Operation Sindoor: హెచ్చరించినా వినలేదు.. అందుకే పాకిస్థాన్ వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఆపరేషన్ సిందూర్’తో నిరాశ చెందిన పాకిస్థాన్.. భారతదేశంలోని సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ భారత సైన్యం ఈ దాడిని తిప్పికొట్టింది. ఈ అంశంపై వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి సమాచారం ఇచ్చారు. గత 24 గంటల్లో పాకిస్థాన్ సైన్యం భారతదేశాన్ని ఎలా లక్ష్యంగా చేసుకుందో వివరించారు. వారి ఎత్తుగడలు ఏవీ విజయవంతం కాలేదని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ లక్ష్యం ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం.. మేము ఏ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదు అని వెల్లడించారు. పాకిస్థాన్ మాత్ర భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుందన్నారు. ఇలాంటి పని చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తాము ఇప్పటికే హెచ్చరించామని స్పష్టం చేశారు. అమాయక ప్రజలను చంపినందుకు పాకిస్థాన్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
READ MORE: RAPO 22: రామ్ సినిమా టైటిల్ ఆరోజే చెప్తారట!
Also Read
- Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక
- Venkatesh Iyer: రజత్ పాటిదార్ ఇక్కడ ఉండాల్సిన వాడు కాదు.. ఆర్సీబీ కెప్టెన్పై వెంకటేష్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు..
- Test Match: ఆ ప్లేయర్కు రెస్ట్.. రంజీ హీరోకు ఛాన్స్..? అఫ్గాన్ టెస్టుకు ముందు టీమిండియాలో ఊహించని ట్విస్ట్..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ.. “2025 మే 7/8 రాత్రి, పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులతో అనేక భారత సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. వారి ప్రతి దాడిని సైనికులు భగ్నం చేశారు. పాకిస్థాన్ దాడికి రుజువు ఆ దేశానికి చెందిన ఆయుధ శిథిలాలు. ఇవి చాలా చోట్ల దొరికాయి. దీనికి ప్రతిగా భారత సైన్యం ఈ ఉదయం పాకిస్థాన్లోని అనేక ప్రదేశాలపై దాడి చేసి వారి వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది. లాహోర్లో వైమానిక రక్షణ వ్యవస్థ ధ్వంసమైంది.” అని సోఫియా ఖురేషి వెల్లడించారు. జమ్మూ కశ్మీర్లోని కుప్వారా, బారాముల్లా, ఉరి, పూంచ్, మెంధార్ రాజౌరి సెక్టార్లలో పాకిస్థాన్ అకస్మాత్తుగా మోర్టార్లు, భారీ ఫిరంగి కాల్పులకు పాల్పడిందని వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ తెలిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు పిల్లలు సహా 16 మంది అమాయక పౌరులు మరణించారని వెల్లడించారు. ఈ దుర్మార్గపు చర్యకు అనంతరం భారత సైన్యం వెంటనే స్పందించిందని.. పాకిస్థాన్ పోస్టులపై లక్ష్యంగా కాల్పులు జరిపిందని వెల్లడించారు.
తాజావార్తలు
-
Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక
-
AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
-
Venkatesh Iyer: రజత్ పాటిదార్ ఇక్కడ ఉండాల్సిన వాడు కాదు.. ఆర్సీబీ కెప్టెన్పై వెంకటేష్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు..
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Test Match: ఆ ప్లేయర్కు రెస్ట్.. రంజీ హీరోకు ఛాన్స్..? అఫ్గాన్ టెస్టుకు ముందు టీమిండియాలో ఊహించని ట్విస్ట్..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!