Home
Latest Telugu News
Latest Telugu News News
-
Hydra: ఘట్కేసర్లో కూల్చివేతలకు రంగం సిద్ధం..
హైడ్రా కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. ఘట్కేసర్లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ను కూల్చివేతకు హైడ్రా రెడీ అయ్యింది. నల్లమల్లారెడ్డి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కబ్జా చేసి కాంపౌండ్ నిర్మించినట్లు అనేకమైన ఫిర్యాదులు అందాయి. సర్వే చేసి హైడ్రా.. అది ప్రభుత్వ స్థలం అని నిర్ధారించి, కూల్చివేతలకు సిద్ధమైంది. ఇప్పటికే అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. -
Private Junior Colleges: ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు కోర్టులో దక్కని ఊరట.. విద్యార్థులపై భారం..
ప్రైవేట్ జూనియర్ కాలేజీలకి కోర్టులో ఊరట దక్కలేదు. అటు ఇంటర్ బోర్డు కూడా వెనక్కి తగ్గడం లేదు. మిక్స్డ్ అక్యుపెన్సీ భవనాల్లో నడుస్తున్న కళాశాలలకు అనుబంధ గుర్తింపు కోసం బోర్డు లక్ష రూపాయలు ఫైన్ వేసింది. దీంతో కొన్ని కాలేజి యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. రేపే ఇంటర్ ఫీజ్ కట్టేందుకు చివరి తేదీ కావడంతో ఈ లక్ష రూపాయలు కట్టేందుకు కళాశాలలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రతి విద్యార్థి వద్ద లేట్ ఫీ రూపంలో 2 వేల 500… -
Hyderabad: బంజారాహిల్స్లో కారు బీభత్సం.. ఫుట్పాత్ మీద నిద్రిస్తున్న వ్యక్తి మృతి
బంజారాహిల్స్లో కారు బీభత్సం సృష్టించింది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద ఫుట్ పాత్ మీదకు దూసుకెళ్లింది. ఫుట్ పాత్ మీద నిద్రిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. నిందితులు కారును అక్కడే వదిలేసి పారిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
KCR: కేసీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం..
కేసీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కేసీఆర్ సోదరి అనారోగ్యంతో మృతి చెందారు. కేసీఆర్ ఐదవ సోదరి, కేటీఆర్ మేనత్త, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు తల్లి చీటీ సకలమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. తన సోదరి భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు మేడ్చల్ దగ్గరలోని ఆమె నివాసానికి కేసీఆర్ వెళ్లనున్నారు. -
Best Selling Scooters: గత నెలలో అత్యధికంగా అమ్ముడైన 10 స్కూటర్లు ఇవే.. టాప్ వన్లో…
భారతీయ కస్టమర్లలో స్కూటర్ల డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది. గత నెల అంటే డిసెంబర్ 2024 అమ్మకాల డేటాను పరిశీలిస్తే.. మరోసారి హోండా యాక్టివా అగ్రస్థానాన్ని సాధించింది. గత నెలలో 1,20,981 యూనిట్ల హోండా యాక్టివా స్కూటర్లు విక్రయించారు. కానీ.. గతేడాదితో పోలిస్తే.. యాక్టివా విక్రయాలు 16.18 శాతం క్షీణించాయి. గత నెలలో అత్యధికంగా అమ్ముడైన 10 స్కూటర్లను చూద్దాం.. -
Emergency: లండన్లో ‘ఎమర్జెన్సీ ‘కి అడ్డంకులు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ సీరియస్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్వీయదర్శకత్వంలో నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజీకయ జీవితం ఆధారంగా తెరక్కెక్కిన ఈ మూవీలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి కీలక పాత్ర పోషించారు. ఇందిరాగాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించారు. గతంలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా.. పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈనెల 17న థియేటర్లలో విడుదలైంది. -
Oscars 2025 Nominations: ఆస్కార్ నామినేషన్స్ 2025 ప్రకటన.. పూర్తి జాబితా ఇదే..
