ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది… తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో సినీ నటుడు మోహన్బాబు భేటీ అయ్యారు.. ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది.. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయాలపై దాదాపు రెండు గంటల పాటు చర్చించినట్టు సమాచారం.. దశాబ్ధ కాలంగా చంద్రబాబుతో మోహన్బాబుకు గ్యాప్ ఉంది.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాట్లాడుతూ.. ఓ రేంజ్లో ఫైర్ అయ్యేవారు మోహన్బాబు.. ఆయన పేరు ఎత్తితేనే భగ్గుమనేవారు.. కానీ, తాజా సమావేశం ఆసక్తికరంగా…
భారతదేశంలోనే అత్యధిక చిత్రాలు నిర్మించి, నటించిన నటనిర్మాతగా మోహన్ బాబు తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు. తన కూతురు లక్ష్మీప్రసన్న పేరిట 1982లో 'శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్' సంస్థను నెలకొల్పి, తరువాత దాదాపు యాభై చిత్రాలను మోహన్ బాబు నిర్మించారు.
శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి కాంబినేషన్లో తెరకెక్కుతున్న తొలి చిత్రానికి ‘అగ్ని నక్షత్రం’ అనే పేరు ఖరారు చేశారు. విలక్షణ నటుడు సముతిర కని, మలయాళీ నటుడు సిద్ధిక్, విశ్వంత్, జబర్దస్త్ మహేష్ ఇతర ప్రధాన పాత్రలుప పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ బాబు, లక్ష్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ…
తన రూటే సెపరేటు అనే హీరో మోహన్ బాబు.. తాజాగా తిరుపతిలో అదే చేశారు. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు వ్యవహారించారనే కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది. కోర్టు వాయిదాకు ఇద్దరు కుమారులతో కలిసి హాజరైన ఆయన.. కొంత దూరం పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు.. రకరకాల ఊహాగానాలకు తెరతీశాయి. ఒకప్పుడు టీడీపీలో యాక్టివ్గా ఉంటూ.. రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన మోహన్బాబు.. గత ఎన్నికల్లో వైసీపీకి జై కొట్టారు.…
మంచు మోహన్బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇటీవల కాలంలో రాజకీయాల్లో వైసీపీకి మద్దతిస్తున్నారు. 2019 ఎన్నికల్లో కూడా మోహన్బాబు వైసీపీకి మద్దతిచ్చారు. పలు మార్లు సీఎం జగన్ను కూడా కలిశారు. అయితే తాజాగా మోహన్బాబు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ఓ కేసు సందర్భంగా తిరుపతికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తాను బీజేపీ మనిషిని అంటూ ప్రకటించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో తాను కూడా ఒకడిని…
చిరంజీవి, మోహన్ బాబు ఇద్దరూ స్వయంకృషితో చిత్రసీమలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించిన వారు. వారిద్దరూ కలసి ‘శ్రీరామబంటు’ మొదలు ‘కొదమసింహం’ వరకు అనేక చిత్రాల్లో మిత్రులుగా, శత్రువులుగా నటించి అలరించారు. 35 ఏళ్ళ క్రితం చిరంజీవి, మోహన్ బాబు మిత్రులుగా నటించిన ‘చక్రవర్తి’ కూడా జనాన్ని ఆకట్టుకుంది. తరువాతి కాలంలో చిరంజీవికి ‘యముడికి మొగుడు’, మోహన్ బాబుకు ‘పెదరాయుడు’ వంటి సూపర్ డూపర్ హిట్స్ అందించిన రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ‘చక్రవర్తి’ రూపొందడం విశేషం!…