Mahakumbh 2025: మహా కుంభమేళాలో ముస్లిం మహిళలు.. సీఎం యోగిపై పొగడ్తల వర్షం..
- ప్రయాగ్రాజ్లో కుంభమేళా
- ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమం
- భారతీయ సంస్కృతి, సంప్రదాయాల సంగమం
- ఈ కార్యక్రమానికి హాజరైన ముస్లిం మహిళలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమం మహాకుంభమేళా. ఇది భారతీయ సంస్కృతి, సంప్రదాయాల సంగమం మాత్రమే కాదు.. ప్రపంచ ఐక్యతకు చిహ్నంగా కూడా మారింది. లక్షలాది మంది భక్తులతో పాటు, ప్రపంచంలోని వివిధ మూలల నుంచి విదేశీ ప్రతినిధులు కూడా ఈ విశిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు.
READ MORE: PM Modi: “ఫోటోలు తీయండి, లొకేషన్ షేర్ చేయండి”.. ఆప్ని ఎండగట్టాలని ప్రధాని మోడీ ఆదేశం..
Also Read
ఈసారి మహాకుంభమేళాకు 10 దేశాల నుంచి 21 మంది సభ్యుల అంతర్జాతీయ ప్రతినిధి బృందం హాజరైంది. వీరిలో ఫిజి, ఫిన్లాండ్, గయానా, మలేషియా, మారిషస్, సింగపూర్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ట్రినిడాడ్, టొబాగో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుంచి ప్రతినిధులు ఉన్నారు. ఈ ప్రతినిధులు కుంభమేళా ఏర్పాట్లను పరిశీలించి, త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. సాధువుల ద్వారా భారతీయ ధార్మిక, సాంస్కృతిక సంప్రదాయాలను తెలుసుకున్నారు.
READ MORE: KTR: వాళ్ల ప్రియారిటీ ఫార్ములా- ఈ కేస్.. మా ప్రియారిటీ ఫార్మర్స్
ప్రతినిధి బృందంలోని ప్రత్యేక సభ్యురాలు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన ముస్లిం మహిళ సాలీ ఎల్ అజాబ్ మహాకుంభమేళా యొక్క గొప్ప ఏర్పాట్లను ముక్తకంఠంతో ప్రశంసించింది. “మిడిల్ ఈస్ట్ నుంచి భారతదేశానికి రాకముందు ఇలాంటి పెద్ద మత కార్యక్రమం నేను ఎప్పుడూ చూడలేదు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదు.. ఇక్కడ ఏర్పాట్లు, భద్రత కూడా అపూర్వమైనది.” అని పేర్కొంది.
READ MORE: KTR: వాళ్ల ప్రియారిటీ ఫార్ములా- ఈ కేస్.. మా ప్రియారిటీ ఫార్మర్స్
మరోవైపు.. ముంబైకి చెందిన షబ్నమ్ షేక్ అనే ముస్లిం యువతి కూడా మహాకుంభమేళాకు చేరుకుంది. షబ్నం షేక్ ఇక్కడ చాలా మంది సాధువులను, మహాత్ములను సందర్శించి వారి ఆశీర్వాదం తీసుకుంది. దీనితో పాటు, ముస్లిం యువతి అనేక సనాతనీ ఆచారాలలో కూడా పాల్గొంది. యోగి ప్రభుత్వ ఏర్పాట్లను సాటిలేనిదిగా అభివర్ణించింది. ఆమె అయోధ్య పీఠాధీశ్వర్ జగత్గురు ఆచార్య పరమహంస్ దాస్ సన్యాసి శిబిరాన్ని కూడా సందర్శించింది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!