పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ శుక్రవారం బాంబ్ దాడులతో దద్దరిల్లింది. ఆత్మాహుతి దాడిలో 50 మంది ప్రాణాలు కోల్పోగా.. 170 మంది గాయాలు పాలయ్యారు. ఈ ఘటన పాకిస్థాన్ను తీవ్ర కలవరపాటుకు గురిచేసింది.
భారత్-అమెరికా మధ్య సంబంధాలు చాలా దృఢంగా బలపడుతున్నాయి. మోడీ-ట్రంప్ ఫోన్ కాల్ సంభాషణ తర్వాత అనూహ్యంగా రెండు దేశాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందం జరిగింది. భారత్పై సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
Pakistan: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ను కొత్తగా మరో విషయం చిరాకు పెడుతోంది. చివరకు ఆ దేశంలోని దొంగలు ‘‘మ్యాన్ హోల్స్’’పై మూతలు కూడా ఉంచకుండా, దొంగతనాలకు పాల్పడుతున్నారు. దీంతో విసిగిపోయిన పాకిస్తాన్, భారీ శిక్షల్ని ప్రకటించింది. మ్యాన్హోల్స్కు ఇలాంటి శిక్షలు ఏమిటి..? అని అనుకున్నా సరే, ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్ మాత్రం శిక్షలు విధించేందుకు చట్టాన్ని తీసుకువచ్చింది.
Himanta Sarma: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మరోసారి కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ గొగోయిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గొగోయ్ భార్యకు పాకిస్థాన్లో చాలా బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, వాటిలో కొన్ని ఇప్పటికీ యాక్టివ్గా ఉన్నాయని ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Pakistan: బలూచిస్తాన్లో పాకిస్తాన్ ప్రభుత్వానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) దెబ్బకు పాక్ ఆర్మీ , ప్రభుత్వం వణికిపోతోంది. బలూచ్ ప్రజలు తమ స్వాతంత్య్రం కోసం, పాక్ నుంచి విముక్తి కోసం పోరాటం చేస్తున్నారు. ఇటీవల మూడు రోజుల పాటు పాక్ ఆర్మీ,
Pakistani Terrorist: ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా 20 సార్లు భారత సైన్యానికి చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటున్న పాకిస్తాన్ ఉగ్రవాదిని ఎట్టకేలకు భద్రతా బలగాలు హతమార్చాయి. ఇది భారత సెక్యూరిటీ ఫోర్సెస్కు ఘన విజయంగా చెప్పొచ్చు.పాకిస్తాన్ జాతీయుడు, సీనియర్ లష్కర్ కమాండర్ సైఫుల్లాకు అత్యంత సన్నిహితుడైన ఉగ్రవాది ఆదిల్ గత 18 నెలలుగా పట్టుబడకుండా తప్పించుకుంటున్నారు.
Pakistan: బలూచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)ను ఎదుర్కోవడంలో తమ సైన్యం వల్ల కావడం లేదని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. బలూచిస్తాన్ విస్తీర్ణం పెద్దది కావడంతో పాక్ భద్రతా బలగాలు అలసిపోతున్నాయని చెప్పారు. జాతీయ అసెంబ్లీలో మాట్లాడిన ఆయన... పాకిస్తాన్లో అతిపెద్ద రాష్ట్రమైన బలూచిస్తాన్ విస్తీర్ణమే భద్రతా బలగాలకు ప్రధాన సవాల్ అని అన్నారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడుల నేపథ్యంలో ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Pakistan vs ICC: క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసేలా భారత్తో జరగాల్సిన తమ టీ20 వరల్డ్కప్ మ్యాచ్ను (ఫిబ్రవరి 15) “బహిష్కరిస్తున్నట్లు” పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, భారత్తో మ్యాచ్ను మాత్రమే బహిష్కరించి మిగతా అన్ని జట్లతో ఆడేందుకు అనుమతి ఇవ్వడం తీవ్ర వివాదానికి దారి తీస్తోంది.
Pak Boycott India Match: భారత్తో జరగాల్సిన టీ20 వరల్డ్కప్ మ్యాచ్ను బహిష్కరించాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ డిసిషన్ తీవ్ర పరిణామాలకు దారి తీసేలా కనిపిస్తోంది.
ఇది ఒక ప్రతిపక్ష నేత చేసిన విమర్శ కాదు. ఇది అంతర్జాతీయ మీడియా రాసిన విశ్లేషణ కూడా కాదు. ఒక దేశ ప్రధాని స్వయంగా మాట్లాడిన మాట ఇది. మేం ప్రపంచం చుట్టూ తిరుగుతూ అప్పులు అడుగుతున్నప్పుడు మా తలలు సిగ్గుతో వంగిపోతున్నాయంటూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. అణుశక్తి ఉందని గొప్పలు చెప్పుకునే దేశం, కోట్లాది జనాభా ఉన్న దేశం, ఒకప్పుడు ఇస్లామిక్ ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్నమని గొప్పలు పోయిన దేశం..…