After Ceasefire: పహల్గాం దాడి అనంతరం తొలిసారి ప్రశాంతమైన రాత్రి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
After Ceasefire: భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన రెండు రోజుల తరువాత జమ్మూ కశ్మీర్ సహా అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం నెలకొన్నదని భారత సైన్యం వెల్లడించింది. గత కొన్ని రోజులుగా తీవ్ర కాల్పుల మధ్య గడిపిన తరువాత, శనివారం సాయంత్రం 5 గంటల నుంచి అమల్లోకి వచ్చిన ఒప్పందం ఫలితంగా గత రాత్రి ప్రశాంతంగా గడిచిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించగా.. ఆ తరువాత నాలుగు రోజులపాటు భారత్–పాకిస్తాన్ మధ్య పరస్పర కాల్పులు కొనసాగాయి. ఈ ఘటన అనంతరం ఇద్దరు దేశాల డైరెక్టర్ల జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) మధ్య చర్చలు జరగగా.. శనివారం సాయంత్రం నుంచే భూమి, ఆకాశం, సముద్రంలో అన్ని రకాల సైనిక చర్యలను ఆపేందుకు ఒప్పందం కుదిరింది.
Read Also: Rajinikanth : హీరోయిన్ కంటే తక్కువ రెమ్యునరేషన్ అందుకున్న రజినీకాంత్..
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
ఒప్పందం కుదిరిన కొన్ని గంటల తరువాతే జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్తో పాటు గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో అనుమానాస్పద డ్రోన్ల చలనం కనిపించడంతో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. ఈ డ్రోన్లను భారత భద్రతా దళాలు గుర్తించి అడ్డుకున్నాయి. శనివారం అర్ధరాత్రి సమయంలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ సాయంత్రం భారత్–పాకిస్తాన్ DGMOల మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో వచ్చిన ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించింది. మేము దీనిని అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నాం. సరిహద్దుల్లో ఇటువంటి ఉల్లంఘనలు పునరావృతమైతే, తగిన విధంగా గట్టిగా స్పందించేందుకు సైన్యానికి ఆదేశాలు ఇచ్చాం అని తెలిపారు.
Read Also: Road Accident: చంద్రగిరిలో రోడ్డు ప్రమాదం.. 35 మందికి గాయాలు, కొందరి పరిస్థితి విషమం!
ఇక పహల్గాం ఉగ్రదాడికి పాకిస్తాన్ సంబంధాలున్నాయని నిర్ధారించిన తరువాత, భారత్ మే 7న “ఓపరేషన్ సిందూర్” పేరుతో పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో తొమ్మిది ఉగ్ర స్థావరాలను కుదిపి వేసింది. ఈ దాడులతో ఉగ్ర ముప్పుపై భారత్ స్పష్టమైన సందేశం ఇచ్చిందని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!