Mohsin Naqvi Trolls: ఒకటే తరహా ప్రకటనలు, పదే పదే యూ టర్న్లు.. ‘సీవీ’ అంటూ మోసిన్ నఖ్వీపై ట్రోల్స్!
- అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా నఖ్వీ పేరు
- నఖ్వీ వరుస నిర్ణయాలపై సోషల్ మీడియాలో ట్రోల్స్
- 'సీవీ' అంటూ మోసిన్ నఖ్వీపై ట్రోల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మోసిన్ నఖ్వీ పేరు ఇటీవలి కాలంలో అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. భారత్కు సంబంధించిన టోర్నీలు, హైబ్రిడ్ మోడల్లు, బహిష్కరణ హెచ్చరికలు.. ఇలా నఖ్వీ తీసుకున్న వరుస నిర్ణయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయాపై ట్రోల్స్ మొదలయ్యాయి. ‘సీవీ ఆఫ్ మోసిన్ నఖ్వీ’ అంటూ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రతి ఐసీసీ టోర్నీ ముందు ఒకే తరహా ప్రకటనలు, అదే తరహా హెచ్చరికలను జిత్తుల మారి నక్క నఖ్వీ చేస్తున్నాడని విమర్శలు వస్తున్నాయి.
ఆసియా కప్ 2023 సందర్భంగా హైబ్రిడ్ మోడల్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని మోసిన్ నఖ్వీ స్పష్టం చేశాడు. భారత్లో మ్యాచ్లు ఆడే ప్రసక్తే లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి. ఇదే క్రమంలో వన్డే వరల్డ్కప్ 2023కి కూడా భారత్కు వెళ్లబోమని పీసీబీ అధికారికంగా ప్రకటించింది. ఐసీసీ రంగంలోకి దిగడంతో నఖ్వీ వెనక్కి తగ్గగ తప్పలేదు. అతడి నిర్ణయాలు క్రికెట్ రాజకీయాలను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
Also Read
- Rohit Sharma: అతడితో కలిసి బ్యాటింగ్ చేయడం ఇష్టం.. నేను చాలా ఎంజాయ్ చేస్తా!
- Rohit Sharma 21 Records: ఒక్క సెంచరీ.. 21 రేర్ రికార్డ్స్.. లార్డ్స్లో రఫ్ఫాడించిన రోహిత్ శర్మ!
- Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
- Rohit Sharma: హిట్మ్యాన్ సూపర్ షోతో సీన్ రివర్స్..! ‘కథ ఇంకా ముగియలేదు’
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విషయంలో కూడా హైబ్రిడ్ మోడల్ను తిరస్కరిస్తామని మోసిన్ నఖ్వీ మరోసారి కఠిన వైఖరి ప్రదర్శించాడు. భారత్–పాకిస్తాన్ మ్యాచ్లపై స్పష్టత లేకుండా టోర్నీలు జరగవని ఆయన చేసిన వ్యాఖ్యలు ఐసీసీపై తీవ్ర ఒత్తిడి పెంచేలా చేశాయి. అదే సమయంలో ఆసియా కప్లో అంపైర్ అండి పైక్రాఫ్ట్ను తొలగించకపోతే.. టోర్నీనే బహిష్కరిస్తామని హెచ్చరించడం మరో సంచలనంగా మారింది. నఖ్వీ నక్క మారి జిత్తులు ఇక్కడితో ఆగలేదు.
Also Read: T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ను బహిష్కరించినా.. బంగ్లాదేశ్కు ఐసీసీ శుభవార్త!
2026 టీ20 వరల్డ్కప్లో భారత్తో జరిగే మ్యాచ్ను కూడా బహిష్కరిస్తామని పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ హెచ్చరించాడు. ఈ ప్రకటనతో క్రికెట్ ప్రపంచం మరోసారి ఉలిక్కిపడింది. భారత్తో మ్యాచ్ ఆడడానికి కొన్ని డిమాండ్స్ కూడా చేశాడు. అయితే ఐసీసీ బ్యాన్ హెచ్చరికల నేపథ్యంలో భారత్తో ఆడతాం అని వెన్నక్కి తగ్గాడు. ఇలా నఖ్వీ తీసుకున్న నిర్ణయాలు, చేసిన ప్రకటనలే ఆయన ‘సీవీ’గా మారిపోయాయని సోషల్ మీడియాలో సరదాగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. క్రికెట్ పాలనలో స్థిరమైన నిర్ణయాలే కీలకమని, లేకపోతే ఇలాంటి అపవాదులే మిగులుతాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
JP Nadda – CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
-
Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
-
Monalisa: ‘నా జీవితం ప్రమాదంలో ఉంది’.. కుంభమేళా ఫేమ్ మోనాలిసా!
-
Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
-
NBK సినిమాలో ఐశ్వర్య రాజేశ్? ఇప్పటి వరకు చేయని పాత్రలో క్రేజీ బ్యూటీ!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!