Manipur Violence : మణిపూర్లో అదుపుతప్పిన పరిస్థితి.. రంగంలోకి అమిత్ షా
- మణిపూర్లో మళ్లీ హింస
- రాష్ట్రంలో అదుపు తప్పిన పరిస్థితి
- పరిస్థితిపై హోంమంత్రి అధికారులతో సమావేశం
- శాంతిభద్రతల పరిస్థితిని సమీక్ష
- ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కేంద్ర హోంమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మణిపూర్లో మళ్లీ హింస చెలరేగడంతో రాష్ట్రంలో పరిస్థితి అదుపు తప్పింది. శనివారం ముగ్గురు మహిళలతో సహా ఆరుగురి హత్య తర్వాత, ఆగ్రహించిన గుంపు బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్ల దాడి చేశారు. నిరవధిక కర్ఫ్యూ మధ్య, ఎన్పీపీ బీజేపీ ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. రాష్ట్రంలో దిగజారుతున్న పరిస్థితులను అదుపు చేయడంలో మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ విఫలమయ్యారని ఎన్పీపీ ఆరోపించింది. మహారాష్ట్రలో తన ఎన్నికల ర్యాలీలను రద్దు చేసుకుని షా తిరిగి వచ్చిన వెంటనే ఈ సమావేశం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం మణిపూర్లో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు మణిపూర్లో పరిస్థితిపై హోంమంత్రి అధికారులతో సమావేశం నిర్వహించి శాంతిభద్రతలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో పరిస్థితిపై ఆయన ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రభుత్వం ఈ మేరకు సమాచారం ఇచ్చింది. అయితే ఈ సమావేశంలో షా ఏం చర్చించారు? నెక్స్ట్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుంది అన్న అంశంపై క్లారిటీ లేదు.
READ MORE: Gold Rate Today: భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. హైదరాబాద్లో తులం ఎంతుందంటే?
Also Read
- Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
మణిపూర్లోని ఇంఫాల్ వ్యాలీలోని వివిధ జిల్లాల్లో ఆగ్రహించిన గుంపులు మరో ముగ్గురు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యేలు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇళ్లను తగులబెట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటిపై కూడా ఆందోళనకారులు దాడి చేశారని అధికారులు తెలిపారు. బీరెన్ సింగ్ పూర్వీకుల ఇంటిపై కూడా వారు దాడికి ప్రయత్నించారు. అయితే.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. మణిపూర్లో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించడంతో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఎన్పీపీ (నేషనల్ పీపుల్స్ పార్టీ) మద్దతు ఉపసంహరించుకుంది. మణిపూర్లోని 60 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి 32 మంది ఎమ్మెల్యేల పూర్తి మెజారిటీ ఉంది. ఎన్పీపీ మద్దతు ఉపసంహరణ ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపదు. ఎన్పీపీకి 7 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.
తాజావార్తలు
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
-
Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?