Operations Sindoor : భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ దాడులు పాకిస్తాన్లోని సాధారణ పౌరుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయి. తమ దేశ రక్షణ వ్యవస్థ బలహీనతను ఎత్తిచూపుతూ, భారత్ విజయవంతమైన దాడులను వారు నిస్సహాయంగా చూస్తూ ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ పాకిస్తానీ పౌరుడు మాట్లాడుతూ, “భారత్ అనుకున్న లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. మా రక్షణ వ్యవస్థ ఒక్క మిస్సైల్ను కూడా అడ్డుకోలేకపోయింది. ఏకంగా 24 మిస్సైల్స్ను వారు ప్రయోగించినా,…
India vs Pak : ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత-పాకిస్తాన్ నియంత్రణ రేఖ (LoC) వద్ద పరిస్థితి తీవ్రంగా మారింది. పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడ్డ విషయం అధికారికంగా భారత సైన్యం ధృవీకరించింది. ఈ కాల్పుల్లో భారత జవాన్ దినేష్ కుమార్ వీరమరణం పొందారు. దినేష్ కుమార్ మృతిపై వైట్ నైట్ కార్ప్స్ సంతాపం తెలియజేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఇదే కాల్పుల్లో సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న 15 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.…
CM Revanth Reddy : ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావం ప్రకటిస్తూ ర్యాలీలో పాల్గొనాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మే 8 గురువారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ఈ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత భారీగా పాల్గొనాలని ఆయన కోరారు. ఇక బుధవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు హైదరాబాద్లో నిర్వహించిన సివిల్ మాక్డ్రిల్…
ఢిల్లీ: నేడు ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం. రక్షణమంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ. HYD: భారత సైన్యానికి మద్దతుగా నేడు సంఘీభావ ర్యాలీ. సెక్రటేరియట్ నుంచి నెక్లెస్రోడ్ వరకు ర్యాలీ. సాయంత్రి 6 గంటలకు ర్యాలీ ప్రారంభించనున్న సీఎం రేవంత్. నేడు ఏపీ కేబినెట్ సమావేశం. సబ్ కమిటీ సిఫార్సులకు ఆమోదం తెలపనున్న కేబినెట్. అమరావతి రీ-లాంచ్ ప్రాజెక్టులతో పాటు పలు పరిశ్రమలకు స్థలాల కేటాయింపుపై చర్చ. సీఎం చంద్రబాబు అధ్యక్షత ఉదయం 11…
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాద దాడి తర్వాత తాజాగా భారత్ ఆపరేషన్ సిందూర్ విజయవంతమైంది. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదులను అంతమొందించడానికి భద్రతా దళాలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 100కు పైగా అనుమానిత ఉగ్రవాదులు, వారి అనుచరుల ఇళ్లల్లో తనిఖీలు చేసినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం ఒక్కరోజే 30కి పైగా ప్రాంతాల్లో సోదాలు చేసినట్లు చెప్పారు.
Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’ పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించింది. ఇన్నాళ్లు తాము పెంచుకుంటున్న ఉగ్రవాదులను భారత్ బహిర్గతం చేసింది. ఉగ్రస్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే వివరాలను సేకరించి మీర దెబ్బ కొట్టింది. పీఓకేతో పాటు పాక్ ప్రధాన భూభాగాల్లోని జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహీద్దిన్కి చెందిన 100 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు.
Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’తో భారత్ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థల స్థావరాలే లక్ష్యంగా భారీ ఎత్తున దాడులు చేసింది. భారత త్రివిధ దళాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. పాకిస్తాన్ భూభాగంతో పాటు పీఓకేలోని 09 చోట్ల భారత్ విధ్వంసం సృష్టించింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్కి చెందిన ఉగ్రవాదులు 100 మంది వరకు హతమయ్యారని తెలుస్తోంది.
Pakistan: భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయడం దాయాది పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించింది. అయితే, తమ ప్రజల్ని సంతృప్తి పరిచేందుకు పాక్ ఇప్పుడు యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగానే ఏర్పాటు చేసుకుంటుందనే సమాచారం అందుతోంది. ఇప్పటికే, ఈ ఆపరేషన్ని ‘‘యుద్ధ చర్య’’గా పాక్ పీఏం షహబాజ్ షరీఫ్ అభివర్ణించడంతో పాటు పాక్ ప్రతీకారం తీస్తుంటుందని నేషనల్ అసెంబ్లీలో ప్రకటించాడు.
Operation Sindoor: సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కి భారత్ దిమ్మతిరిగే రీతిలో జవాబు ఇచ్చింది. గత నెలలో పాకిస్తాన్కి చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు పహల్గామ్లో 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. మతం ఆధారంగా హిందువులను టార్గెట్ చేస్తూ కాల్చి చంపారు. ఈ దాడికి కారణమైన ఉగ్రవాదం, దానికి మద్దతు ఇస్తున్న పాక్పై భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని ప్రజలు బలంగా కోరుకున్నారు.
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్తాన్గా భారత్ తగిన గుణపాఠం చెప్పింది. ‘‘ఆపరేషన్ సిందూర్’’తో ఉగ్రవాదుల్ని, దాని మద్దతుదారుల్ని భారత సైన్యం హడలెత్తించింది. పీఓకే, పాక్ పంజాబ్ ప్రావిన్సుల్లో 09 ఉగ్ర స్థావరాలపై భారీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 100 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక్కసారిగా భారత్ విరుచుకుపడటంతో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టింది. ఇదిలా ఉంటే, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాక్ ప్రజల్ని ఉద్దేశించి జాతీయ అసెంబ్లీలో…