Ajay Maken: కేజ్రీవాల్ ప్రభుత్వం రూ. 382 కోట్ల కుంభకోణానికి పాల్పడింది..
- కాంగ్రెస్ జాతీయ కోశాధికారి అజయ్ మాకెన్ ఆరోపణలు
- కాగ్ నివేదికలో వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమ్ ఆద్మీ పార్టీ రూ.382 కోట్ల కొత్త కుంభకోణానికి పాల్పడిందని కాంగ్రెస్ జాతీయ కోశాధికారి అజయ్ మాకెన్ ఆరోపించారు. బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీలో పార్టీని ఏర్పాటు చేశామన్నారు. అప్పట్లో ఓ నాయకుడు కాగ్ రిపోర్టు తెచ్చి కాంగ్రెస్ పై ధ్వజమెత్తేవాడని, ఇప్పుడు అదే కాగ్ రిపోర్టులే వారి అవినీతిని చెబుతున్నాయన్నారు. 14 కాగ్ నివేదికలు వచ్చాయని అజయ్ మాకెన్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో రూ.382 కోట్ల ఆరోగ్య కుంభకోణం జరిగినట్లు ఈ కాగ్ నివేదిక తెలియజేస్తోందన్నారు.
READ MORE: Noise ColorFit Pro 6: AI ఫీచర్లతో నాయిస్ న్యూ స్మార్ట్ వాచ్లు.. ధర ఎంతంటే?
Also Read
- Donald Trump: "ఆ గౌరవం దక్కించుకున్న ఏకైక యూఎస్ ప్రెసిడెంట్ నేనే".. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ట్రంప్ ఫిదా!
- Venezuela Earthquake: వెనెజువెలాను మళ్లీ వణికించిన భూకంపం.. ప్రజల్లో భయాందోళనలు
- TTD: రామ మందిరం విరాళాల వివాదం ఎఫెక్ట్.. టీటీడీ ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్.! ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్..
- CM Chandrababu Markapuram Tour: రూ.300 కోట్ల పరిహారం పంపిణీకి సీఎం.. మార్కాపురం జిల్లాలో నేడు విస్తృత పర్యటన
బురారీలోని ఇందిరాగాంధీ హాస్పిటల్, మౌలానా ఆజాద్ డెంటల్ హాస్పిటల్ నిర్మాణంలో అవినీతి జరిగిందని అజయ్ మాకెన్ అన్నారు. ఈ మూడు ఆసుపత్రుల నిర్మాణ పనులు కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభమయ్యాయని, అయితే కేజ్రీవాల్ ప్రభుత్వంలో దాని నిర్మాణం నిరంతరం జాప్యమైందని అజయ్ మాకెన్ అన్నారు. దీంతో టెండర్ డబ్బులు పెరుగుతూ వచ్చాయని తెలిపారు. వీటిలో ఇందిరాగాంధీ ఆస్పత్రి నిర్మాణానికి అత్యధికంగా రూ.314 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. ఈ అవినీతి ఎలా జరిగిందో కేజ్రీవాల్ ప్రభుత్వం చెప్పాలి? అని ప్రశ్నించారు.
READ MORE: Hyderabad: గాంధీభవన్లో ఉద్రిక్తత.. కొట్టుకున్న యూత్ కాంగ్రెస్ నేతలు..
“మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కాగ్ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. దీంతో ఆయన ఉద్దేశం స్పష్టమైంది. అరవింద్ కేజ్రీవాల్ కూడా దేశ వ్యతిరేకి. 2007-15 మధ్య 15 ప్లాట్లను ఢిల్లీ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు కాగ్ నివేదిక చెబుతోంది. అయితే ఎక్కడా పనులు ప్రారంభం కాలేదు. 2016-17 నుంచి 2021-22 వరకు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం వచ్చిన డబ్బులో రూ.2,623 కోట్లు ఖర్చు చేయలేకపోయింది.” అని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Donald Trump: “ఆ గౌరవం దక్కించుకున్న ఏకైక యూఎస్ ప్రెసిడెంట్ నేనే”.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ట్రంప్ ఫిదా!
-
Venezuela Earthquake: వెనెజువెలాను మళ్లీ వణికించిన భూకంపం.. ప్రజల్లో భయాందోళనలు
-
Vivo X Fold 6: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో వివో ఎక్స్ ఫోల్డ్ 6 విడుదల.. ఫోల్డబుల్ ఫోన్లలో కొత్త బెంచ్మార్క్
-
TTD: రామ మందిరం విరాళాల వివాదం ఎఫెక్ట్.. టీటీడీ ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్.! ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్..
-
CM Chandrababu Markapuram Tour: రూ.300 కోట్ల పరిహారం పంపిణీకి సీఎం.. మార్కాపురం జిల్లాలో నేడు విస్తృత పర్యటన
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!