Operation Sindoor: భారత్కు నష్టమేమీ జరగలేదు.. ఏకే భారతి వెల్లడి
- భారత్కు నష్టమేమీ జరగలేదు
- డీజీఎంవో ఎయిర్ మార్షల్ ఏకే భారతి వెల్లడి
భారత్లో తక్కువ స్థాయిలో నష్టం జరిగిందని భారత్ డీజీఎంవో పేర్కొంది. ఆపరేషన్ సిందూర్పై జాయింట్ మిలటరీ ప్రెస్మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా త్రివిధ దళాల అధిపతులు మీడియాతో మాట్లాడారు. ‘‘సరిహద్దుల దగ్గర భారత వాయుసేన తన ఆయుధ సంపత్తితో దృఢంగా.. సిద్ధంగా ఉంది. ఉగ్రవాదులకు పాకిస్థాన్ మద్దతు ఇచ్చినందున.. భారత వాయుసేన ఆగ్రహాన్ని పాక్ చవిచూడాల్సి వచ్చింది. దేశీయంగా తయారైన “గగనతల రక్షణ వ్యవస్థ” పాకిస్థాన్ పంపిన డ్రోన్లను కూల్చి వేసింది. శత్రు దేశానికి సంబంధించిన దాడులను అడ్డుకోవడంలో భారత వాయుసేన సమర్థవంతంగా వ్యవహరించింది. మన వ్యవస్థలు అద్భుతంగా పని చేశాయి. కూలిన పాకిస్థాన్ ప్రయోగించిన దీర్ఘ శ్రేణి క్షిపణుల శకలాలను మేము దేశ ప్రజలకు చూపిస్తున్నాం. పాకిస్థాన్లో జరిగిన దాడులకు ఆ దేశ ఆర్మీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. చైనా డ్రోన్లు , మిస్సైల్ను విజయవంతంగా ధ్వంసం చేశాం. భారత్, చైనాల మధ్య సరిహద్దు రేఖను, అంతర్జాతీయ సరిహద్దులను దాటకుండానే పాకిస్థాన్లో ఎంచుకున్న లక్ష్యాలను ఛేదించాం. భారత్ వైపు చాలా తక్కువ స్థాయిలో నష్టం జరిగింది.’’ అని డీజీఎంవో ఎయిర్ మార్షల్ ఏకే భారతి పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Operation Sindoor: ఉగ్రవాదానికి పాకిస్థాన్ అండగా నిలిచింది.. భారత్ డీజీఎంవో వెల్లడి
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
‘‘భారత వాయుసేన జరిపిన దాడులను అడ్డుకోవడంలో చైనా నుంచి కొనుగోలు చేసిన “పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ” విఫలమైంది. భారత వాయుసేనకు నిర్దేశించిన లక్ష్యాలపై కరాచీలో విజయవంతంగా దాడులు నిర్వహించాం. భారత్ లక్ష్యంగా పాకిస్తాన్ వాయుసేన చేసిన దాడులను సమర్ధవంతంగా తిప్పి కొట్టాం.’’ అని డీజీఎంవో ఎయిర్ మార్షల్ ఏకే భారతి తెలిపారు.
ఇది కూడా చదవండి: Manoj Naravane: ‘‘యుద్ధం అంటే రొమాంటిక్ కాదు, మీ బాలీవుడ్ సినిమా కాదు’’: మాజీ ఆర్మీ చీఫ్
आकाशे शत्रुन् जहि I
Destroy the Enemy in the Sky.#PahalgamTerrorAttack #OperationSindoor#JusticeServed #IndianArmy@IAF_MCC @indiannavy pic.twitter.com/vO28RS0IdE
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 12, 2025
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!