హిందువులు సెలెబ్రేట్ చేసుకునే ముఖ్యమైన పండుగల్లో శ్రీరామ నవమి కూడా ఒకటి. హిందూ క్యాలెండరు ప్రకారం మొదటి నెల అయిన చైత్ర మాసంలోని తొమ్మిదవ రోజును ‘శ్రీరామనవమి’గా జరుపుకుంటారు. ఈ రోజున ప్రఖ్యాత హిందూ దేవాలయం భద్రాచలంలో సీతారామ కళ్యాణాన్ని వైభోగంగా నిర్వహిస్తారు. కాగా శ్రీ రామ నవమి సందర్భంగా తెలుగు సినీ ప్రముఖులు మహేష్ బాబు, చిరంజీవి, రవితేజలతో పాటు పలువురు నటులు తెలుగు వారికి, తమ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.…
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సన్ అఫ్ ఇండియా’. ఈ చిత్రంలో మోహన్ బాబు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ దేశభక్తి చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి మోహన్ బాబు స్క్రీన్ ప్లే అందిస్తుండడం విశేషం. తాజా సమాచారం ప్రకారం ‘సన్ అఫ్ ఇండియా’ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలు పెట్టింది. అయితే ఈ చిత్రంలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా చాలా సర్ప్రైజ్…