Home
Latest Telugu News
Latest Telugu News News
-
Ajay Maken: కేజ్రీవాల్ ప్రభుత్వం రూ. 382 కోట్ల కుంభకోణానికి పాల్పడింది..
ఆమ్ ఆద్మీ పార్టీ రూ.382 కోట్ల కొత్త కుంభకోణానికి పాల్పడిందని కాంగ్రెస్ జాతీయ కోశాధికారి అజయ్ మాకెన్ ఆరోపించారు. బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీలో పార్టీని ఏర్పాటు చేశామన్నారు. అప్పట్లో ఓ నాయకుడు కాగ్ రిపోర్టు తెచ్చి కాంగ్రెస్ పై ధ్వజమెత్తేవాడని, ఇప్పుడు అదే కాగ్ రిపోర్టులే వారి అవినీతిని చెబుతున్నాయన్నారు. 14 కాగ్ నివేదికలు వచ్చాయని అజయ్ మాకెన్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో రూ.382 కోట్ల ఆరోగ్య… -
Mahakumbh 2025: మహా కుంభమేళాలో ముస్లిం మహిళలు.. సీఎం యోగిపై పొగడ్తల వర్షం..
ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమం మహాకుంభమేళా. ఇది భారతీయ సంస్కృతి, సంప్రదాయాల సంగమం మాత్రమే కాదు.. ప్రపంచ ఐక్యతకు చిహ్నంగా కూడా మారింది. లక్షలాది మంది భక్తులతో పాటు, ప్రపంచంలోని వివిధ మూలల నుంచి విదేశీ ప్రతినిధులు కూడా ఈ విశిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. -
Auto Expo 2025: మారుతి డిజైర్ ప్రత్యేక ఎడిషన్ విడుదల.. ధర ఎంతంటే?
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఆటో ఎక్స్పో 2025లో తన 7 కార్ల ప్రత్యేక ఎడిషన్లను ప్రదర్శించింది. ఇప్పటికే అమ్మకానికి ఉన్న ఈ కార్లలో కొన్ని మార్పులు చేసింది. వీటిలో మారుతి సుజుకి డిజైర్ యొక్క అర్బన్ లక్స్ ఎడిషన్ కూడా ఉంది. డిజైర్ యొక్క కొత్త వేరియంట్లో ఫ్రంట్ గ్రిల్, డోర్ ప్యానెల్, వెనుక బంపర్ చుట్టూ క్రోమ్ ఎలిమెంట్స్ అమర్చారు. ప్రస్తుత డిజైర్ ఫీచర్లు, పవర్ట్రెయిన్, ధరను ఒకసారి చూద్దాం. -
Viral Video: పాఠశాలలో మహిళా టీచర్తో ప్రిన్సిపాల్ శృంగారం.. వీడియో వైరల్ కావడంతో…
స్కూల్ చాలా పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా పిల్లలకు, జీవితంలో అత్యుత్తమ పునాది పాఠశాలలో వేయబడుతుంది. అందుకే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను మంచి బడిలో చదివించాలని కష్టపడుతున్నారు.. డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడరు. కొంతమంది ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలతో పాటు జీవితం గురించి కూడా బోధిస్తారు. అన్ని రంగాల్లో రాణించగలమన్న సత్తాను చాటుతున్నారు... ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లోనూ మంచి విద్యనభ్యసిస్తున్నారనే నమ్మకం ఉంది.. -
Brahma Anandam: ఫిబ్రవరి 14న ‘బ్రహ్మా ఆనందం’ రిలీజ్.. సినిమాలో బ్రహ్మానందం లవ్స్టోరీ?
హాస్య బ్రహ్మ, పద్మశ్రీ బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ ఔట్ అండ్ ఔట్ఎంటర్టైనర్ ‘బ్రహ్మ ఆనందం’లో తాత, మనవళ్ళుగా అలరించబోతున్నారు. ఈ చిత్రానికి ఫస్ట్ -టైమర్ ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తున్నారు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. సావిత్రి, శ్రీ ఉమేష్ యాదవ్ సమర్పిస్తున్నారు. ఫస్ట్ లుక్ లో సంప్రదాయ పంచె కట్టులో సంతోషకరమైన చిరునవ్వుతో బ్రహ్మానందరం ఆకట్టుకున్నారు. కాగా.. ఈ చిత్రం వచ్చే నెల 14న థియేటర్లలోకి రానుంది. -
BJP: బీజేపీకి త్వరలో కొత్త జాతీయ అధ్యక్షుడు.. తేదీ ఖరారు!.. రేసులో ఎవరున్నారంటే?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కొత్త జాతీయ అధ్యక్షుడిని నియమించనుంది. ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీలోపు పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీ ఎన్నికల వరకు బీజేపీకి నాయకత్వం వహిస్తారు. అధ్యక్షుడిగా ఆయన పదవీకాలం 2024 జనవరిలో ముగియాల్సి ఉంది. అయితే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నడ్డా పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగించారు. -
YSRCP: ఏపీలో నియోజకవర్గాల సమన్వయకర్తలను ప్రకటించిన వైసీపీ..
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీలో పలు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించారు. చోడవరం నియోజకవర్గ సమన్వయకర్తగా గుడివాడ అమర్నాథ్, మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్తగా బూడి ముత్యాల నాయుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా తిప్పల దేవన్ రెడ్డిని నియమించారు. -
Amit Shah AP Tour : సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్షా..
కేంద్ర హోంమంత్రి అమిత్షా సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఆయనకు సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరీ అమిత్కు స్వాగతం పలికారు. సుమారు గంటకు పైగా సీఎం చంద్రబాబు నివాసంలో అమిత్ షా ఉండనున్నారు. పలు కీక అంశాలపై వీరి మధ్య చర్చ జరగనుంది. -
Mulugu District: బీజాపూర్ ఎన్కౌంటర్లో “బడా నేత” బడే చొక్కారావు హతం..
బీజాపూర్లోని పుజారి -కంకేర్లో జరిగిన ఎన్కౌంటర్లో బడే చొక్కారావుతో పాటు 17 మంది మృతి చెందారు. మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేశారు. బడే చొక్కా రావు, మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పని చేశాడు. బడే చొక్కా రావు అలియాస్ (దామోదర్, మల్లన్న) ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, కాల్వపల్లి గ్రామవాసి. ఇతను మిలిటరీ చీఫ్గా కూడా పనిచేశాడు. చొక్కా రావు తల్లి బతుకమ్మ, తన కుమారుడు అజ్ఞాతంలో ఉన్నాడు.… -
TTD Incidents : టీటీడీ వరుస ఘటనలపై కేంద్రం సీరియస్..
తొక్కిల లాంట, లడ్డూ కౌంటర్లలో అగ్ని ప్రమాదం జరిగిన ఘటనలపై కేంద్రం సీరియస్ అయ్యింది. టీటీడీ బోర్డును కేంద్రం నివేదిక కోరింది. టీటీడీ చరిత్రలో కేంద్రం ఇలా జోక్యం చేసుకోవడం ఇదే మొదటి సారి. క్షేత్రస్థాయి పరిశీలనకు హోం శాఖ అధికారి సంజీవ్కుమార్ జిందాల్ను ప్రత్యేకంగా నియమించింది. రేపు, ఎల్లుండి రెండ్రోజులు సంజీవ్ జిందాల్ పర్యటించి వివరాలు సేకరించనున్నారు. టీటీడీ కూడా ఘటనకు సంబంధించి పూర్తి నివేదిక పంపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?