BJP: బీజేపీకి త్వరలో కొత్త జాతీయ అధ్యక్షుడు.. తేదీ ఖరారు!.. రేసులో ఎవరున్నారంటే?
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధ్యక్షుడి నియామకం
- ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీలోపు ఎన్నిక జరిగే అవకాశం!
- ఢిల్లీ ఎన్నికల వరకు నడ్డాకే బాధ్యతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కొత్త జాతీయ అధ్యక్షుడిని నియమించనుంది. ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీలోపు పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీ ఎన్నికల వరకు బీజేపీకి నాయకత్వం వహిస్తారు. అధ్యక్షుడిగా ఆయన పదవీకాలం 2024 జనవరిలో ముగియాల్సి ఉంది. అయితే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నడ్డా పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగించారు.
బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం..
అధ్యక్షుడి ఎంపిక కోసం.. బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం జాతీయ కౌన్సిల్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల ఎంపిక జరుగుతోంది. కనీసం 50% రాష్ట్ర యూనిట్లు జాతీయ అధ్యక్షుని ఎన్నికకు ముందే తమ సంస్థాగత ఎన్నికలను పూర్తి చేయాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటి వరకు కేవలం నాలుగు రాష్ట్రాలు మాత్రమే తమ రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. సంస్థాగత ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయని, అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు.
Also Read
బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరు?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఆమోదంతో బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేయనున్నారు. ఈ రేసులో చాలా మంది పేర్లు ఉన్నాయి. అయితే బీజేపీ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి రేసులో కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, శివరాజ్ సింగ్ చౌహాన్, పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే పేర్లు చర్చనీయాంశమయ్యాయి. దీంతో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేరు కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
వీరు అమిత్షాకు సన్నిహితులట!
గత సంస్థాగత ఎన్నికల్లో కూడా ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ పేర్లు చర్చకు వచ్చినా చివరకు ఆ పాత్రను జేపీ నడ్డాకు అప్పగించారు. ఈ ముగ్గురు నేతలు పార్టీలో పని చేయడం ద్వారా అనుభవం సంపాదించుకున్నారు. భూపేంద్ర యాదవ్ స్వస్థలం రాజస్థాన్. కాగా, ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశా నుంచి వచ్చారు. వినోద్ తావ్డే మహారాష్ట్రకు చెందినవారు. ఈ ముగ్గురు నేతలు అమిత్ షాకు సన్నిహితులుగా భావిస్తున్నారు .
పార్టీ రాజ్యాంగం ప్రకారం కనీసం 15 ఏళ్లపాటు పార్టీలో సభ్యత్వం ఉన్న వ్యక్తిని మాత్రమే జాతీయ అధ్యక్షుడిగా చేస్తారు. అంతకుముందు, 2010 నుండి 2013 వరకు.. సంస్థ యొక్క కమాండ్ నితిన్ గడ్కరీ వద్ద ఉండేది. రాజ్నాథ్ సింగ్ 2005 నుంచి 2009 వరకు, మళ్లీ 2013 నుంచి 2014 వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. అమిత్ షా 2014 నుంచి 2020 వరకు బీజేపీకి సారథ్యం వహించారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!