Vijayawada: విజయవాడ భవానీపురంలో ఇద్దరు పిల్లల మిస్సింగ్ కలకలం సృష్టిస్తోంది. ఈ మేరకు నేడు(గురువారం) భవానీపురం పోలీసు స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ భవానీపురం (R.R. దర్బార్ దగ్గర) ఉన్న ట్యూషన్కు నిన్న 6:00గంటలకు తల్లి తీసుకుని వెళ్లింది. ట్యూషన్ దగ్గర తల్లి దింపిన తరువాత ట్యూషన్ లోపలికి వెళ్లకుండా బయటకు వచ్చి ఆటోలో వెళ్లిపోయారు పిల్లలు. పిల్లల పేర్లు మేరారామ్(12), ఉమారామ్(13). భవానీపురం శ్రీ చైతన్య హై స్కూల్లో ఈ ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రెండు బృందలుగా ఏర్పడి బస్టాండ్, రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపడుతున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీలు సేకరించి దర్యాప్తు సాగిస్తున్నారు.
READ MORE: Donald Trump: 11 యుద్ధ విమానాలు కూలిపోయాయి.. ట్రంప్ నోట మళ్లీ అదే మాట..