మణిపూర్లో మళ్లీ హింస చెలరేగడంతో రాష్ట్రంలో పరిస్థితి అదుపు తప్పింది. శనివారం ముగ్గురు మహిళలతో సహా ఆరుగురి హత్య తర్వాత, ఆగ్రహించిన గుంపు బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్ల దాడి చేశారు. నిరవధిక కర్ఫ్యూ మధ్య, ఎన్పీపీ బీజేపీ ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. రాష్ట్రంలో దిగజారుతున్న పరిస్థితులను అదుపు చేయడంలో మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ విఫలమయ్యారని ఎన్పీపీ ఆరోపించింది.
Manipur: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రావణకాష్టంలా రగిలిపోతుంది. రెండు జాతుల మధ్య వైరంతో ఏడాదిన్నరగా అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో మణిపూర్లో శాంతిభద్రతలను పరీరక్షించడంతో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం విఫలం కావడంతో ఎన్పీపీ మద్దతు ఉపసంహరించుకుంది.
Amit Shah: ఢిల్లీలో సీనియర్ అధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ రోజు సమావేశం నిర్వహించారు. మణిపూర్లో తాజా హింసాత్మక పరిణామాల నేపథ్యంలో భద్రతా పరిస్థితుల్ని సమీక్షించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు అధికారులతో ఆయన సమగ్ర సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.
మరోసారి మణిపూర్ రగిలిపోతుంది. ఇంఫాల్ లోయలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఈ క్రమంలో.. శనివారం ముగ్గురు భారతీయ జనతా పార్టీ, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే నివాసాలపై దాడి చేశారు. ఆందోళనకారులు ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ వ్యక్తిగత నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో.. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
తాజాగా మణిపూర్లో చెలరేగిన హింసపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోడీని టార్గెట్ చేశారు. మీ డబుల్ ఇంజన్ ప్రభుత్వ హయాంలో మణిపూర్ భద్రంగా లేదని ఆయన అన్నారు. మే 2023 నుంచి పెరుగుతున్న హింస మణిపూర్ ప్రజల భవిష్యత్తును పాడు చేసిందని అభిప్రాయపడ్డారు. బీజేపీ జుగుప్సాకరమైన విభజన రాజకీయాలు చేస్తున్నందోని విమర్శించారు. మణిపూర్లో ఉద్దేశపూర్వకంగా విద్వేషాలు రెచ్చగొడుతోందని కాల్చివేయాలని భావిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు.
మరోసారి మణిపూర్లో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్లతో పాటు బిష్ణుపూర్, తౌబాల్, కక్చింగ్, కాంగ్పోక్పి, చురచంద్పూర్ జిల్లాల్లో రెండు రోజుల పాటు ఇంటర్నెట్ నిలిపేశారు. ఇంఫాల్ లోయలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఆందోళనకారులు ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ వ్యక్తిగత నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. పలువురు ఎమ్మెల్యేల నివాసాలపై దాడులు చేసిన ఆస్తుల్ని ధ్వంసం చేశారు.
Manipur Violence: హింసాత్మక ఘటనలతో మరోసారి మణిపూర్లో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్లతో పాటు బిష్ణుపూర్, తౌబాల్, కక్చింగ్, కాంగ్పోక్పి, చురచంద్పూర్ జిల్లాల్లో రెండు రోజుల పాటు ఇంటర్నెట్ నిలిపేశారు. ఇంఫాల్ లోయలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఆందోళనకారులు పలువురు ఎమ్మెల్యేల నివాసాలపై దాడులు చేసిన ఆస్తుల్ని ధ్వంసం చేశారు
మణిపూర్లో కుకీల హింసాకాండ కొనసాగుతోంది. జిరిబామ్ జిల్లాలో కుకీ ఉగ్రవాదులు సోమవారం (నవంబర్ 11న) భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ దాడి తర్వాత వారు ఆరుగురిని కిడ్నాప్ చేశారు. బోరోబెక్రా పోలీస్ స్టేషన్, దానికి దగ్గరలోని సిఆర్పిఎఫ్ పోస్ట్పై కుకీల హింసాత్మక దాడి తర్వాత నుంచీ ఆ ప్రాంతంలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు కనిపించడం లేదు. వారిని కుకీ ఉగ్రవాదులే ఎత్తుకుపోయారని పోలీసులు భావిస్తున్నారు.
Encounter: నేడు (నవంబర్ 11, 2024) మణిపూర్లోని జిరిబామ్ జిల్లాలో CRPF సిబ్బందితో జరిగిన ఎన్కౌంటర్లో 11 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. సీఆర్పీఎఫ్ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఈ ఎన్కౌంటర్ జరిగింది. అందిన సమాచారం ప్రకారం, ఎన్కౌంటర్ సమయంలో ఒక CRPF జవాన్ కూడా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలించారు. మణిపూర్లోని ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలో సోమవారం ఉదయం మిలిటెంట్లు సమీప కొండ ప్రాంతాల నుండి అతనిపై కాల్పులు జరపడంతో ఒక…
మణిపూర్లోని జిరిబామ్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ కానిస్టేబుల్ ఎస్సైని కాల్చి చంపిన ఉదంతం వెలుగు చూసింది. అధికారితో చిన్న వివాదం కారణంగా వాగ్వాదానికి దిగిన కానిస్టేబుల్ ఆవేశంతో తన సర్వీస్ రైఫిల్తో పాయింట్ బ్లాక్ రేంజ్లో ఎస్సైను కాల్చి చంపాడు. దీంతో కుర్చీలో కూర్చున్న ఎస్సై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కాల్పులు జరిపిన కానిస్టేబుల్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.