Pakistan Economy Crisis: పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఆ దేశానికి నిధులు చాలా అవసరం. చైనా నుండి ఒక బిలియన్ డాలర్ల రుణం పొందింది.. దీంతో ఇది తక్షణ ఉపశమనం లభించినట్లైంది. మరిన్ని నిధుల సమీకరణ కోసం కరాచీ పోర్ట్ టెర్మినల్స్ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి అప్పగించాలని కోరుతోంది. ఇందుకోసం ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చల కమిటీని ఏర్పాటు చేసింది. పాక్ IMF నుండి నిలిచిపోయిన రుణాన్ని క్లియర్ చేయడానికి అత్యవసర నిధులను సేకరించే పనిలో నిమగ్నమైంది.
Read Also:Aliya Baig Academy: వైభవంగా అలియా బేగ్ అకాడమీ ఆఫ్ మేకప్ విద్యార్థుల కాన్వకేషన్
పాక్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ నేతృత్వంలో ఇంటర్-గవర్నమెంటల్ కమర్షియల్ ట్రాన్సాక్షన్స్పై క్యాబినెట్ కమిటీ సోమవారం సమావేశమైంది. మీడియా కథనాల ప్రకారం.. కరాచీ పోర్ట్ ట్రస్ట్ (KPT) , UAE ప్రభుత్వం మధ్య వాణిజ్య ఒప్పందాన్ని చర్చించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. కరాచీ పోర్ట్ టెర్మినల్స్ను అప్పగించడానికి UAEలోని ఒక నిర్దేశిత ఏజెన్సీతో ముసాయిదాను తయారు చేయనున్నట్లు నిర్ణయం పేర్కొంది. ముసాయిదా ఆపరేషన్, నిర్వహణ, పెట్టుబడి, అభివృద్ధి ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు చర్చల కమిటీకి కూడా అనుమతి లభించింది.
Read Also:Rana Daggupati : ఆ సినిమాలో విలన్ గా నటించబోతున్న రానా..?
పాకిస్థాన్ ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్స్ (PICT) అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో ఉన్న కరాచీ పోర్ట్ టెర్మినల్స్ను కొనుగోలు చేయడానికి UAE గత సంవత్సరం ఆసక్తి చూపింది. గత సంవత్సరం, పాకిస్తాన్ సంకీర్ణ ప్రభుత్వం ఇంటర్-గవర్నమెంటల్ కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ యాక్ట్ని అమలులోకి తెచ్చింది. ఇది నిధుల సేకరణకు దేశం యొక్క ఆస్తులను ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.