T20 World Cup: పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ను బహిష్కరిస్తుందా? పీసీబీ చీఫ్ మోహ్సీన్ నఖ్వీ స్పందన..
- బంగ్లాకు మద్దతుగా టీ20 ప్రపంచకప్ను పాక్ బహిష్కరిస్తుందా?
- కీలక వ్యాఖ్యలు చేసిన పీసీబీ చీఫ్ మోహ్సీన్ నఖ్వీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: బంగ్లాదేశ్కు ఐసీసీ(ICC) షాక్ ఇచ్చింది. భద్రతా కారణాలు చూపుతూ భారత్లో టీ20 వరల్డ్ కప్-2026(T20 World Cup 2026) ఆడేందుకు నిరాకరించినందుకు టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్ నుంచి తమ వేదికను శ్రీలంకకు మార్చాలని, లేదంటే టోర్నీలో పాల్గొనమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్(బీసీసీ) చెప్పింది. ఈ నేపథ్యంలో, ఐసీసీ బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ను తీసుకుంది. అయితే, బంగ్లాదేశ్ టోర్నీ నుంచి అవుట్ అయిన నేపథ్యంలో, పాకిస్తాన్ టోర్నీలో పాల్గొంటుందా? అనే దానిపై స్పందించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ.. దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. బంగ్లాదేశ్పై ఐసీసీ వ్యవహరించిన తీరును విమర్శించారు.
Read Also: CM Nitish Kumar: సీఎం నితీష్ కుమార్ కాన్వాయ్ కోసం గంట పాటు నిలిచిన రైళ్లు..
Also Read
- ICC: కీలక నిర్ణయం తీసుకున్న ఐసీసీ.. టీ20, వన్డే ప్రపంచకప్ ఫార్మాట్లలో పలు మార్పులు..
- Axar Patel: టీ20ల్లో జీరో.. వన్డేల్లో హీరో.. మార్పుకు కారణం ఏంటో చెప్పిన అక్షర్ పటేల్..
- Shubman Gill: కోహ్లీ, రోహిత్ శర్మను వెనక్కి నెట్టేసిన శుభ్మన్ గిల్.. ఒక్క విజయంతో మరింత ముందుకు..
- Axar Patel Record: అక్షర్ పటేల్ అరుదైన ఘనత.. సచిన్, గంగూలీ సరసన చోటు!
బంగ్లాదేశ్ నిష్క్రమణపై నఖ్వీ స్పందిస్తూ.. ఐసీసీకి ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని, బంగ్లాదేశ్ను టోర్నమెంట్లో పాల్గొనడానికి అనుమతించాలని నఖ్వీ అన్నారు. “బంగ్లాదేశ్కు అన్యాయం జరిగింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బోర్డు సమావేశంలో కూడా నేను ఇదే విషయం చెప్పాను. మీరు ద్వంద్వ ప్రమాణాలను పాటించలేరు, ఒక దేశం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు, కానీ మరో దేశం విషయంలో దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించడం సరికాదు. అందుకే బంగ్లాదేశ్కు అన్యాయం జరుగుతోందని, ఏదేమైనా వారిని ప్రపంచ కప్లో ఆడేందుకు అనుమతించాలని మేము వైఖరి తీసుకున్నాము. వారు ఒక ప్రధాన వాటాదారులు, వారికి ఈ అన్యాయం జరగకూడదు’’ అని అన్నారు.
బంగ్లాదేశ్ లాగే పాకిస్తాన్ కూడా టీ20 ప్రపంచకప్ను బహిష్కరిస్తుందా? అనే ప్రశ్నకు సమాధానంగా పాకిస్తాన్ ప్రభుత్వం ఇచ్చే సూచనల్ని పాటిస్తామని చెప్పారు. పాక్ ప్రధాని పాకిస్తాన్లో లేరని, ఆయన వచ్చాక తుది నిర్ణయాన్ని చెబుతామని, తాము ప్రభుత్వ నిర్ణయాన్ని పాటిస్తామని, ఐసీసీని కాదు అని చెప్పారు. భారత్లో జరిగే ఈ ఐసీసీ ఈవెంట్ల విషయానికి వస్తే పాకిస్తాన్ హైబ్రీడ్ మోడల్లో ఆడుతోంది. దాని మ్యాచ్లన్నీ శ్రీలంకలో జరుగనున్నాయి. బంగ్లాదేశ్కు కూడా ఇలాంటి సహాయమే చేయాలని చెప్పారు.
తాజావార్తలు
-
New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
-
Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్కు మాస్టర్ స్ట్రాటజీ!
-
PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
-
Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
-
Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!