కె.రాఘవేంద్రరావు, ఆయన అన్న కె.కృష్ణమోహనరావు కలసి తమ ఆర్.కె.అసోసియేట్స్ పతాకంపై టాప్ స్టార్స్ తో పలు చిత్రాలు తెరకెక్కించారు. మోహన్ బాబుతో వారు నిర్మించిన ‘అల్లరి మొగుడు’ చిత్రం భలేగా అలరించింది. ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావే దర్శకత్వం వహించారు. 1992 ఫిబ్రవరి 14న ‘అల్లరి మొగుడు’ జనం ముందు నిలచి, వారి మనసులు గెలిచింది. ‘అల్లరి మొగుడు’ కథ ఏమిటంటే- గోపాల్ హార్మోనియం చేతపట్టుకొని పట్నం చేరతాడు. అతనికి తబలా వాయించే సత్యం తోడవుతాడు. వారిద్దరూ కలసి…
రైటర్ డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో మోహన్ బాబు నటించి, నిర్మించిన సినిమా ‘సన్ ఆఫ్ ఇండియా’. ఈ నెల 18న ఇది విడుదల కాబోతోంది. ఈ సినిమా కాన్సెప్ట్ గురించి మోహన్ బాబు తెలియచేస్తూ, ఆసక్తి కరమైన విషయాలను వెల్లడించారు. ‘ఓ ఎమ్మెల్యే కారణంగా చేయని తప్పుకు జైలుకు వెళ్ళిన ఓ వ్యక్తి, తనలాంటి అమాయకులు దేశ వ్యాప్తంగా జైళ్ళలో ఎంతమంది ఉన్నారనే విషయమై పరిశోధన చేసి, ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడన్నదే ఈ చిత్ర కథ’ అని…
బొత్స సత్యనారాయణ ఇంటి వివాహ వేడుకలో ఏపీ మంత్రి పేర్ని నానిని తనను కలిశారని, వారి కుటుంబంతో ఉన్న అనుబంధం దృష్ట్యా తన ఇంటికి బ్రేక్ ఫాస్ట్ కు పిలిచానని, దాన్ని కూడా కొందరు చెత్త నా కొడుకులు రాజకీయం చేశారని సీనియర్ నటుడు, నిర్మాత మోహన్ బాబు మండిపడ్డారు. మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఆయన నటించిన ‘సన్నాఫ్ ఇండియా’ చిత్రం ఈ నెల 18న విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా…
సీనియర్ హీరో మోహన్ బాబు “సన్ ఆఫ్ ఇండియా”తో థియేటర్లలో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో నిజ జీవిత సంఘటల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 18న సినిమా హాళ్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం మేకర్స్ సినిమా ప్రొమోషన్లపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే నిన్న “సన్ ఆఫ్ ఇండియా” ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. Read Also : Son of India : అలీపై షాకింగ్ కామెంట్స్… సునీల్…
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం “సన్ ఆఫ్ ఇండియా”. మంచు విష్ణు నిర్మాణంలో నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 18న విడుదల కానుంది. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. “సన్ ఆఫ్ ఇండియా” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్రం బృందంతో పాటు మంచు లక్ష్మి, మంచు విష్ణు, పోసాని కృష్ణ మురళి, అలీ, సునీల్…
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “సన్ ఆఫ్ ఇండియా”. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 18న విడుదల కానుంది. నిజజీవిత సంఘటనల ఆధారంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. “సన్ ఆఫ్ ఇండియా” చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్…
2002, 2003 నుండి మోహన్ బాబుతో నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉందని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని అన్నారు. కాఫీ కోసం పిలిస్తే వారి ఇంటికి వెళ్లానని, మాటల సందర్భంగా సినిమా వ్యవహారాలు చర్చకు వచ్చాయని, కానీ కొందరు దీనిపై కూడా దుష్ర్పచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నిన్న మోహన్ బాబు రానందుకు వివరణ ఇవ్వటానికి వెళ్లానని అంటున్నారని, అదేమీ కాదు, అలాంటిదేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం తరఫున ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన…
ఏపీల సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని నేడు సినీ నటుడు మోహన్బాబు ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే పేర్ని నాని తమ ఇంటికి రావాడాన్ని తెలుపుతూ ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. తెలుగు సినీ ఇండస్ట్రీపై ఏపీ ప్రభుత్వానికి ఉన్న ఆలోచనలపై చర్చించడానికి విచ్చేసిన పేర్నినాని కృతజ్ఞతలు అన్నట్లుగా ఆయన ట్విట్ చేశారు. దీంతో నెట్టింట వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ..…
కలెక్షన్ కింగ్, డా. మంచు మోహన్బాబు హీరోగా డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో విష్ణు మంచు నిర్మించిన చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. చిత్ర కథానాయకుడు మోహన్బాబు అదనంగా దీనికి స్క్రీన్ప్లే బాధ్యతను కూడా నిర్వహించారు. ఫిబ్రవరి 18న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న నేపధ్యంలో గురువారం సాయంత్రం థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు. 1.33 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో మోహన్ బాబు తనదైన శైలిలో సంభాషణలు చెప్పి మెప్పించారు. దర్శకుడు…
ఇప్పటికే టాలీవుడ్ లో ఫిబ్రవరి రేసులో చాలా సినిమాలు ఉన్నాయి. తాజాగా “సన్ ఆఫ్ ఇండియా” కూడా ఫిబ్రవరిలో రావడానికి సిద్ధమయ్యాడు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “సన్ ఆఫ్ ఇండియా”. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. నిజజీవిత సంఘటనల ఆధారంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. “సన్ ఆఫ్ ఇండియా” చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు మేస్ట్రో ఇళయరాజా…