.. ‘సీవీ’ అంటూ మోసిన్ నఖ్వీపై ట్రోల్స్!
- అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా నఖ్వీ పేరు
- నఖ్వీ వరుస నిర్ణయాలపై సోషల్ మీడియాలో ట్రోల్స్
- 'సీవీ' అంటూ మోసిన్ నఖ్వీపై ట్రోల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మోసిన్ నఖ్వీ పేరు ఇటీవలి కాలంలో అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. భారత్కు సంబంధించిన టోర్నీలు, హైబ్రిడ్ మోడల్లు, బహిష్కరణ హెచ్చరికలు.. ఇలా నఖ్వీ తీసుకున్న వరుస నిర్ణయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయాపై ట్రోల్స్ మొదలయ్యాయి. ‘సీవీ ఆఫ్ మోసిన్ నఖ్వీ’ అంటూ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రతి ఐసీసీ టోర్నీ ముందు ఒకే తరహా ప్రకటనలు, అదే తరహా హెచ్చరికలను జిత్తుల మారి నక్క నఖ్వీ చేస్తున్నాడని విమర్శలు వస్తున్నాయి.
ఆసియా కప్ 2023 సందర్భంగా హైబ్రిడ్ మోడల్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని మోసిన్ నఖ్వీ స్పష్టం చేశాడు. భారత్లో మ్యాచ్లు ఆడే ప్రసక్తే లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి. ఇదే క్రమంలో వన్డే వరల్డ్కప్ 2023కి కూడా భారత్కు వెళ్లబోమని పీసీబీ అధికారికంగా ప్రకటించింది. ఐసీసీ రంగంలోకి దిగడంతో నఖ్వీ వెనక్కి తగ్గగ తప్పలేదు. అతడి నిర్ణయాలు క్రికెట్ రాజకీయాలను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
Also Read
- ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
- Vaibhav: ఒక్కో రన్కు రూ.14 వేల సంపాదన.. భారీగా పెరిగిన వైభవ్ బ్రాండ్ వ్యాల్యూ.. ఇక్కడే బిగ్ ట్విస్ట్!
- Hardik Pandya-Fan: ఒడిశా టు బెంగళూరు.. హార్దిక్ కోసం 1800 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన అభిమాని!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విషయంలో కూడా హైబ్రిడ్ మోడల్ను తిరస్కరిస్తామని మోసిన్ నఖ్వీ మరోసారి కఠిన వైఖరి ప్రదర్శించాడు. భారత్–పాకిస్తాన్ మ్యాచ్లపై స్పష్టత లేకుండా టోర్నీలు జరగవని ఆయన చేసిన వ్యాఖ్యలు ఐసీసీపై తీవ్ర ఒత్తిడి పెంచేలా చేశాయి. అదే సమయంలో ఆసియా కప్లో అంపైర్ అండి పైక్రాఫ్ట్ను తొలగించకపోతే.. టోర్నీనే బహిష్కరిస్తామని హెచ్చరించడం మరో సంచలనంగా మారింది. నఖ్వీ నక్క మారి జిత్తులు ఇక్కడితో ఆగలేదు.
Also Read: T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ను బహిష్కరించినా.. బంగ్లాదేశ్కు ఐసీసీ శుభవార్త!
2026 టీ20 వరల్డ్కప్లో భారత్తో జరిగే మ్యాచ్ను కూడా బహిష్కరిస్తామని పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ హెచ్చరించాడు. ఈ ప్రకటనతో క్రికెట్ ప్రపంచం మరోసారి ఉలిక్కిపడింది. భారత్తో మ్యాచ్ ఆడడానికి కొన్ని డిమాండ్స్ కూడా చేశాడు. అయితే ఐసీసీ బ్యాన్ హెచ్చరికల నేపథ్యంలో భారత్తో ఆడతాం అని వెన్నక్కి తగ్గాడు. ఇలా నఖ్వీ తీసుకున్న నిర్ణయాలు, చేసిన ప్రకటనలే ఆయన ‘సీవీ’గా మారిపోయాయని సోషల్ మీడియాలో సరదాగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. క్రికెట్ పాలనలో స్థిరమైన నిర్ణయాలే కీలకమని, లేకపోతే ఇలాంటి అపవాదులే మిగులుతాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
-
Gurudwara Demolished: పాకిస్థాన్కి ఎంత బలుపు.. 125 ఏళ్ల నాటి చారిత్రక గురుద్వారా కూల్చివేత! భారత్ రియాక్షన్ ఇదే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!