చలనచిత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుకు ఈ ఏడాది నామినేషన్లను ప్రకటించారు. గురువారం లాస్ ఏంజిల్స్లో ఒక ఈవెంట్ నిర్వహించారు. ఇక్కడ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆస్కార్ 2025కి నామినేట్ చేయబడిన పేర్లను వెల్లడించారు. -
Subhas Chandra Bose: గాంధీ నిర్ణయాలను వ్యతిరేకించిన నేతాజీ.. స్వాతంత్య్ర పోరాటం ఎలా సాగించారు?
ఇవి నేతాజీ చెప్పిన మాటలు.. నేతాజీ పేరు వినగానే ప్రతి భారతీయుడి ఛాతి ఉప్పొంగుతుంది. జాతి మొత్తం పులకిస్తుంది. గాంధీజీ స్ఫూర్తితో జాతీయోద్యమంలో చేరారు. కానీ.. బాపూ నిర్ణయాలనే నిర్మొహమాటంగా విభేదించారు బోస్. నేతాజీ సాగించిన పోరాటం దేశ చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టంగా నిలిచింది. సాయుధ సంగ్రామమే మార్గమని ప్రకటించి, స్వతంత్ర భారతావని ఒక్కటే మనకు స్వర్గమని చాటి, ప్రత్యేక సైన్యాన్ని సమకూర్చుకొని ఆంగ్లేయులతో యద్ధం చేశాడు. ప్రతి పౌరుడు సైనికుడిగా మారి ప్రాణార్పణకు సిద్ధంగా… -
Jammu Kashmir: అంతుచిక్కని వ్యాధితో 17 మంది మృతి.. కంటైన్మెంట్ జోన్గా ప్రకటన
జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాకు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాదల్ గ్రామం ఒక మర్మమైన వ్యాధి కారణంగా 17 మంది మరణించిన తరువాత కంటైన్మెంట్ జోన్గా ప్రకటించబడింది. మృతుల్లో 13 మంది చిన్నారులు ఉన్నారు. జిల్లా యంత్రాంగం గ్రామంలో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 (అంతకుముందు ఇది సెక్షన్ 144) విధించింది. బాధిత కుటుంబాల ఇళ్లను సీలు చేశారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ అధికారి మాట్లాడుతూ.. "బాధల్ను కంటైన్మెంట్ జోన్గా ప్రకటించాం. గ్రామాన్ని మూడు జోన్లుగా విభజించాం. అన్ని… -
Minister Seethakka: 3410 గ్రామాల్లో గ్రామసభలు.. 142 ఊళ్లలో గొడవలు చేసింది వాళ్లే..
నిన్న మొత్తం 3410 గ్రామాల్లో గ్రామసభలు జరిగాయని మంత్రి సీతక్క తెలిపారు. చిట్ చాట్లో మంత్రి మాట్లాడుతూ.. "కేవలం 142 గ్రామాల్లోని ఆందోళనలు జరిగాయని స్వయంగా బీఆర్ఎస్ పత్రికలోనే చెప్పారు. అంటే కేవలం నాలుగు శాతం గ్రామాల్లోనే కొంత గొడవ జరిగింది.. అది కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఉద్దేశ పూర్వకంగా చేశారు. అంటే 96% గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో గ్రామసభలు జరిగినట్టు స్పష్టమవుతుంది.
తాజావార్తలు
-
NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. ‘బ్లడీ రోమియో’ వాయిదా.. ‘OG 2’పై సుజీత్ ఫోకస్
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి షాక్ మీద షాక్.. ఆ 9 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు..?
-
Pat Cummins: ఏదో పెద్ద ప్లాన్ వేసినట్లు నటించా.. పంజాబ్ స్టార్ ప్లేయర్ ఈజీగా బుట్టలో పడ్డాడు!
-
Vijay’s Convoy Security Withdrawn: విజయ్ కి షాక్ భద్రత తొలగింపు.. ప్రమాణ స్వీకారంపై ఉత్కంఠ
-
Viral: ఓ వైపు బండ రాళ్ల మధ్య ఇరుక్కున్న బాలుడి తల.. అదే సందులో విషపూరిత పాము.. చివరకు ఏమైందంటే..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!