Engineering Colleges: ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఖరారు.. జీవో జారీ చేసిన రేవంత్ సర్కార్..
- ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులు ఖరారు..
- వాయిదాల పద్దతిలో ఫీజులు చెల్లించేందుకు అవకాశం..
- రాష్ట్రంలో అత్యధిక ఫీజు సీబీఐటీలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఈఏపీసెట్ ప్రవేశాలకు సంబంధించి ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. తదుపరి మూడేళ్ల బ్లాక్ పీరియడ్ (2025-26, 2026-27, 2027-28) కోసం రాష్ట్రంలోని 160 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల ట్యూషన్ ఫీజులను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేస్తూ జీవో 6ను జారీ చేసింది. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (TAFRC) సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వచ్చే ఈ కొత్త ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధిక ఫీజును సీబీఐటీలో రూ. 1,83,000గా నిర్ణయించారు. మిగిలిన టాప్ కాలేజీల విషయానికొస్తే.. వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో రూ. 1,75,000, ఎంజీఐటీలో రూ. 1,67,000, సీవీఆర్ కాలేజీలో రూ. 1,63,000, జి.నారాయణమ్మలో రూ. 1,62,000, గోకరాజు గంగరాజులో రూ. 1,60,500, వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో రూ. 1,59,600, బీవీరాజు ఇనిస్టిట్యూట్లో రూ. 1,46,600, కిట్స్లో రూ. 1,46,200 మరియు ఎంవీఎస్ఆర్ కాలేజీలో రూ. 1,43,800 చొప్పున ఫీజులు నిర్ణయించారు.
Also Read
- ప్రభుత్వ ఉద్యోగాల్లో 90 శాతం అవినీతి ఇక్కడే జరుగుతుంది.. రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు..
- PM Modi: మోడీ ఉచిత కోచింగ్ ప్రకటనపై అనూహ్య స్పందన.. కోచింగ్ సెంటర్లు మద్దతు
- IND Vs SL: శ్రీలంకపై వీరవిహారం.. వచ్చిన అవకాశాన్ని సెంచరీ వైపు మలుస్తున్న పడిక్కల్!
- Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
Also Read:మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో Realme C83 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
మొత్తంగా పరిశీలిస్తే.. 126 కాలేజీల్లో ఫీజు రూ. లక్షలోపే ఉంది. సుమారు 19 కాలేజీల్లో అత్యల్పంగా రూ. 45,000 ఫీజును ఖరారు చేశారు. 70 కళాశాలల్లో పాత ఫీజులే కొనసాగుతుండగా.. 63 కాలేజీల్లో ఫీజులు పెరిగాయి.. మిగిలిన వాటిలో తగ్గుదల నమోదైంది.
విద్యార్థులపై భారం తగ్గించేందుకు ఫీజును ఒకేసారి కాకుండా వాయిదాల పద్ధతిలో చెల్లించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. నిర్ణీత ఫీజు కంటే అదనంగా క్యాపిటేషన్ ఫీజు లేదా విరాళాల పేరుతో ఒక్క రూపాయి వసూలు చేసినా కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. కాలేజీలు సమర్పించిన ఆదాయ, వ్యయ లెక్కలను బట్టి ఫీజులు ఖరారు చేశామని.. లెక్కల్లో తప్పులుంటే భవిష్యత్తులో ఫీజు తగ్గింపుతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
ప్రభుత్వ ఉద్యోగాల్లో 90 శాతం అవినీతి ఇక్కడే జరుగుతుంది.. రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు..
-
PM Modi: మోడీ ఉచిత కోచింగ్ ప్రకటనపై అనూహ్య స్పందన.. కోచింగ్ సెంటర్లు మద్దతు
-
Champapet Murder : అన్నదమ్ముల గొడవలో దారుణం.. కత్తెరతో అన్నను చంపిన తమ్ముడు.!
-
Vaayuv Tej: మెగా వారసుడి ఫస్ట్ లుక్.. వాయువ్ తేజ్ ఫొటోను తొలిసారి షేర్ చేసిన నాగబాబు!
-
IND Vs SL: శ్రీలంకపై వీరవిహారం.. వచ్చిన అవకాశాన్ని సెంచరీ వైపు మలుస్తున్న పడిక్కల్!
ట్రెండింగ్
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!