Operation Sindoor: ఉగ్రవాదానికి పాకిస్థాన్ అండగా నిలిచింది.. భారత్ డీజీఎంవో వెల్లడి
- ఉగ్రవాదానికి పాకిస్థాన్ అండగా నిలిచింది
- భారత్ డీజీఎంవో వెల్లడి
ఉగ్రవాదానికి పాకిస్థాన్ అండగా నిలిచిందని భారత్ డీజీఎంవో పేర్కొంది. ఆపరేషన్ సిందూర్పై జాయింట్ మిలటరీ ప్రెస్మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా త్రివిధ దళాల అధిపతులు మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదులు, వారికి సాయం చేసే వారే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ జరిగిందని పేర్కొన్నారు. కానీ పాకిస్థాన్ మాత్రం తమపై భారత్ దాడి చేస్తోందని భావించిందన్నారు. మన పోరాటం ఉగ్రవాదులపైనే అని తెలిపారు. పాకిస్థాన్ వివిధ రకాల డ్రోన్లు ప్రయోగించిందని భారత్ డీజీఎంవో స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: PM Modi: రాత్రి 8 గంటలకు మోడీ ప్రెస్మీట్.. సర్వత్రా ఉత్కంఠ
Also Read
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
ఉగ్రవాదులు కొన్నేళ్లుగా వ్యూహాలు మార్చుకుంటున్నారని.. సైనికులనే కాకుండా, యాత్రికులను, భక్తులను టార్గెట్ చేసుకుంటున్నారని చెప్పారు. మే 9, 10 తేదీల్లో పాకిస్థాన్ మన వైమానికి స్థావరాలను చాలా టార్గెట్ చేసిందని.. కానీ మన డిఫెన్స్ వ్యవస్థతో వాటిని అడ్డుకున్నట్లు చెప్పుకొచ్చారు. మల్టీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను దాటుకొని పాకిస్థాన్ మన వైమానికి స్థావరాలను ధ్వంసం చేయలేకపోయిందని.. వివిధ రకాల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో మనం పాకిస్థాన్ను అడ్డుకున్నట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Ram Charan : చరణ్ మైనపు విగ్రహంతో చిరంజీవి ఫ్యామిలీ..
‘‘పాకిస్తాన్ వివిధ రకాల డ్రోన్లను వినియోగించింది. దేశీయంగా తయారు చేసిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో మనం వాటిని అడ్డుకున్నాం.. ఆకాశ్ డిఫెన్స్ వ్యవస్థతో శత్రువులను దీటుగా ఎదుర్కొన్నాం. చైనా తయారు చేసిన పీఎల్-15 మిస్సైళ్లతో పాక్ దాడి చేసింది. వాటిని మనం ఆకాశ్ క్షిపణులతో నిర్వీర్యం చేశాం. పాక్లోని నూర్ఖాన్ ఎయిర్బేస్పై ఇండియన్ ఎయిర్ఫోర్స్ దాడి చేసింది. నూర్ఖాన్ ఎయిర్బేస్ రన్వేకు తీవ్రనష్టం జరిగింది.’’ అని డీజీఎంవో ఎయిర్ మార్షల్ ఏకే భారతి పేర్కొన్నారు.
‘‘దేశ ప్రజలంతా మాకు అండగా నిలిచారు. శత్రువుల విమానాలను మన దేశంలోకి రాకుండా అడ్డుకున్నాం. మన అన్ని సైనిక స్థావరాలు సిద్ధంగా ఉన్నాయి. ఎలాంటి ఆపరేషన్కు అయినా మేం సన్నద్ధంగా ఉన్నాం. పాక్కు జరిగిన డ్యామేజీ ఆ దేశం చెప్పుకోవడం లేదు.’’ అని డీజీఎంవో ఎయిర్ మార్షల్ ఏకే భారతి వెల్లడించారు.
आकाशे शत्रुन् जहि I
Destroy the Enemy in the Sky.#PahalgamTerrorAttack #OperationSindoor#JusticeServed #IndianArmy@IAF_MCC @indiannavy pic.twitter.com/vO28RS0IdE
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 12, 2025

తాజావార్తలు
-
Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
-
YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
-
Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా కోహ్లీ రికార్డుల వేట.. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ విరాట్..
-
Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!