Mulugu District: బీజాపూర్ ఎన్కౌంటర్లో “బడా నేత” బడే చొక్కారావు హతం..
- బీజాపూర్లోని పుజారి -కంకేర్లో ఎన్కౌంటర్
- బడే చొక్కారావుతో పాటు 17 మంది మృతి
- తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా చొక్కా రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజాపూర్లోని పుజారి -కంకేర్లో జరిగిన ఎన్కౌంటర్లో బడే చొక్కారావుతో పాటు 17 మంది మృతి చెందారు. మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేశాడు. బడే చొక్కా రావు, మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పని చేశాడు. బడే చొక్కా రావు అలియాస్ (దామోదర్, మల్లన్న) ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, కాల్వపల్లి గ్రామవాసి. ఇతను మిలిటరీ చీఫ్గా కూడా పనిచేశాడు. గతంలో భద్రతా దళాలను టార్గెట్ చేసి వారిపై కాల్పులు, ల్యాండ్ మైన్ పేల్చిన ఘటనలో కీలక పాత్ర పోషించాడు. చొక్కా రావు తల్లి బతుకమ్మ.
READ MORE: Mollywood : చాలా కాలం తర్వాత పోటీపడుతున్నఆ ఇద్దరు స్టార్ హీరోలు
Also Read
- Somu Veerraju: జగన్కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
- YS Jagan: క్రాంతికుమార్ కుటుంబానికి పరామర్శ.. పోలీసు వ్యవస్థపై జగన్ సంచలన వ్యాఖ్యలు
- Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్పార్క్కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన బేబీ బాస్.. అరంగేట్రం వాయిదాపై గవాస్కర్ సీరియస్ వార్నింగ్..
గతంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించిన యాప నారాయణ అలియాస్ హరి భూషణ్ 2021లో కోవిడ్ బారిన పడి మరణించాడు. అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. అయితే ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు మావోయిస్టు పార్టీ పలువురి పేర్లు పరిశీలించింది. ఈ క్రమంలో ఆజాద్ పేరు సైతం తెరపై వినిపించగా చివరకు చొక్కారావు పేరు ఖరారు చేశారు. తెలంగాణ జిల్లాల్లో మంచిపట్టున మడేచొక్కా రావ్ ఎటురు నాగారం.. ములుగు… మహబూబాబాద్ ప్రాంతాల్లో ఆక్టివ్ గా పని చేశాడు. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా బడే చొక్కా రావు నియామకంతో రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాల పునరుద్ధరణకు సహాయపడింది.ఈ నేపథ్యంలో అతడి హతం మావోయిస్టు పార్టీకి తీరని లోటుగా మారింది. దీంతో పార్టీ కార్యకలాపాలను సాగించడం అస్థవ్యస్తంగా మారుతుందని పలువురు భావిస్తున్నారు.
READ MORE: Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ “హెల్త్ ఇన్సూరెన్స్”.. చికిత్సకు ఎంత డబ్బు ఇచ్చిందంటే..?
ఇదిలా ఉండగా.. నిన్న, సుక్మా-బీజాపూర్ సరిహద్దులో ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతాన్ని పరిశోధించడంలో సైనికులు పెద్ద విజయం సాధించారు. సుక్మా డీఆర్జీ సైనికులు నక్సలైట్ సొరంగం కనుగొన్నారు. సుక్మా బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న తుమ్రైల్, తాల్పేరు నది మధ్య నక్సలైట్ల డంప్ను డీఆర్జీ సుక్మా సైనికులు స్వాధీనం చేసుకున్నారు. నక్సలైట్లు ఆయుధాలు, పేలుడు పదార్థాల తయారీకి అవసరమైన సామాగ్రిని సొరంగం నిర్మించి పారబోశారు. నక్సలైట్లు కొత్త టెక్నాలజీని అవలంబించడం ద్వారా సైనికులకు హానీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నక్సలైట్లు బాంబుల తయారీకి గాజు సీసాలు ఉపయోగిస్తున్నారు. సొరంగం నుంచి ఆయుధాల తయారీ యంత్రం, ఎలక్ట్రిక్ వైర్, బాటిల్ బాంబు, భారీ మొత్తంలో నక్సల్స్ డంప్ మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు.
READ MORE: Nelson : జైలర్ 2పై నెల్సన్ ఎక్స్పర్టేషన్స్ భారీగా పెంచేస్తున్నాడా..?
తాజావార్తలు
-
Somu Veerraju: జగన్కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
-
FSSAI Energy Drink Notices: ఎనర్జీ డ్రింక్స్ తాగేవారికి అలర్ట్.. 6 ప్రముఖ బ్రాండ్లకు FSSAI నోటీసులు, కారణం ఇదే!
-
Neha Dhupia: ‘ఇదంతా వెంటనే ఆపండి’.. బ్యాక్ షాట్ ఫోటోలపై మండిపడ్డ నేహా ధూపియా..
-
YS Jagan: క్రాంతికుమార్ కుటుంబానికి పరామర్శ.. పోలీసు వ్యవస్థపై జగన్ సంచలన వ్యాఖ్యలు
-
Russia: పుతిన్ దేశంలో పెట్రోల్ బంకులు ఖాళీ! రష్యాకు పెట్రోల్ అమ్ముతున్న భారత్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?