Engineering Colleges: ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఖరారు.. జీవో జారీ చేసిన రేవంత్ సర్కార్..
- ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులు ఖరారు..
- వాయిదాల పద్దతిలో ఫీజులు చెల్లించేందుకు అవకాశం..
- రాష్ట్రంలో అత్యధిక ఫీజు సీబీఐటీలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఈఏపీసెట్ ప్రవేశాలకు సంబంధించి ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. తదుపరి మూడేళ్ల బ్లాక్ పీరియడ్ (2025-26, 2026-27, 2027-28) కోసం రాష్ట్రంలోని 160 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల ట్యూషన్ ఫీజులను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేస్తూ జీవో 6ను జారీ చేసింది. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (TAFRC) సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వచ్చే ఈ కొత్త ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధిక ఫీజును సీబీఐటీలో రూ. 1,83,000గా నిర్ణయించారు. మిగిలిన టాప్ కాలేజీల విషయానికొస్తే.. వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో రూ. 1,75,000, ఎంజీఐటీలో రూ. 1,67,000, సీవీఆర్ కాలేజీలో రూ. 1,63,000, జి.నారాయణమ్మలో రూ. 1,62,000, గోకరాజు గంగరాజులో రూ. 1,60,500, వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో రూ. 1,59,600, బీవీరాజు ఇనిస్టిట్యూట్లో రూ. 1,46,600, కిట్స్లో రూ. 1,46,200 మరియు ఎంవీఎస్ఆర్ కాలేజీలో రూ. 1,43,800 చొప్పున ఫీజులు నిర్ణయించారు.
Also Read
- Hyderabad: జిమ్ ప్రియులకు బిగ్ అలర్ట్.. యువతే టార్గెట్గా స్టెరాయిడ్స్, నిషేధిత ఇంజెక్షన్ల దందా..
- Saikrishna Mother Vijayalakshmi: "నా కొడుకు పవన్ కళ్యాణ్ అభిమాని.. క్రిమినల్ అని ఎలా అంటారు?".. సాయికృష్ణ తల్లి ఆగ్రహం..
- Saikrishna Case: "నా కొడుకు బూడిద నాకు కావాలి.. లేదంటే ఆత్మాహుతే.." సాయికృష్ణ తల్లి ఆవేదన
- పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై 'Telegram'కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
Also Read:మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో Realme C83 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
మొత్తంగా పరిశీలిస్తే.. 126 కాలేజీల్లో ఫీజు రూ. లక్షలోపే ఉంది. సుమారు 19 కాలేజీల్లో అత్యల్పంగా రూ. 45,000 ఫీజును ఖరారు చేశారు. 70 కళాశాలల్లో పాత ఫీజులే కొనసాగుతుండగా.. 63 కాలేజీల్లో ఫీజులు పెరిగాయి.. మిగిలిన వాటిలో తగ్గుదల నమోదైంది.
విద్యార్థులపై భారం తగ్గించేందుకు ఫీజును ఒకేసారి కాకుండా వాయిదాల పద్ధతిలో చెల్లించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. నిర్ణీత ఫీజు కంటే అదనంగా క్యాపిటేషన్ ఫీజు లేదా విరాళాల పేరుతో ఒక్క రూపాయి వసూలు చేసినా కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. కాలేజీలు సమర్పించిన ఆదాయ, వ్యయ లెక్కలను బట్టి ఫీజులు ఖరారు చేశామని.. లెక్కల్లో తప్పులుంటే భవిష్యత్తులో ఫీజు తగ్గింపుతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Rajamouli Goes Global: రాజమౌళికి అరుదైన గౌరవం
-
Hyderabad: జిమ్ ప్రియులకు బిగ్ అలర్ట్.. యువతే టార్గెట్గా స్టెరాయిడ్స్, నిషేధిత ఇంజెక్షన్ల దందా..
-
Saikrishna Mother Vijayalakshmi: “నా కొడుకు పవన్ కళ్యాణ్ అభిమాని.. క్రిమినల్ అని ఎలా అంటారు?”.. సాయికృష్ణ తల్లి ఆగ్రహం..
-
Sreeleela: తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పిన శ్రీలీల.. అబ్బాయిలూ నోట్ చేసుకోండి!
-
Saikrishna Case: “నా కొడుకు బూడిద నాకు కావాలి.. లేదంటే ఆత్మాహుతే..” సాయికృష్ణ తల్లి ఆవేదన
ట్రెండింగ్
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..