Train Accident: ఘోర రైలు ప్రమాదం.. 15 మంది మృతి, 40 మందికి పైగా గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Train Accident in Pakistan: పాకిస్థాన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హజారా ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 40 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. దక్షిణ పాకిస్థాన్లో ఆదివారం రైలు పట్టాలు తప్పడంతో దాదాపు 15 మంది మరణించారని ఆ దేశ రైల్వే మంత్రి తెలిపారు. హజారా ఎక్స్ప్రెస్ కరాచీ నుంచి అబోటాబాద్కు వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. దక్షిణ సింధ్ ప్రావిన్స్లోని నవాబ్షా నగరంలోని సహారా రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ ప్రమాదంలో ఓ కోచ్ పూర్తిగా బోల్తా పడింది. దీంతో 15 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
“ఇది చాలా పెద్ద ప్రమాదం. రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. దాదాపు 15 మంది ప్రయాణికులు మరణించారు. 45 మంది గాయపడ్డారు” అని ఆ దేశ రైల్వే మంత్రి ఖవాజా సాద్ రఫీక్ విలేకరులతో అన్నారు. “హజారా ఎక్స్ప్రెస్ కరాచీ నుంచి అబోటాబాద్కు వెళ్తుండగా, ఎనిమిది కోచ్లు పట్టాలు తప్పాయి” అని రైల్వే అధికారి మొహ్సిన్ సియాల్ అన్నారు. అనేక మంది ప్రయాణికులు మరణించారని, ఘటనా స్థలానికి రిలీఫ్ రైలును పంపించామని ప్రావిన్షియల్ రైల్వే అధికారి ఇజాజ్ షా తెలిపారు.
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
Also Read: CM Jagan: ప్రజా కవి గద్దర్ మరణంపై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి
పాకిస్తాన్ పురాతన రైల్వే వ్యవస్థలో తరచుగా ప్రమాదాలు, పట్టాలు తప్పడం జరుగుతుంది. జూన్ 2021లో సింధ్లోని దహర్కి సమీపంలో రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో కనీసం 65 మంది మరణించగా.. 150 మంది గాయపడ్డారు. ఆ ప్రమాదంలో, ఎదురుగా ఉన్న ట్రాక్పైకి ఒక ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పగా.. ఒక నిమిషం తర్వాత రెండవ ప్యాసింజర్ రైలు ఆ శిథిలాలను ఢీకొట్టింది. 2019 అక్టోబర్లో తేజ్గామ్ ఎక్స్ప్రెస్ రైలులో జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం 75 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఘోట్కీ వద్ద రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 2005లో 100 మందికి పైగా మరణించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!