Pakistan: బక్రీద్ ఎఫెక్ట్.. పాకిస్తాన్లో పెరుగుతున్న జంతువుల దొంగతనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ దేశంలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల కాలంలో మేకలు, ఇతర పశువుల దొంగతనాలు పెరగుతున్నాయి. ముస్లింలకు పవిత్ర పండగ బక్రీద్(ఈద్ ఉల్ అధా) సమీపిస్తున్న సమయంలో జంతువులను బలిచ్చేందుకు చాలా మంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలో ఇటీవల కాలంలో ఇటువంటి నేరాలు ఎక్కువగా పెరిగాయి. వేలు, లక్షల్లో విక్రయించబడుతున్న జంతువులను అమ్మేందుకు వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకుని వాటిని దొంగిలిస్తున్నారు.
సింధ్ ప్రావిన్సుల్లో పోలీస్ నివేదిక ప్రకారం.. 2023 మొదటి 5 నెల్లలో వీధి నేరాలు బాగా పెరిగాయి. 3000 కన్నా ఎక్కువ సంఘటనలు నమోదయ్యాయి. వీటిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన 46 మంది మరణించారు. 21,000 కన్నా ఎక్కువ మొబైల్ ఫోన్లు, 20,000 కన్నా ఎక్కువ మోటార్ సైకిళ్లు చోరీకి గురయ్యాయి. ప్రజలను దోచుకోవడమే కాకుండా జంతువులను కూడా దొంగిలిస్తున్నారు. రెస్టారెంట్ల నుంచి శ్మశాన వాటికల దాకా ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టకుండా దొంగతనాలు చేస్తున్నారు.
Also Read
- Iran-Israel Tensions: మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు..
- Philippines Earthquake: ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
- Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
Read Also: Tammareddy Bharadwaj: ప్రాజెక్ట్ కె.. మొదటి రోజే రూ. 500 కోట్లు రాబడుతుంది.. ప్రభాస్ రేంజ్ అది
బక్రీద్ పండగ దగ్గరపడుతుండటంతో బలిచ్చేందుకు జంతువులను దొంగిలిస్తున్నారు. గత వారం ఇద్దరు మోటార్ సైకిల్ పై వచ్చి, లారీ డ్రైవర్ కి తుపాకీతో గురిపెట్టి, అందులో ఉన్న మేకల్ని దొంగిలించారు. పాకిస్తాన్ లో ప్రస్తుతం ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రజలకు నిత్యావసరాలే కరువయ్యాయి. కొందాం అనుకున్న దొరకని పరిస్థితి ఉంది. ప్రజలకు పనులు లేక ఆదాయం తగ్గింది. ఈ నేపథ్యంలో పలువురు చోరీలకు పాల్పడుతున్నారని అక్కడి నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు 1.7 జనాభా ఉన్న కరాచీ నగరంలో పోలీసులు వీధి దోపిడీలను కట్టడి చేసేందుకు కష్టపడుతున్నారు. ప్రస్తుతం నగరంలో 1.28 లక్షల మంది పోలీస్ సిబ్బంది మాత్రమే ఉన్నారు. వీరంతా ప్రతీ ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేయడం కష్టంగా మారిందని పోలీస్ ఉన్నతాధికారి మహ్మద్ తారిక్ ముఘల్ అన్నారు. నేరస్తులను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా షాహీన్స్ దళాల్నీ ఏర్పాటు చేశామని తెలిపారు.
తాజావార్తలు
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Today Gold and Silver Prices: బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవిగో.. తగ్గాయా? పెరిగాయా?
-
Ram Charan : ‘పెద్ది’ని చూసి రామ్ చరణ్ ఎమోషనల్… వీడియో వైరల్
-
Rebal Star Fans : రెబల్ స్టార్ ఫ్యాన్స్ తో మాములుగా ఉండదు
-
Shreyas Iyer: నేనింతే.. ఎవరి కోసం నేను మారను.. సర్పంచ్ సాబ్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!