India Pakistan Tension: భారత్ “బ్రహ్మోస్”తో భీకర దాడి.. పాక్ అణు స్థావరాల నుంచి రేడియేషన్ లీక్.?
- బ్రహ్మోస్తో పాకిస్తాన్పై భారత భీకర దాడి..
- నూర్కాన్, సర్గోదా ఎయిర్బేస్ల నుంచి అణ్వాయుధాలు ధ్వంసం..
- రేడియేషన్ లీక్ అవుతున్నట్లు అనుమానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pakistan Tension: ఆపరేషన్ సిందూర్ దాటికి పాకిస్తాన్ నిలవలేకపోయింది. ఇన్నాళ్లు మేము గొప్ప మిలిటరీ శక్తిగా భావిస్తూ వచ్చిన పాకిస్తాన్కి, భారత్ దాడులు దాని స్థాయి ఎంటో నిరూపించింది. పాకిస్తాన్ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలపై భారత్ దాడులు చేసింది. పాకిస్తాన్ లోని ఎయిర్బేస్లను భారత్ లక్ష్యంగా చేసుకుని భీకర దాడి చేసింది. అయితే, ఇప్పుడు ఓ సమాచారం పాకిస్తాన్లో వణుకు పుట్టిస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ అణు స్థావరాలపై భారత్ బ్రహ్మోస్తో దాడులు చేసినట్లు తెలుస్తోంది. బ్రహ్మోస్ ధాటికి పాక్ అణ్వాయుధాల నుంచి రేడియేషన్ లీక్ అవుతున్నట్లు సమాచారం. దీని కారణంగా, పాకిస్తాన్ అమెరికా కాళ్లు పట్టుకుని భారత్ని కాల్పుల విరమణకు ఒప్పించాలని ప్రాధేయపడినట్లు తెలుస్తోంది.
శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్లోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉన్న రావల్పిండిలోని నూర్ కాన్ ఎయిర్ బేస్పై భారత్ బ్రహ్మోస్ తో దాడి చేసినట్లు తెలుస్తోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాటలు కూడా భారత్, పాకిస్తాన్పై బ్రహ్మోస్తో దాడి చేసినట్లు వెల్లడిస్తోంది. నూర్కాన్ బేస్ వద్ద అండర్గ్రౌండ్లో అణ్వాయుధాలను పాకిస్తాన్ దాచినట్లు తెలుస్తోంది. నూర్కాన్ బేస్, సర్గోదా ఎయిర్ బేస్లపై భారత్ దాడితో బంకర్లు బద్ధలవడంతో అణ్వాయుధాలు దెబ్బతిని, వాటి నుంచి రేడియేషన్ లీక్ అయినట్లు తెలుస్తోంది. దీనిని పరిశీలించేందుకు అమెరికా న్యూక్లియర్ అడిట్ ఎయిర్ క్రాఫ్ట్ పాకిస్తాన్ చేరుకున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
Read Also: Pithapuram Crime: పిఠాపురంలో చిన్నారి హత్య కేసును ఛేదించిన పోలీసులు.. అంతా అమ్మమ్మే చేసింది!
మే 10 తేదీ శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్ లోని మొత్తం 11 ఎయిర్ బేస్లని భారత్ కేవలం 90 నిమిషాల్లోనే నాశనం చేసింది. ఈ దాడుల్లో బ్రహ్మోస్ వాడినట్లు తెలుస్తోంది. ఈ ఎయిర్ బేసుల్లో సర్గోదా తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. సర్గోదాకు సమీపంలోని కిర్నా పర్వతాల్లో పాకిస్తాన్ అణ్వాయుధాలు దాచిపెడుతుంది. ఈ పర్వతాల్లోనే అనేక సొరంగాల్లో పాక్ వీటిని భద్రపరుస్తుంది. అయితే, ఈ ప్రాంతాల్లో భారత్ దాడి చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఇదే సమయంలో, శనివారం తెల్లవారుజామున భూకంపం వచ్చింది. 4.0 తీవ్రతతో భూప్రంకపనలు రావడం కూడా ఇందుకు అనుమానాలు రేకెత్తిస్తోంది. భారత్ దాడికి ఏదైనా అణ్వాయుధం భూగర్భంలో పేలిందా..? అనే ప్రశ్నలు వెలువడుతున్నా్యి. అణ్వాయుధాలతో భారత్ ని బ్లాక్మెయిల్ చేస్తున్న పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి ఈ దాడులు చేసిందా అనే చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
-
H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!