Manipur Violence : మణిపూర్లో అదుపుతప్పిన పరిస్థితి.. రంగంలోకి అమిత్ షా
- మణిపూర్లో మళ్లీ హింస
- రాష్ట్రంలో అదుపు తప్పిన పరిస్థితి
- పరిస్థితిపై హోంమంత్రి అధికారులతో సమావేశం
- శాంతిభద్రతల పరిస్థితిని సమీక్ష
- ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కేంద్ర హోంమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మణిపూర్లో మళ్లీ హింస చెలరేగడంతో రాష్ట్రంలో పరిస్థితి అదుపు తప్పింది. శనివారం ముగ్గురు మహిళలతో సహా ఆరుగురి హత్య తర్వాత, ఆగ్రహించిన గుంపు బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్ల దాడి చేశారు. నిరవధిక కర్ఫ్యూ మధ్య, ఎన్పీపీ బీజేపీ ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. రాష్ట్రంలో దిగజారుతున్న పరిస్థితులను అదుపు చేయడంలో మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ విఫలమయ్యారని ఎన్పీపీ ఆరోపించింది. మహారాష్ట్రలో తన ఎన్నికల ర్యాలీలను రద్దు చేసుకుని షా తిరిగి వచ్చిన వెంటనే ఈ సమావేశం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం మణిపూర్లో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు మణిపూర్లో పరిస్థితిపై హోంమంత్రి అధికారులతో సమావేశం నిర్వహించి శాంతిభద్రతలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో పరిస్థితిపై ఆయన ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రభుత్వం ఈ మేరకు సమాచారం ఇచ్చింది. అయితే ఈ సమావేశంలో షా ఏం చర్చించారు? నెక్స్ట్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుంది అన్న అంశంపై క్లారిటీ లేదు.
READ MORE: Gold Rate Today: భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. హైదరాబాద్లో తులం ఎంతుందంటే?
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
మణిపూర్లోని ఇంఫాల్ వ్యాలీలోని వివిధ జిల్లాల్లో ఆగ్రహించిన గుంపులు మరో ముగ్గురు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యేలు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇళ్లను తగులబెట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటిపై కూడా ఆందోళనకారులు దాడి చేశారని అధికారులు తెలిపారు. బీరెన్ సింగ్ పూర్వీకుల ఇంటిపై కూడా వారు దాడికి ప్రయత్నించారు. అయితే.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. మణిపూర్లో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించడంతో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఎన్పీపీ (నేషనల్ పీపుల్స్ పార్టీ) మద్దతు ఉపసంహరించుకుంది. మణిపూర్లోని 60 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి 32 మంది ఎమ్మెల్యేల పూర్తి మెజారిటీ ఉంది. ఎన్పీపీ మద్దతు ఉపసంహరణ ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపదు. ఎన్పీపీకి 7 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..