Operation Sindoor: ఐదుగురు సైనికుల వీరమరణం.. వారి త్యాగం దేశం ఎప్పటికీ మర్చిపోదు..
- ఆపరేషన్ సిందూర్లో ఐదుగురు జవాన్లు వీరమరణం..
- ఐదుగురు జవాన్లు, పాక్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పౌరులకు సంతాపం..
- అమర జవాన్ల త్యాగాలను దేశం ఎన్నటికీ మర్చిపోదన్న ఇండియన్ ఆర్మీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్లో ఐదుగురు జవాన్లు అమరులైనట్లు వెల్లడించారు DGMO రాజీవ్ ఘాయ్.. ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాలపై తొలిసారి ఆర్మీ, ఎయిర్ఫోర్స్, నేవీ DGMOలు సంయుక్త మీడియా సమావేశం.. నిర్వహించారు.. అందులో DGMO రాజీవ్ ఘాయ్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్లో ఐదుగురు సైనికులు అమరులయ్యారు.. ఐదుగురు జవాన్లు, పాక్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పౌరులకు సంతాపం తెలియజేస్తున్నాం.. అమర జవాన్ల త్యాగాలను దేశం ఎన్నటికీ మర్చిపోదు అన్నారు.. ఇక, ఆపరేషన్ సిందూర్లో మనం 5 మంది సైనికులను కోల్పోతే.. మే 7 నుంచి 10 మధ్య నియంత్రణ రేఖ వద్ద ఫిరంగి, చిన్న ఆయుధాల కాల్పుల్లో పాకిస్తాన్ సైన్యం సుమారు 35 నుండి 40 మంది సిబ్బందిని కోల్పోయిందని పేర్కొన్నారు.
Read Also: Indian Navy: కరాచీతో సహా చాలా లక్ష్యాలను ఇండియన్ నేవీ టార్గెట్ చేసింది..
Also Read
- NEET Ranker: కన్నీటి నుంచి పుట్టిన సంకల్పం.. తండ్రి మరణాన్ని స్ఫూర్తిగా మార్చుకుని 'నీట్'లో ర్యాంక్..
- NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
- UCC Bill: 'ఒక్క పెళ్లి చేసుకున్నవారికే రాష్ట్రంలో ఉండే హక్కు ఉంటుంది'.. సీఎం సంచలన ప్రకటన..
- Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్.. పాక్ ఆక్రమిత-కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయడానికి మే 7 ప్రారంభంలో ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభించాం.. పాకిస్తాన్ దాడులకు తదుపరి ప్రతీకార చర్యలన్నీ ‘ఆపరేషన్ సిందూర్’ కిందే జరిగాయని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది.. మా లక్ష్యాలు ఉగ్రవాద శిబిరాలు.. వారు మా మౌలిక సదుపాయాలపై వైమానిక దాడులు చేశాం.. మా లక్ష్యాలన్నింటినీ అందుకున్నాం.. పైలట్స్ అందరూ తిరిగివచ్చారని స్పష్టం చేశారు.. భారత్ పైలట్ను పట్టుకున్నామన్న పాకిస్తాన్ ప్రచారం నిజంకాదని కొట్టిపారేశారు.. భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకున్న కొన్ని గంటల తర్వాత, పాకిస్తాన్ శనివారం కాల్పుల విరమణను ఉల్లంఘించింది.. ఇప్పటికీ పాక్ను నమ్మలేం.. కానీ, కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే ఏమవుతుందో వాళ్లకు తెలుసు అంటూ వార్నింగ్ ఇచ్చారు DGMO రాజీవ్ ఘాయ్.. ఈ రాత్రి లేదా తరువాత కాల్పుల విరమణ ఉల్లంఘన జరిగితే, దానికి తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్..
తాజావార్తలు
-
KTR : స్థానిక యువతకు 95 శాతం ఉద్యోగాలు సాధించింది కేసీఆరే
-
Maheshwara Reddy: రివ్యూలపై ‘ఓ సుకుమారి’ నిర్మాత షాకింగ్ కామెంట్స్!
-
NEET Ranker: కన్నీటి నుంచి పుట్టిన సంకల్పం.. తండ్రి మరణాన్ని స్ఫూర్తిగా మార్చుకుని ‘నీట్’లో ర్యాంక్..
-
NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
-
Kitchen Tips: వెల్లుల్లి తొక్క తీయడానికి ఇబ్బంది పడుతున్నారా? ఈ ఈజీ టిఫ్తో సెకన్లలో పని పూర్తి!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!