Manipur Violence : మణిపూర్లో అదుపుతప్పిన పరిస్థితి.. రంగంలోకి అమిత్ షా
- మణిపూర్లో మళ్లీ హింస
- రాష్ట్రంలో అదుపు తప్పిన పరిస్థితి
- పరిస్థితిపై హోంమంత్రి అధికారులతో సమావేశం
- శాంతిభద్రతల పరిస్థితిని సమీక్ష
- ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కేంద్ర హోంమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మణిపూర్లో మళ్లీ హింస చెలరేగడంతో రాష్ట్రంలో పరిస్థితి అదుపు తప్పింది. శనివారం ముగ్గురు మహిళలతో సహా ఆరుగురి హత్య తర్వాత, ఆగ్రహించిన గుంపు బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్ల దాడి చేశారు. నిరవధిక కర్ఫ్యూ మధ్య, ఎన్పీపీ బీజేపీ ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. రాష్ట్రంలో దిగజారుతున్న పరిస్థితులను అదుపు చేయడంలో మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ విఫలమయ్యారని ఎన్పీపీ ఆరోపించింది. మహారాష్ట్రలో తన ఎన్నికల ర్యాలీలను రద్దు చేసుకుని షా తిరిగి వచ్చిన వెంటనే ఈ సమావేశం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం మణిపూర్లో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు మణిపూర్లో పరిస్థితిపై హోంమంత్రి అధికారులతో సమావేశం నిర్వహించి శాంతిభద్రతలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో పరిస్థితిపై ఆయన ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రభుత్వం ఈ మేరకు సమాచారం ఇచ్చింది. అయితే ఈ సమావేశంలో షా ఏం చర్చించారు? నెక్స్ట్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుంది అన్న అంశంపై క్లారిటీ లేదు.
READ MORE: Gold Rate Today: భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. హైదరాబాద్లో తులం ఎంతుందంటే?
Also Read
- Chilli Garlic Egg Salad Recipe: ఉదయాన్నే ఎనర్జీ కావాలా? 5 నిమిషాల్లో రెడీ.. రుచికరమైన హై-ప్రోటీన్ ఎగ్ సలాడ్
- Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు
- Beijing: బీజింగ్లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
- Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్గా తెలుసుకోండిలా..
మణిపూర్లోని ఇంఫాల్ వ్యాలీలోని వివిధ జిల్లాల్లో ఆగ్రహించిన గుంపులు మరో ముగ్గురు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యేలు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇళ్లను తగులబెట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటిపై కూడా ఆందోళనకారులు దాడి చేశారని అధికారులు తెలిపారు. బీరెన్ సింగ్ పూర్వీకుల ఇంటిపై కూడా వారు దాడికి ప్రయత్నించారు. అయితే.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. మణిపూర్లో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించడంతో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఎన్పీపీ (నేషనల్ పీపుల్స్ పార్టీ) మద్దతు ఉపసంహరించుకుంది. మణిపూర్లోని 60 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి 32 మంది ఎమ్మెల్యేల పూర్తి మెజారిటీ ఉంది. ఎన్పీపీ మద్దతు ఉపసంహరణ ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపదు. ఎన్పీపీకి 7 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.
తాజావార్తలు
-
Chilli Garlic Egg Salad Recipe: ఉదయాన్నే ఎనర్జీ కావాలా? 5 నిమిషాల్లో రెడీ.. రుచికరమైన హై-ప్రోటీన్ ఎగ్ సలాడ్
-
Mahabharata Unknown Facts: మహాభారతంలో ఆ నలుగురు ఆయుధం పట్టి ఉంటే.. కురుక్షేత్రం రిజల్ట్ వేరేలా ఉండేది! ఆ మహావీరులు ఎవరో తెలుసా?
-
Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు
-
Haiku : ‘కోర్ట్’ శ్రీదేవి సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ‘నెట్ఫ్లిక్స్’ మైండ్ బ్లాక్ డీల్
-
Beijing: బీజింగ్లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!