Sowa Fish: పాకిస్తాన్కి చెందిన ఓ మత్స్యకారుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అతని వలలో చిక్కిన ఓ చేప అతని తలరాతనే మార్చేసింది. కరాచీ నగరంలోని నిరుపేద మత్స్యకారుడైన హాజీ బలోచ్ అత్యంత అరుదైన చేప చిక్కింది. ఇది కోట్లలో రేటు పలకడంతో అతని దశ తిరిగింది.
Air India Express: దుబాయ్-అమృత్సర్ ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం పాకిస్తాన్ కరాచీలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. విమానంలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి అత్యవసరంగా వైద్య సహాయం అవసరం కావడంతో దగ్గర ఉన్న కరాచీ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
Pakistan: పాకిస్తాన్లో అసలేం జరగుతోంది. ఎవరికీ అంతుచిక్కకుండా గుర్తు తెలియని వ్యక్తులు భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్ని లేపేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఉగ్రవాదులు ఇలాగే చంపివేయబడ్డారు. తాజాగా మరో ఉగ్రవాదిని లేపేశారు. లష్కరే తోయిబా ఉగ్రసంస్థలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకరైన ముఫ్తీ ఖైజర్ ఫరూఖ్ని కరాచీ నగరంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
పాకిస్థాన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హజారా ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 40 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు.
గూఢచర్యం ఆరోపణలపై విదేశాంగ మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న వ్యక్తిని ఘజియాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల ప్రకారం, పోలీసులు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి సమాచారం అందుకున్న తర్వాత నవీన్ పాల్ అనే వ్యక్తిని క్రాసింగ్స్ రిపబ్లిక్ ప్రాంతం నుంచి పట్టుకున్నారు.
Pakistan: పాకిస్తాన్ దేశంలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల కాలంలో మేకలు, ఇతర పశువుల దొంగతనాలు పెరగుతున్నాయి. ముస్లింలకు పవిత్ర పండగ బక్రీద్(ఈద్ ఉల్ అధా) సమీపిస్తున్న సమయంలో జంతువులను బలిచ్చేందుకు చాలా మంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలో ఇటీవల కాలంలో ఇటువంటి నేరాలు ఎక్కువగా పెరిగాయి. వేలు, లక్షల్లో విక్రయించబడుతున్న జంతువులను అమ్మేందుకు వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకుని వాటిని దొంగిలిస్తున్నారు.
Pakistan Economy Crisis: పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఆ దేశానికి నిధులు చాలా అవసరం. చైనా నుండి ఒక బిలియన్ డాలర్ల రుణం పొందింది.. దీంతో ఇది తక్షణ ఉపశమనం లభించినట్లైంది.
Protests in Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ)పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ను పాకిస్తాన్ పారామిలిటరీ రేంజర్లు మంగళవారం ఇస్లామాబాద్ కోర్టు వెలుపల అరెస్ట్ చేశారు. అవినీతి కేసులో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉంటే అరెస్టుకు ముందు ఇమ్రాన్ ఖాన్ ఓ వీడియో సందేశంలో మాట్లాడుతూ.. తనను అరెస్ట్ చేసి చంపేందుకు
Pakistan: పాకిస్తాన్ లో అరాచకం రాజ్యమేలుతోంది. అక్కడ ఆర్థిక సంక్షోభం ప్రజలను తీవ్ర పేదరికంలోకి నెట్టేస్తోంది. ఇక రాజకీయంగా అస్థిరత నెలకొంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ వార్త ఒళ్లుగగుర్పాటుకు గురిచేస్తోంది. పాకిస్తాన్ లోని తల్లిదండ్రులు తమ కూతుళ్ల సమాధులకు తాళాలు వేయాల్సిన పరిస్థితి దాపురించింది. చనిపోయిన కూతుళ్ల శవాలపై అత్యాచారాలకు ఒడిగట్టకుండా తల్లిదండ్రులు సమాధులకు తాళాలు వేస్తున్నారని డైలీ టైమ్స్ వెల్లడించింది. దేశంలో ‘‘నెక్రోఫిలియా’’ కేసులు పెరుగుతున్నాయని ఈ నివేదిక పేర్కొంది.
పాకిస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ రైలులో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు చిన్నారులుసహా ఒక మహిళ ఉంది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కరాచీ-లాహోర్ రైలులోని ఏసీ కోచ్లో మంటలు చెలరేగాయి.