సీనియర్ నటుడు, నిర్మాత మోహన్బాబు నివాసంలో విషాదం నెలకొంది. మోహన్బాబు సోదరుడు రంగస్వామి నాయుడు గుండెపోటుతో బుధవారం మృతి చెందారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రంగస్వామి నాయుడు చనిపోయినట్లు తెలుస్తోంది. ఆయన వయసు 63 సంవత్సరాలు. కొంత కాలంగా రంగస్వామినాయుడు అనారోగ్యంతో బాధ పడుతున్నారు. తిరుపతిలో ఉంటూ వ్యవసాయం చేసుకునే ఆయన… మోహన్బాబు చేపట్టే పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు అని సన్నిహితులు చెప్తున్నారు. Read Also: వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి చేయాలి: చిరంజీవి…
నటసింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ‘అన్ స్టాపబుల్ యన్.బి.కె.’ టాక్ షో దీపావళి రోజున ‘ఆహా’ ఓటీటీలో ఆరంభమయింది. మొదటి రోజునే బాలకృష్ణ ప్రోగ్రామ్ లో గెస్ట్స్ గా ప్రముఖ నటుడు మోహన్ బాబు, ఆయన కూతురు మంచు లక్ష్మి, తనయుడు మంచు విష్ణు రావడం విశేషమనే చెప్పాలి. ఈ ఎపిసోడ్ యాభై నిమిషాలు ఉంది. ఎవడాపుతాడో చూద్దాం… ఆరంభంలో బాలకృష్ణ ఏకపాత్రాభినయం చేస్తున్నట్టుగా తన గురించి జనం ఏమనుకుంటున్నారో వివరిస్తూ తెరపై కనిపించడం ఆకట్టుకుంటుంది.…
నందమూరి బాలకృష్ణ సినిమాల్లో ఆయన పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో విలన్ లకు కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది. “లెజెండ్” సినిమాతో జగపతి బాబు కెరీర్ ఎలా టర్న్ తీసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే బాలయ్య కోసం మరో సీనియర్ హీరో మోహన్ బాబు కూడా విలన్ గా మారడానికి రెడీ అయిపోయారు. Read also : బిగ్ బాస్ 5 : డేంజర్ జోన్ లో ఆ ముగ్గురూ ? బాలయ్య అభిమానులు…
(అక్టోబర్ 29న ‘భలేదొంగలు’కు 45 ఏళ్ళు పూర్తి)ఉత్తరాదిన విజయం సాధించిన చిత్రాల ఆధారంగా వందలాది దక్షిణాది సినిమాలు రూపొంది అలరించాయి. 1970లలో అనేక హిందీ చిత్రాలు తెలుగులో రీమేక్ అయి మురిపించాయి. టాప్ స్టార్స్ అందరూ హిందీ రీమేక్స్ పై మోజుపడ్డ రోజులవి. హిందీలో శశికపూర్, ముంతాజ్ జంటగా రూపొందిన ‘చోర్ మచాయే షోర్’ ఆధారంగా తెలుగులో కృష్ణ, మంజుల జోడీగా ‘భలే దొంగలు’ చిత్రం తెరకెక్కింది. కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వంలో త్రిమూర్తి ప్రొడక్షన్స్ పతాకంపై జి.సాంబశివరావు,…
యంగ్ హీరో మంచు మనోజ్ సినిమాల నుంచి చిన్న విరామం తీసుకున్నాడు. అప్పుడప్పుడూ కొన్ని సామాజిక కార్యక్రమాల్లోనూ కనిపిస్తున్నాడు. ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల సమయంలో మంచు మనోజ్ కన్పించి వార్తల్లో నిలిచాడు. తన సోదరుడు విష్ణుకు సహాయం చేయడంతో పాటు రెండు ప్యానల్లు అనవసరమైన హింసకు పాల్పడకుండా చూసుకోవడానికి మనోజ్ తన శాయశక్తులా ప్రయత్నించాడు. ఆ తరువాత “భీమ్లా నాయక్” సెట్ లో పవన్ ను కలిశాడు. తాజాగా మనోజ్ రెండవ…
నందమూరి బాలకృష్ణ ఓటీటీ లో అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ పేరుతో ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. ఇక ఈ ప్రోగ్రాం కి ‘జాంబీ రెడ్డి’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. నవంబర్ 4 నుంచి మొదలుకానున్న ఈ ప్రోగ్రాం లో ఫస్ట్ గెస్ట్ ఎవరు అనేదానిమీద సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరు అవుతున్నారు అనే…
పాపులర్ తెలుగు ఓటిటి సంస్థ ‘ఆహా’ జెట్ స్పీడ్ తో సరికొత్త షోలతో దూసుకెళ్తోంది. ‘ఆహా’కు, అందులో ప్రసారమవుతున్న షోలకు వస్తున్న రెస్పాన్స్ చూసి దిగ్గజ ఓటిటి సంస్థలు సైతం షాకవుతున్నాయని ఇటీవలే స్టార్ ప్రొడ్యూసర్ ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే’ షో లాంచ్ చేసిన వేదికపై తెలిపారు. తెలుగు ప్రేక్షకులను మరింతగా ఎంటర్టైన్ చేయడానికి పలు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది ‘ఆహా’. ఇప్పటికే ‘సామ్ జామ్’ అంటూ సమంతను హోస్టుగా మార్చి పలువురు సెలెబ్రటీలతో షో…
గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో… సీనియర్ నటుడు,మాజీ పార్లమెంటు రాజ్యసభ సభ్యులు డా.ఎం.మోహన్ బాబు పై కేసు పెట్టడం జరిగింది. ఆయన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికల్ల సందర్భంగా ”మా ఎన్నికల్లో ఘర్షణ ఏమిటి..ఏమిటీ గొడవలు..ఏమిటి బీభత్సం… నో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ,ఎవ్రీబడీ ఈజ్ అబ్జర్వింగ్… గొర్రెలు మేపుకునేవాడి దగ్గర కూడా సెల్ ఫోనుంది..అతనూ చూస్తున్నాడు ఏం జరుగుతుందని. మా…
‘మా’ ఎలక్షన్స్ లో మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారం కూడా అయిపొయింది. ఈ నేపథ్యంలో తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతా బాగానే ఉంది. కానీ ఈ ఎన్నికలు మంచు, మెగా ఫ్యామిలీ మధ్య చిచ్చు పెట్టాయని అంటున్నారు. ఇటీవల కాలంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కూడా దీనికి నిదర్శనం. చిరంజీవి తనను ‘మా’ అధ్యక్ష పదవి రేసు నుంచి వైదొలగమని అడిగారంటూ విష్ణు స్వయంగా వెల్లడించాడు. ఈ…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మోహన్ బాబు మెగా ఫ్యామిలీపై సెటైర్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సినిమాలు హిట్, ప్లాఫ్ అవుతుంటాయి. కానీ మేము అంతముంది ఉన్నాం, ఇంత మంది ఉన్నాం అని బెదిరించినా అదరక బెదరక ఓటు వేసి విష్ణును గెలిపించిన మా సభ్యులకు కృతజ్ఞతలు. నాకు రాగ, ద్వేషాలు లేవు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతా? మంత్రి శ్రీనివాసయాదవ్ చెప్పినట్లు నా కోపం…