Vikram Misri : పాకిస్థాన్ తప్పించుకోవాలని చూస్తోంది.. విదేశాంగ కార్యదర్శి సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపరేషన్ సిందూర్ గురించి ఎంఈఏ విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రసంగించారు.. పహల్గామ్పై దాడి రెచ్చగొట్టారు. అందుకే నిన్న ఉగ్రస్థావరాలపై దాడులు చేశామని మరోసారి స్పష్టం చేశారు. పహల్గామ్ దాడికి లష్కరేతో సంబంధం ఉన్న ఒక సంస్థ బాధ్యత వహించిందని.. ఐక్యరాజ్యసమితి పత్రికా ప్రకటనలో టీఆర్ఎఫ్ పేరు ప్రస్తావించడాన్ని పాకిస్థాన్ వ్యతిరేకించిందని స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాద సంఘటన నుంచి తప్పించుకోవాలని ట్రై చేస్తోందన్నారు. పాకిస్థాన్ ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రబిందువు అని పునరుద్ఘాటించారు. ప్రపంచంలో అనేక ఉగ్రవాద దాడులు జరిగాయని.. ఇందులో పాకిస్థాన్ హస్తం ఉందని తేలినట్లు చెప్పారు. ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడు? అతన్ని అమరవీరుడు అని ఎవరు పిలిచారు? అని ప్రశ్నించారు.
READ MORE: CM Revanth Reddy: హైడ్రా అంటే కూల్చడమే కాదు.. ఆస్తుల రక్షణ, విపత్తుల నిర్వహణ కూడా..!
Also Read
- Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ 'స్పైసీ చిల్లీ ఎగ్'.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
- Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
- TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
ఈ దాడికి సంబంధించి ప్రపంచాన్ని పాకిస్థాన్ ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిందని ఆయన అన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ఉగ్రవాదులకు పాకిస్థాన్ నిలయంగా మారిందని.. ఇందులో మసూద్ అజార్, హఫీజ్ మొహమ్మద్ సయీద్ ఉన్నారన్నారు. భారతదేశం ప్రతీకారం తీర్చుకుంటోందని.. ఉగ్రవాదుల రహస్య స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారని పునరుద్ఘాటించారు. “పాకిస్థాన్ పహల్గామ్ దాడిపై ఉమ్మడి దర్యాప్తు చేయాలని ప్రతిపాదన తెచ్చింది. మరోసారి తనను తాను రక్షించుకోవడానికి ఇది ఒక వ్యూహం. 26/11, పఠాన్కోట్ వంటి దాడుల దర్యాప్తులో భారతదేశం సహకరించింది. కానీ పాకిస్థాన్ ఆ కేసులను పక్కన పెట్టింది. ముంబై దాడిపై వివరణాత్మక ఆధారాలు అందించినప్పటికీ.. ఎటువంటి ఖచ్చితమైన చర్య తీసుకోలేదు. పఠాన్కోట్ కేసులో డీఎన్ఏ విశ్లేషణ, ఉగ్రవాద సంస్థల అధికారుల సమాచారాన్ని పాకిస్థాన్ బృందానికి అందించాం. కానీ ఇప్పటికీ ఎటువంటి పురోగతి లేదు.” అని మిస్రీ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Kallu Mama Song: 28 ఏళ్లైనా తగ్గని క్రేజ్.. అండర్వరల్డ్ యాంథమ్గా నిలిచిన ‘కల్లు మామ’ పాట
-
Peacock Mountain: ఇరాన్ పీకాక్స్ మౌంటైన్పై దాడికి ప్లాన్..ఈ అణు కేంద్రంపై అటాక్ జరిగితే అంతే సంగతి!
-
Russia Vs Ukraine: 3000కిలోల బరువున్న బాంబును విసిరింది.. యుద్ధంలో గేర్ మార్చిన రష్యా!
ట్రెండింగ్
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?