Ajay Banga: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య, పీఎం మోడీని కలిసిన వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్..
- ప్రధాని మోడీని కలిగిస వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా..
- భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య కీలకంగా మారిన భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajay Banga: పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్ పరిణామాల మధ్య ‘‘ప్రపంచ బ్యాంక్’’ అధ్యక్షుడు అజయ్ బంగా గురువారం ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. పాకిస్తాన్, పీఓకేలలోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేసిన ఒక రోజు తర్వాత ఆయన మోడీని కలిశారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ నిలిపేసింది. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ పాకిస్తాన్కి బుద్ధి చెప్పింది. ఈ ఆపరేషన్ తర్వాత గురువారం పాకిస్తాన్ 15 భారతీయ నగరాలపై క్షిపణి దాడికి యత్నించింది. అయితే, భారత గగనతల రక్షణ వ్యవస్థ వీటిని నిర్వీర్యం చేసింది. ఈ వరస పరిణామాల నేపథ్యంలో అజయ్ బంగా ప్రధానిని కలవడం చర్చనీయాంశంగా మారింది.
1960లో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు మహ్మద్ ఆయూబ్ ఖాన్ నేతృత్వంలో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో సింధు జలాల ఒప్పందం జరిగింది. భారత్ పైకి పాక్ ఉగ్రవాదాన్ని ఎగదోసినా, యుద్ధాలు చేసినా ఎప్పుడూ కూడా ఈ ఒప్పందాన్ని నిలిపేయలేదు. అయినా తీరు మార్చుకోని పాకిస్తాన్ ఇటీవల పహల్గామ్లో 26 మంది అమాయకపు టూరిస్టుల్ని చంపేసింది. దీనికి రివేంజ్గా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ని కొనసాగిస్తోంది.
Also Read
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
- Daycare Abuse: మీకు మనసెలా వచ్చిందమ్మా.. టాయిలెట్ జెట్తో నీళ్లు చల్లి, వాషింగ్ మెషీన్లో బంధించి చిన్నారిపై చిత్రహింసలు
- UP Boy: వారంలో 3 రోజులు ఎల్కేజీ, 3 రోజులు ఫస్ట్ క్లాస్.. రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్న ఆరేళ్ల బాలుడు!
- Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
Read Also: Nayanathara : నయనతారను కలిసేందుకు వెళ్లిన అనిల్ రావిపూడి
సింధు జలాల ఒప్పందం నిలిపేసిన తర్వాత, భారత్ చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ డ్యాం, సలాల్ డ్యాం గేట్లను దించేసి నీటిని స్టోర్ చేస్తోంది. దీనిపై పాకిస్తాన్ గగ్గోలు పెడుతోంది. ఇప్పటికే, నీటికి అడ్డుకట్ట పడటంతో పాకిస్తాన్లోని సియాల్కోట్ వద్ద నదీ ప్రవాహం తగ్గింది. అయితే, ఇది జరిగిన కొన్ని రోజులకే ఒక్కసారిగా గేట్లు ఎత్తేయడంతో పాకిస్తాన్లో వరద పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో బంగా భారత ప్రధానిని కలిశారు. రేపు ఆయన ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటించనున్నారు. యూపీ 1 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో అజయ్ బంగా పర్యటన కీలకంగా మారింది.
తాజావార్తలు
-
Hardik Pandya-CSK: సీఎస్కేలోకి హార్దిక్ పాండ్యా.. క్లారిటీ ఇచ్చిన చెన్నై సీఈఓ!
-
Best Crime Thriller Movies: కేతన్ అగర్వాల్ కేసును గుర్తు చేసే థ్రిల్లర్లు.. ఈ సినిమాల ట్విస్టులు చూస్తే షాక్ అవుతారు!
-
Jananayagan Censor : జననాయగన్ కు సెన్సార్ షాక్
-
WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
-
Daycare Abuse: మీకు మనసెలా వచ్చిందమ్మా.. టాయిలెట్ జెట్తో నీళ్లు చల్లి, వాషింగ్ మెషీన్లో బంధించి చిన్నారిపై చిత్రహింసలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?