Pakistan: బక్రీద్ ఎఫెక్ట్.. పాకిస్తాన్లో పెరుగుతున్న జంతువుల దొంగతనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ దేశంలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల కాలంలో మేకలు, ఇతర పశువుల దొంగతనాలు పెరగుతున్నాయి. ముస్లింలకు పవిత్ర పండగ బక్రీద్(ఈద్ ఉల్ అధా) సమీపిస్తున్న సమయంలో జంతువులను బలిచ్చేందుకు చాలా మంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలో ఇటీవల కాలంలో ఇటువంటి నేరాలు ఎక్కువగా పెరిగాయి. వేలు, లక్షల్లో విక్రయించబడుతున్న జంతువులను అమ్మేందుకు వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకుని వాటిని దొంగిలిస్తున్నారు.
సింధ్ ప్రావిన్సుల్లో పోలీస్ నివేదిక ప్రకారం.. 2023 మొదటి 5 నెల్లలో వీధి నేరాలు బాగా పెరిగాయి. 3000 కన్నా ఎక్కువ సంఘటనలు నమోదయ్యాయి. వీటిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన 46 మంది మరణించారు. 21,000 కన్నా ఎక్కువ మొబైల్ ఫోన్లు, 20,000 కన్నా ఎక్కువ మోటార్ సైకిళ్లు చోరీకి గురయ్యాయి. ప్రజలను దోచుకోవడమే కాకుండా జంతువులను కూడా దొంగిలిస్తున్నారు. రెస్టారెంట్ల నుంచి శ్మశాన వాటికల దాకా ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టకుండా దొంగతనాలు చేస్తున్నారు.
Also Read
- Entire Village Set On Fire: దారుణ ఘటన.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఊరినే తగలబెట్టేశారు..
- Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
- Iran: ట్రంప్, నెతన్యాహుల తలలు తీస్తే రూ.450 కోట్ల బహుమతి.. ఖమేనీ మృతికి ఇరాన్ రివెంజ్ ప్లాన్!
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
Read Also: Tammareddy Bharadwaj: ప్రాజెక్ట్ కె.. మొదటి రోజే రూ. 500 కోట్లు రాబడుతుంది.. ప్రభాస్ రేంజ్ అది
బక్రీద్ పండగ దగ్గరపడుతుండటంతో బలిచ్చేందుకు జంతువులను దొంగిలిస్తున్నారు. గత వారం ఇద్దరు మోటార్ సైకిల్ పై వచ్చి, లారీ డ్రైవర్ కి తుపాకీతో గురిపెట్టి, అందులో ఉన్న మేకల్ని దొంగిలించారు. పాకిస్తాన్ లో ప్రస్తుతం ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రజలకు నిత్యావసరాలే కరువయ్యాయి. కొందాం అనుకున్న దొరకని పరిస్థితి ఉంది. ప్రజలకు పనులు లేక ఆదాయం తగ్గింది. ఈ నేపథ్యంలో పలువురు చోరీలకు పాల్పడుతున్నారని అక్కడి నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు 1.7 జనాభా ఉన్న కరాచీ నగరంలో పోలీసులు వీధి దోపిడీలను కట్టడి చేసేందుకు కష్టపడుతున్నారు. ప్రస్తుతం నగరంలో 1.28 లక్షల మంది పోలీస్ సిబ్బంది మాత్రమే ఉన్నారు. వీరంతా ప్రతీ ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేయడం కష్టంగా మారిందని పోలీస్ ఉన్నతాధికారి మహ్మద్ తారిక్ ముఘల్ అన్నారు. నేరస్తులను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా షాహీన్స్ దళాల్నీ ఏర్పాటు చేశామని తెలిపారు.
తాజావార్తలు
-
Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ… ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
-
Rahul Gandhi: మోడీ విదేశీ టూర్లపై రాహుల్ గాంధీ విసుర్లు
-
Mumbai Indians: ముంబై ఇండియన్స్కు డబుల్ షాక్.. ఇంటి బాట పట్టిన స్టార్ ప్లేయర్లు..
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
Purusha : భార్యల టార్చర్లు, మగాళ్ల కష్టాలు..క్షేమంగా వెళ్లి లాభంగా రండి వైబ్’లో ‘పురుష:’ ట్రైలర్!
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!