Manipur Violence : మణిపూర్లో అదుపుతప్పిన పరిస్థితి.. రంగంలోకి అమిత్ షా
- మణిపూర్లో మళ్లీ హింస
- రాష్ట్రంలో అదుపు తప్పిన పరిస్థితి
- పరిస్థితిపై హోంమంత్రి అధికారులతో సమావేశం
- శాంతిభద్రతల పరిస్థితిని సమీక్ష
- ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కేంద్ర హోంమంత్రి
మణిపూర్లో మళ్లీ హింస చెలరేగడంతో రాష్ట్రంలో పరిస్థితి అదుపు తప్పింది. శనివారం ముగ్గురు మహిళలతో సహా ఆరుగురి హత్య తర్వాత, ఆగ్రహించిన గుంపు బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్ల దాడి చేశారు. నిరవధిక కర్ఫ్యూ మధ్య, ఎన్పీపీ బీజేపీ ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. రాష్ట్రంలో దిగజారుతున్న పరిస్థితులను అదుపు చేయడంలో మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ విఫలమయ్యారని ఎన్పీపీ ఆరోపించింది. మహారాష్ట్రలో తన ఎన్నికల ర్యాలీలను రద్దు చేసుకుని షా తిరిగి వచ్చిన వెంటనే ఈ సమావేశం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం మణిపూర్లో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు మణిపూర్లో పరిస్థితిపై హోంమంత్రి అధికారులతో సమావేశం నిర్వహించి శాంతిభద్రతలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో పరిస్థితిపై ఆయన ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రభుత్వం ఈ మేరకు సమాచారం ఇచ్చింది. అయితే ఈ సమావేశంలో షా ఏం చర్చించారు? నెక్స్ట్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుంది అన్న అంశంపై క్లారిటీ లేదు.
READ MORE: Gold Rate Today: భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. హైదరాబాద్లో తులం ఎంతుందంటే?
Also Read
- Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
- CM Chandrababu: ఏపీ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు.. గూగుల్ రాక గేమ్ ఛేంజర్..
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
- UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
మణిపూర్లోని ఇంఫాల్ వ్యాలీలోని వివిధ జిల్లాల్లో ఆగ్రహించిన గుంపులు మరో ముగ్గురు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యేలు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇళ్లను తగులబెట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటిపై కూడా ఆందోళనకారులు దాడి చేశారని అధికారులు తెలిపారు. బీరెన్ సింగ్ పూర్వీకుల ఇంటిపై కూడా వారు దాడికి ప్రయత్నించారు. అయితే.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. మణిపూర్లో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించడంతో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఎన్పీపీ (నేషనల్ పీపుల్స్ పార్టీ) మద్దతు ఉపసంహరించుకుంది. మణిపూర్లోని 60 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి 32 మంది ఎమ్మెల్యేల పూర్తి మెజారిటీ ఉంది. ఎన్పీపీ మద్దతు ఉపసంహరణ ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపదు. ఎన్పీపీకి 7 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.
తాజావార్తలు
-
Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
-
CM Chandrababu: ఏపీ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు.. గూగుల్ రాక గేమ్ ఛేంజర్..
-
WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
-
UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!