Iran-Israel Tensions: ఇరాన్ లేదా దాని ప్రాక్సీలు రానున్న రోజుల్లో ఇజ్రాయిల్పై దాడికి దిగే అవకాశం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ని ఉటంకిస్తూ వైట్హౌజ్ వర్గాలు హెచ్చరించాయి. ‘‘ఈ వారంలోనే దాడి జరిగే అవకాశం ఉంది’’ అని వైట్హౌజ్ ప్రతినిధి జాన్ ఎఫ్ కిర్బీ అన్నారు.
China: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే ఇరాన్ గడ్డ పైనే హత్యకు గురికావడంతో ఆ దేశం ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణస్వీకారం కోసం వచ్చిన సమయంలో రాజధాని టెహ్రాన్లో హనియే హత్యకు గురయ్యాడు.
Donald Trump : ఈ ఏడాది నవంబర్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తి స్థాయిలో ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇంతలో ఆయన అంతర్గత సందేశాలు హ్యాక్ చేయబడి ఇరాన్పై ఈ ఆరోపణ చేసినట్లు వార్తలు వచ్చాయి.
Iran Israel War : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ ప్రతీకార దాడికి సంబంధించిన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతపై ప్రపంచం ఒక కన్ను వేసి ఉంచింది.
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్-లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు కమ్ముకున్నాయి. ఇటీవల హమాస్ అగ్ర నేత హనియా హత్య తర్వాత ఈ పరిస్థితులు మరింత తీవ్రం అయ్యాయి.
ఇటీవల ఇజ్రాయిల్ వైమానిక దాడిలో లెబనాన్ రాజధాని బీరూట్లో హిజ్బుల్లా సీనియర్ కమాండర్ ఫువాద్ షుక్ర్ని హతమార్చింది. అయితే, ఇజ్రాయిల్ లెబానాన్ నుంచి వస్తున్న శత్రువుల డ్రోన్లు అడ్డగించింది.
ఇదిలా ఉంటే భారతదేశంలో ఇరాన్ రాయబారి డాక్టర్ ఇరాజ్ ఎలాహి మాట్లాడుతూ, ఇజ్రాయిల్ మారణహోమాన్ని ఆపే శక్తి భారత్కి ఉందని అన్నారు. గాజాలో ఇజ్రాయిల్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి తాను భారత్ ఒక ముఖ్యమైన దేశమని, బిగ్ పవర్ అని, అంతర్జాతీయ సమాజంలో ప్రభావవంతమైన దేశం అని తాను పదేపదే ప్రస్తావించిన విషయాన్ని ఆయన వెల్లడించారు.
Israel-Hamas war: ఇజ్రాయెల్ దేశంపై ఇరాన్, హిజ్బుల్లాలు ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉందని అగ్ర దేశం అమెరికా అంచనా వేసింది. దీనిపై జీ- 7 దేశాలకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సమాచారాన్ని అందించినట్లు టాక్.
Abraham Alliance: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే ఇరాన్ రాజధాని టెహ్రాన్లో హత్యకు గురయ్యారు. ఈ హత్య తర్వాత ఒక్కసారిగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. హనియే హత్యలో ఇజ్రాయిల్ ప్రమేయం ఉందని ఇరాన్తో పాటు దాని ప్రాక్సీలు హమాస్, హిజ్బుల్లా ఆరోపిస్తున్నాయి.
Iran : ఉత్తర ఇజ్రాయెల్లోని బీట్ హిల్లెల్ నగరంపై ఆదివారం హిజ్బుల్లా కత్యుషా రాకెట్లను ప్రయోగించారు. ఇరాన్ నుంచి నిరంతర మద్దతు పొందుతున్న ఈ ఉగ్రవాద సంస్థ.. పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలిపే ఉద్దేశంతో ఈ దాడులు జరిగాయని పేర్కొంది.