Ajay Maken: కేజ్రీవాల్ ప్రభుత్వం రూ. 382 కోట్ల కుంభకోణానికి పాల్పడింది..
- కాంగ్రెస్ జాతీయ కోశాధికారి అజయ్ మాకెన్ ఆరోపణలు
- కాగ్ నివేదికలో వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమ్ ఆద్మీ పార్టీ రూ.382 కోట్ల కొత్త కుంభకోణానికి పాల్పడిందని కాంగ్రెస్ జాతీయ కోశాధికారి అజయ్ మాకెన్ ఆరోపించారు. బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీలో పార్టీని ఏర్పాటు చేశామన్నారు. అప్పట్లో ఓ నాయకుడు కాగ్ రిపోర్టు తెచ్చి కాంగ్రెస్ పై ధ్వజమెత్తేవాడని, ఇప్పుడు అదే కాగ్ రిపోర్టులే వారి అవినీతిని చెబుతున్నాయన్నారు. 14 కాగ్ నివేదికలు వచ్చాయని అజయ్ మాకెన్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో రూ.382 కోట్ల ఆరోగ్య కుంభకోణం జరిగినట్లు ఈ కాగ్ నివేదిక తెలియజేస్తోందన్నారు.
READ MORE: Noise ColorFit Pro 6: AI ఫీచర్లతో నాయిస్ న్యూ స్మార్ట్ వాచ్లు.. ధర ఎంతంటే?
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
బురారీలోని ఇందిరాగాంధీ హాస్పిటల్, మౌలానా ఆజాద్ డెంటల్ హాస్పిటల్ నిర్మాణంలో అవినీతి జరిగిందని అజయ్ మాకెన్ అన్నారు. ఈ మూడు ఆసుపత్రుల నిర్మాణ పనులు కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభమయ్యాయని, అయితే కేజ్రీవాల్ ప్రభుత్వంలో దాని నిర్మాణం నిరంతరం జాప్యమైందని అజయ్ మాకెన్ అన్నారు. దీంతో టెండర్ డబ్బులు పెరుగుతూ వచ్చాయని తెలిపారు. వీటిలో ఇందిరాగాంధీ ఆస్పత్రి నిర్మాణానికి అత్యధికంగా రూ.314 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. ఈ అవినీతి ఎలా జరిగిందో కేజ్రీవాల్ ప్రభుత్వం చెప్పాలి? అని ప్రశ్నించారు.
READ MORE: Hyderabad: గాంధీభవన్లో ఉద్రిక్తత.. కొట్టుకున్న యూత్ కాంగ్రెస్ నేతలు..
“మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కాగ్ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. దీంతో ఆయన ఉద్దేశం స్పష్టమైంది. అరవింద్ కేజ్రీవాల్ కూడా దేశ వ్యతిరేకి. 2007-15 మధ్య 15 ప్లాట్లను ఢిల్లీ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు కాగ్ నివేదిక చెబుతోంది. అయితే ఎక్కడా పనులు ప్రారంభం కాలేదు. 2016-17 నుంచి 2021-22 వరకు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం వచ్చిన డబ్బులో రూ.2,623 కోట్లు ఖర్చు చేయలేకపోయింది.” అని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!