Manipur Violence : మణిపూర్లో అదుపుతప్పిన పరిస్థితి.. రంగంలోకి అమిత్ షా
- మణిపూర్లో మళ్లీ హింస
- రాష్ట్రంలో అదుపు తప్పిన పరిస్థితి
- పరిస్థితిపై హోంమంత్రి అధికారులతో సమావేశం
- శాంతిభద్రతల పరిస్థితిని సమీక్ష
- ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కేంద్ర హోంమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మణిపూర్లో మళ్లీ హింస చెలరేగడంతో రాష్ట్రంలో పరిస్థితి అదుపు తప్పింది. శనివారం ముగ్గురు మహిళలతో సహా ఆరుగురి హత్య తర్వాత, ఆగ్రహించిన గుంపు బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్ల దాడి చేశారు. నిరవధిక కర్ఫ్యూ మధ్య, ఎన్పీపీ బీజేపీ ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. రాష్ట్రంలో దిగజారుతున్న పరిస్థితులను అదుపు చేయడంలో మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ విఫలమయ్యారని ఎన్పీపీ ఆరోపించింది. మహారాష్ట్రలో తన ఎన్నికల ర్యాలీలను రద్దు చేసుకుని షా తిరిగి వచ్చిన వెంటనే ఈ సమావేశం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం మణిపూర్లో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు మణిపూర్లో పరిస్థితిపై హోంమంత్రి అధికారులతో సమావేశం నిర్వహించి శాంతిభద్రతలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో పరిస్థితిపై ఆయన ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రభుత్వం ఈ మేరకు సమాచారం ఇచ్చింది. అయితే ఈ సమావేశంలో షా ఏం చర్చించారు? నెక్స్ట్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుంది అన్న అంశంపై క్లారిటీ లేదు.
READ MORE: Gold Rate Today: భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. హైదరాబాద్లో తులం ఎంతుందంటే?
Also Read
- Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
- IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
మణిపూర్లోని ఇంఫాల్ వ్యాలీలోని వివిధ జిల్లాల్లో ఆగ్రహించిన గుంపులు మరో ముగ్గురు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యేలు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇళ్లను తగులబెట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటిపై కూడా ఆందోళనకారులు దాడి చేశారని అధికారులు తెలిపారు. బీరెన్ సింగ్ పూర్వీకుల ఇంటిపై కూడా వారు దాడికి ప్రయత్నించారు. అయితే.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. మణిపూర్లో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించడంతో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఎన్పీపీ (నేషనల్ పీపుల్స్ పార్టీ) మద్దతు ఉపసంహరించుకుంది. మణిపూర్లోని 60 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి 32 మంది ఎమ్మెల్యేల పూర్తి మెజారిటీ ఉంది. ఎన్పీపీ మద్దతు ఉపసంహరణ ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపదు. ఎన్పీపీకి 7 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.
తాజావార్తలు
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
ట్రెండింగ్
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.