ఇదిలా ఉంటే, ఈ రోజు తెల్లవారుజామున 10 గంటలకే ఇండియన్ మిలిటరీ మీడియా సమవేశం ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. పాకిస్తా్న్ వ్యాప్తంగా ఎలాంటి విధ్వంసం సృష్టించిందనే వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో సౌత్ బ్లాక్ లో మీడియా సమావేశం జరగబోతోంది.
Operation Sindoor: భారత్ పాకిస్తాన్లో విధ్వంసం సృష్టిస్తోంది. శుక్రవారం పాకిస్తాన్ జరిపిన డ్రోన్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంది. ఏకంగా భారత్, పాకిస్తాన్ ఆర్మీ హెడ్క్వార్టర్స్ ఉన్న రావల్పిండిని టార్గెట్ చేసింది. రావల్పిండిలోని కీలకమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్పై భీకర దాడి చేసింది.
Operation Sindoor: భారత్ మరోసారి ప్రతీకారం తీర్చుకుంది. శుక్రవార సాయంత్రం పాకిస్తాన్ భారతీయ నగరాలను టార్గెట్ చేస్తూ డ్రోన్ దాడులకు తెగబడింది. దీనికి ప్రతీకారంగా శనివారం తెల్లవారుజామున ఇండియా పాకిస్తాన్ వ్యాప్తంగా భారీ దాడులు చేసింది. ఏకంగా పాకిస్తాన్ మిలిటరీకి హెడ్ క్వార్టర్గా ఉన్న రావల్పిండినే భారత్ టార్గెట్ చేసింది. బాలిస్టిక్ మిస్సైల్స్, డ్రోన్లతో భారత్ దాడులు చేసినట్లు తెలుస్తోంది.
India Pakistan War:పాకిస్తాన్ వ్యాప్తంగా భారత్ దాడులు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. భారీ ఎత్తున భారత్ పాకిస్తాన్పై దాడులు చేస్తోంది. నార్వాల్, షార్కోట్, నూర్ ఖాన్ ఎయిర్ బేస్లను భారత్ ద్వంసం చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రజలు సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా, పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉన్న రావల్పిండిపై భారీ దాడి జరిగినట్లు సమాచారం వస్తోంది.
India Pakistan: పాకిస్తాన్ భారతదేశంలో చేస్తు్న్న ఉగ్రవాద దాడుల్ని కవర్ చేసేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ వీడియోలను వాడుతోంది. ఇటీవల, పహల్గామ్ ఉగ్రదాడిలో పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు 26 మంది అమాయకపు టూరిస్టుల్ని బలితీసుకున్నారు
India Pakistan Tension: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకుంది. 100కు పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది. దీని తర్వాత, పాకిస్తాన్ భారత్పై డ్రోన్ దాడికి తెగబడింది. అయితే, భారత సైన్యం ఈ దాడిని భగ్నం చేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.
India Pak War: సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్లలోని పలు నగరాలను, ప్రజల ఇళ్లను టార్గెట్ చేస్తూ వరసగా రెండో రోజు పాకిస్తాన్ డ్రోన్ అటాక్ చేసింది. అయితే, భారత గగనతల రక్షణ వ్యవస్థ వీటిని సమర్థవంతంగా అడ్డుకుంది. అయితే, ఈ దాడిలో పాకిస్తాన్ మిత్ర దేశం టర్కీ పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. భయంకరమైన భూకంప సమయంలో మానవతా దృక్పథంలో భారత్ టర్కీకి సాయం చేసినా, ఆ దేశం మాత్రం పాకిస్తాన్కి సహకరిస్తూ వస్తోంది.…
IMF: భారత అభ్యంతరాలను పట్టించుకోకుండా, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) పాకిస్తాన్కి 1 బిలియన్ డాలర్లు రుణాన్ని మంజూరు చేసింది. ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ(EFF) కింద బెయిలౌట్ ప్యాకేజీని అందించినట్లు పాకిస్తాన్ ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) తెలిపింది.
Pak Drone Attack: పాకిస్తాన్ తన కుట్రలను కొనసాగిస్తూనే ఉంది. పాక్ పౌర విమానాలను రక్షణగా ఉంచుకుని భారత్పై డ్రోన్ దాడులకు తెగబడుతోంది. వరసగా రెండో రోజు కూడా పాకిస్తాన్ భారత నగరాలే లక్ష్యంగా డ్రోన్ దాడులు చేసింది. అంతర్జాతీయ సరిహద్దు (IB),నియంత్రణ రేఖ (LOC)లను దాటి దాడి చేసేందుకు పాక్ ప్రయత్నించింది. ఈ ప్రయత్నాలనున భారత సైన్యం భగ్నం చేసింది.
Donald Trump: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పాకిస్తాన్ భారత్పై వరసగా రెండో రోజు డ్రోన్ దాడులు చేసింది. సరిహద్దుల్లోని 20 నగరాలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, వీటన్నింటిన భారత గగనతల రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకుంది. తాజాగా, ఉద్రిక్తతలపై ట్రంప్ స్పందించినట్లు వైట్ హౌజ్ ప్రకటించింది. త్వరగా సమస్య ముగియాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. Read Also: Pak drone attacks: 20 నగరాలను లక్ష్యం చేసుకుని పాకిస్తాన్ తాజా డ్రోన్ దాడులు.. భారత్,…