After Ceasefire: పహల్గాం దాడి అనంతరం తొలిసారి ప్రశాంతమైన రాత్రి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
After Ceasefire: భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన రెండు రోజుల తరువాత జమ్మూ కశ్మీర్ సహా అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం నెలకొన్నదని భారత సైన్యం వెల్లడించింది. గత కొన్ని రోజులుగా తీవ్ర కాల్పుల మధ్య గడిపిన తరువాత, శనివారం సాయంత్రం 5 గంటల నుంచి అమల్లోకి వచ్చిన ఒప్పందం ఫలితంగా గత రాత్రి ప్రశాంతంగా గడిచిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించగా.. ఆ తరువాత నాలుగు రోజులపాటు భారత్–పాకిస్తాన్ మధ్య పరస్పర కాల్పులు కొనసాగాయి. ఈ ఘటన అనంతరం ఇద్దరు దేశాల డైరెక్టర్ల జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) మధ్య చర్చలు జరగగా.. శనివారం సాయంత్రం నుంచే భూమి, ఆకాశం, సముద్రంలో అన్ని రకాల సైనిక చర్యలను ఆపేందుకు ఒప్పందం కుదిరింది.
Read Also: Rajinikanth : హీరోయిన్ కంటే తక్కువ రెమ్యునరేషన్ అందుకున్న రజినీకాంత్..
Also Read
ఒప్పందం కుదిరిన కొన్ని గంటల తరువాతే జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్తో పాటు గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో అనుమానాస్పద డ్రోన్ల చలనం కనిపించడంతో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. ఈ డ్రోన్లను భారత భద్రతా దళాలు గుర్తించి అడ్డుకున్నాయి. శనివారం అర్ధరాత్రి సమయంలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ సాయంత్రం భారత్–పాకిస్తాన్ DGMOల మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో వచ్చిన ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించింది. మేము దీనిని అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నాం. సరిహద్దుల్లో ఇటువంటి ఉల్లంఘనలు పునరావృతమైతే, తగిన విధంగా గట్టిగా స్పందించేందుకు సైన్యానికి ఆదేశాలు ఇచ్చాం అని తెలిపారు.
Read Also: Road Accident: చంద్రగిరిలో రోడ్డు ప్రమాదం.. 35 మందికి గాయాలు, కొందరి పరిస్థితి విషమం!
ఇక పహల్గాం ఉగ్రదాడికి పాకిస్తాన్ సంబంధాలున్నాయని నిర్ధారించిన తరువాత, భారత్ మే 7న “ఓపరేషన్ సిందూర్” పేరుతో పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో తొమ్మిది ఉగ్ర స్థావరాలను కుదిపి వేసింది. ఈ దాడులతో ఉగ్ర ముప్పుపై భారత్ స్పష్టమైన సందేశం ఇచ్చిందని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.
తాజావార్తలు
-
DGP CV Anand: “ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్”.. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
-
Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
-
Ireland: ఐర్లాండ్లో అల్లర్లు.. తగలబడ్డ కార్లు, భవనాలు
-
TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
-
Sai Pallavi: సాయి పల్లవికి ‘రామాయణ’ శాపంగా మారిందా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!