Home
Latest Telugu News
Latest Telugu News News
-
DK Aruna : మంత్రి హరీష్రావుపై సంచలన వ్యాఖ్యలు చేసిన డీకే అరుణ
అగ్నిపథ్పై విపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటే.. బీజేపీ నేతలు అగ్నిపథ్ స్కీం ఆమోదయోగ్యమని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. సికింద్రాబాద్ అల్లర్ల ఘటనపై కేంద్రం సీబీఐ విచారణకు అదేశించాలని ఆమె డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ మద్దతుతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం చేశారని ఆమె మండిపడ్డారు. కేంద్రంపై ప్రజల్లో వ్యతిరేకత సృష్టించేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ కుట్రలో భాగమే ఈ అల్లర్లు అంటూ ఆమె ఆరోపించారు. అమాయకులను రెచ్చగొట్టి యువకుల… -
Minister KTR : బీజేపీ దేశాన్ని రావణకాష్టంలా మార్చింది
కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ జ్వాలలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. తెలంగాణలో నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకున్న అలర్లు దానికి నిదర్శనం. అయితే అగ్నిపథ్ స్కీంను వెనక్కి తీసుకోవాలంటూ విమర్శలు వెల్లువెత్తుతుంటే.. మరో పక్క కేంద్ర ప్రభుత్వం ఎయిర్ఫోర్స్ లాంటి విభాగాల్లో అగ్నివీరులకు ప్రత్యేక కేటాయింపు ఇస్తామంటూ ప్రకటనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అనాలోచిత విధానాలతో దేశాన్ని రావణకాష్టంలా మార్చింది బీజేపీ అని ఆయన మండిపడ్డారు. స్విస్ బ్యాంకుల నుంచి… -
Indra Karan Reddy : కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్రిపథ్ స్కీంపై నిరసనజ్వాలలు దేశవ్యాప్తంగా రగులుతున్నాయి. అయితే నిన్న అగ్రిపథ్ స్కీంను వ్యతిరేకిస్తూ సుమారు 2000 మంది ఆందోళన కారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ముట్టడించి, దాదాపు 8 రైళ్లను ధ్వంసం చేశారు. అంతేకాకుండా రైల్వే స్టేషన్లోని ఇతర సామాగ్రిని సైతం చెల్లాచెదురు చేశారు. మొత్తం 20 కోట్ల వరకు అస్తినష్టం వాటిల్లిందని రైల్వే పోలీసులు వెల్లడించారు. అయితే తాజాగా ఈ ఘటనపై తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. మోదీ… -
Agnipath Protest : అసలు ఎలా జరిగింది.. పూర్తి వివరాలు..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీంపై నిరసన జ్వాలలు రగులుతున్నాయి. ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా ఆందోళనకారులు చేపట్టిన నిరసనకాండ తీవ్ర ఉద్రికత్తలకు దారితీసింది. ఈ ఘటనలో భారీగా ఆస్తినష్టం వాటిల్లడమే కాకుండా.. పోలీసుల కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందాడు. అంతేకాకుండా మరికొంత మందికి తీవ్రగాయాలయ్యాయి. అయితే ఈ ఘటనపై రైల్వే పోలీసులు వివరాలు వెల్లడిస్తూ.. ఉదయం 9 గంటలకు స్టేషన్లోకి 300 మంది ఆందోళనకారులు సాధారణ ప్రయాణికులలా గేట్… -
Corona Updates : మళ్లీ తెలంగాణలో భారీగా నమోదైన కరోనా కేసులు
అగ్రరాజ్య అమెరికాతో పాటు యావత్తు ప్రపంచ దేశాల్లో అల్లకల్లోలం సృష్టిస్తోన్న కరోనా మహమ్మారి మరోసారి పుంజుకుంటోంది. కరోనా నుంచి పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ సృష్టించిన థర్డ్వేవ్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదిలోనే కట్టడి చేశాయి. అయితే ఇప్పుడు కూడా కరోనా ఫోర్త్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడించాయి. అయితే తాజాగా మరోసారి తెలంగాణలో కరోనా కేసుల సంఖ్యం 2వందలు దాటింది. గడిచిన 24 గంటల్లో 27,841 మందికి కరోనా పరీక్షలు… -
India vs South Africa : ముగిసిన ఇండియా బ్యాటింగ్.. సఫారీల టార్గెట్ 170
టీమిండియా-సౌతాఫ్రికా జట్ల మధ్య ఐదు మ్యాచ్ల సిరీస్ జరుగుతోంది. అయితే ఇప్పటికి మూడు మ్యాచ్లు టీమిండియా-సౌతాఫ్రికాల మధ్య జరుగగా.. అందులో మొదటి రెండు మ్యాచ్లు సౌతాఫ్రికా కైవవం చేసుకుంది. అయితే మూడో మ్యాచ్ టీమిండియా ఖాతాలో పడగా.. నేడు నాలుగో మ్యాచ్ రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన సఫారీలు బౌలింగ్ ఎంచుకోవడంతో.. టీమిండియాకు బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లతో పాటు టాపార్డర్ మరోసారి విఫలమైనా మిడిలార్డర్… -
Breaking News: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనపై కేసు నమోదు
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ స్కీంపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళన కారులు వింధ్వంసం సృష్టించిన అందోళన కారులను కొద్ది సేపటికి క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళన కారులను రైల్వే స్టేషన్ నుంచి పోలీసు వాహనాలలో తరలించారు. అయితే ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 143, 147, 324, 307, 435,427, 448,… -
Breaking News : సికింద్రాబాద్ నుంచి కాసేపట్లో రైలు సర్వీసులు ప్రారంభం
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్రిపథ్ స్కీంపై దేశ్యాప్తంగా నిరసన జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళన కారులు వింధ్వంసం సృష్టించిన విషయం తెలిసింది. అయితే ఇప్పటికీ ఆందోళన కారులు రైల్వే స్టేషన్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనల నేపథ్యంలో ఇప్పటికే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శాఖ రద్దు చేసింది. అయితే పరిస్థితులు పూర్తి అదుపులోకి రావడంతో కాసేపట్లో సికింద్రాబాద్ నుంచి రైలు సర్వీసులు ప్రారంభం… -
Raghunandan Rao : నిఘా వ్యవస్థ తెలంగాణలో నిద్ర పోతుంది
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీం దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు రగుల్చుతున్న విషయం తెలిసిందే. అయితే.. నేడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆందోళన కారుల నిరసనతో రణరంగంగా మారింది. ఈ ఘటనపై కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాడికి వేలమంది తరలి వస్తుంటే నిఘా వ్యవస్థ కూడా ఫామ్ హాజ్ లో పాడుకుందా అని… -
Minister Niranjan Reddy : ఇంత అనాలోచిత నిర్ణయం అవివేకం
సైనిక బలగాల నియామకం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్నిపథ్ ఓ అనాలోచిత నిర్ణయమని, 46 వేల మందిని 90 రోజులలో నియామకం, కేవలం రూ.30 వేల జీతం అర్థం లేనిదన్నారు. దేశ భద్రత విషయంలో ఇంత అనాలోచిత నిర్ణయం అవివేకమని ఆయన మండిపడ్డారు. పదవ తరగతి పాసైన వారు అగ్నిపథ్ లో…
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..