Operation Sindoor: హెచ్చరించినా వినలేదు.. అందుకే పాకిస్థాన్ వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశాం..
‘ఆపరేషన్ సిందూర్’తో నిరాశ చెందిన పాకిస్థాన్.. భారతదేశంలోని సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ భారత సైన్యం ఈ దాడిని తిప్పికొట్టింది. ఈ అంశంపై వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి సమాచారం ఇచ్చారు. గత 24 గంటల్లో పాకిస్థాన్ సైన్యం భారతదేశాన్ని ఎలా లక్ష్యంగా చేసుకుందో వివరించారు. వారి ఎత్తుగడలు ఏవీ విజయవంతం కాలేదని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ లక్ష్యం ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం.. మేము ఏ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదు అని వెల్లడించారు. పాకిస్థాన్ మాత్ర భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుందన్నారు. ఇలాంటి పని చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తాము ఇప్పటికే హెచ్చరించామని స్పష్టం చేశారు. అమాయక ప్రజలను చంపినందుకు పాకిస్థాన్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
READ MORE: RAPO 22: రామ్ సినిమా టైటిల్ ఆరోజే చెప్తారట!
Also Read
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ.. “2025 మే 7/8 రాత్రి, పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులతో అనేక భారత సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. వారి ప్రతి దాడిని సైనికులు భగ్నం చేశారు. పాకిస్థాన్ దాడికి రుజువు ఆ దేశానికి చెందిన ఆయుధ శిథిలాలు. ఇవి చాలా చోట్ల దొరికాయి. దీనికి ప్రతిగా భారత సైన్యం ఈ ఉదయం పాకిస్థాన్లోని అనేక ప్రదేశాలపై దాడి చేసి వారి వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది. లాహోర్లో వైమానిక రక్షణ వ్యవస్థ ధ్వంసమైంది.” అని సోఫియా ఖురేషి వెల్లడించారు. జమ్మూ కశ్మీర్లోని కుప్వారా, బారాముల్లా, ఉరి, పూంచ్, మెంధార్ రాజౌరి సెక్టార్లలో పాకిస్థాన్ అకస్మాత్తుగా మోర్టార్లు, భారీ ఫిరంగి కాల్పులకు పాల్పడిందని వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ తెలిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు పిల్లలు సహా 16 మంది అమాయక పౌరులు మరణించారని వెల్లడించారు. ఈ దుర్మార్గపు చర్యకు అనంతరం భారత సైన్యం వెంటనే స్పందించిందని.. పాకిస్థాన్ పోస్టులపై లక్ష్యంగా కాల్పులు జరిపిందని వెల్లడించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!