Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కాకరేపుతున్నాయి.. సమావేశాల ఆరంభం నుంచి ప్రతీరోజూ విపక్షాల ఆందోళనలతో ఉభయసభలు అట్టుడుకుతున్నాయి.. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీఛార్జ్పై అమిత్షా సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షలు.. అయితే, నీట్ పేపర్ లీక్, విద్యార్థుల నిరసనల అంశంపై పార్లమెంటులో చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ప్రభుత్వానికి దాచడానికి ఏమీ లేదని, ప్రతిపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పార్లమెంటు కార్యకలాపాలను సజావుగా సాగనివ్వాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు.
మధ్యాహ్నం 3 గంటల నుంచి చర్చకు సిద్ధం
నీట్ పేపర్ లీక్, జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన లాఠీచార్జికి సంబంధించి ప్రతిపక్షాలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వివరణ కోరుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. చర్చకు సిద్ధంగా ఉన్నామని చెబుతూ, ప్రతిపక్షాలు మధ్యాహ్నం 2 గంటలలోపు స్పీకర్కు లేఖ ఇవ్వాలని అమిత్ షా సూచించారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు చర్చ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. తాను స్వయంగా చర్చలో పాల్గొంటానని స్పష్టం చేశారు.
Also Read
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
- SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
‘ప్రభుత్వానికి దాచడానికి ఏమీ లేదు’
నీట్ పేపర్ లీక్పై విద్యార్థులు చేస్తున్న ఆందోళనలకు సంబంధించి ప్రభుత్వానికి దాచడానికి ఏమీ లేదని అమిత్ షా అన్నారు. ఈ వ్యవహారంపై ఎలాంటి ప్రశ్నలు అడిగినా సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతి అంశంపై చర్చకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. అయితే పార్లమెంటు కార్యకలాపాలను ప్రతిపక్షాలు అడ్డుకోవడం సరికాదని అన్నారు. సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి తాను క్రమం తప్పకుండా పార్లమెంటుకు హాజరవుతున్నానని అమిత్ షా పేర్కొన్నారు.
పార్లమెంటు నిబంధనల ప్రకారమే చర్చ
పార్లమెంటులో ఏ అంశంపై చర్చించాలన్నా నిర్దిష్టమైన నియమ నిబంధనలు ఉంటాయని అమిత్ షా తెలిపారు. ఇంత తీవ్రమైన అంశాన్ని కేవలం ఒక ప్రకటన ద్వారా చర్చించలేమని చెప్పారు. పార్లమెంటులో ఏ అంశాన్నైనా వివరంగా చర్చించే అవకాశం ఉందని, ప్రభుత్వం ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అవసరమైతే, స్పీకర్ అనుమతిస్తే ప్రశ్నోత్తరాల సమయాన్ని వాయిదా వేసి కూడా చర్చకు అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అమిత్ షా తెలిపారు.
నిర్ణయం ప్రతిపక్షాలదే
నీట్ పేపర్ లీక్, విద్యార్థుల నిరసనలు, లాఠీచార్జి వంటి అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేసిన అమిత్ షా.. ఇప్పుడు చర్చ జరగాలా వద్దా అనేది ప్రతిపక్షాలే నిర్ణయించుకోవాలని అన్నారు. పార్లమెంటు ప్రజా సమస్యలపై చర్చించేందుకు వేదిక అని, అందువల్ల సభ కార్యకలాపాలను అడ్డుకోకుండా చర్చకు సహకరించాలని ప్రతిపక్షాలను కోరారు. నీట్ అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉందని మరోసారి స్పష్టం చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా..
తాజావార్తలు
-
Harish Rao: ‘22Aతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు’..
-
Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
-
Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
-
Nara Lokesh: అక్షర ఆంధ్రకు నారా లోకేష్ కొత్త టార్గెట్.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత
-
Nepal Floods: నేపాల్లో వందలాది మృతదేహాలను ఎందుకు పూడ్చిపెడుతున్నారు..? అసలు కారణం ఇదే
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!