Russia: హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా మరణంపై రష్యా సంచలన ప్రకటన
- హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా మరణంపై రష్యా కీలక ప్రకటన
- రాజకీయ హత్యగా అభివర్ణించిన రష్యా
- లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణం తర్వాత పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్- లెబనాన్- ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా హిజ్బుల్లా లక్ష్యంగా లెబనాన్పై ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. పేజర్లు, వాకీటాకీలు పేల్చడంతో మొదలు పెట్టిన ఇజ్రాయెల్.. చివరికి హిజ్బుల్లా అగ్ర నేతలను అంతమొందించింది. అతి ముఖ్యమైన కమాండర్లను లేపేసింది. ఇక హిజ్బుల్లాలో అత్యంత శక్తివంతమైన నేత, దాని అధినేత నస్రల్లాను ఇజ్రాయెల్ తుదిముట్టించడం ప్రపంచాన్ని కలవరానికి గురి చేసింది. అత్యంత రహస్య ప్రాంతాల్లో దాగి ఉన్న నస్రల్లాను తుదిముట్టించడం హిజ్బుల్లా మద్దతుదారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఇది కూడా చదవండి: US Embassy: అమెరికా వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్.. 2.5 లక్షల వీసా అపాయింట్మెంట్స్..!
Also Read
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Kim Jong Un: కిమ్ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
ఇక ఇదే అంశంపై రష్యా కీలక ప్రకటన చేసింది. నస్రల్లా మరణాన్ని రాజకీయ హత్యగా అభివర్ణించింది. తక్షణమే లెబనాన్పై దాడులు ఆపాలని సూచించింది. ఇక ఇరాన్ రాజధాని టెహ్రాన్లో తమ ప్రధాని మిఖాయల్ మిషుస్తిన్ పర్యటిస్తున్నారని తెలిపింది. ఇరాన్ అధ్యక్షుడితో కూడా భేటీ కానున్నారని వెల్లడించింది. ఇరాన్, లెబనాన్ విదేశాంగ మంత్రులతో కూడా రష్యా విదేశాంగ మంత్రి చర్చలు జరుపుతారని స్పష్టం చేసింది. ఉక్రెయిన్తో యుద్ధం వేళ ఇరాన్ సాయం ఎప్పటికీ మరిచిపోనిది అని తెలిపింది. ఇరాన్తో మైత్రి పెంపొందించుకుంటామని.. అలాగే వ్యాపార సంబంధాలు కూడా బలపరుచుకుంటామని రష్యా స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Houthis- Israel: హౌతీలే టార్గెట్గా ఇజ్రాయిల్ దాడులు..
నస్రల్లా మరణం తర్వాత కూడా లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా లెబనాన్ రాజధాని బీరుట్లో భీకర దాడులు చేస్తోంది. పెద్ద పెద్ద భవంతులను కూల్చివేస్తోంది. నివాస సముదాయాల్లోనే హిజ్బుల్లా ఆయుధాలను దాచి పెట్టినట్లుగా ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో బీరుట్ నగరంలోని హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే లెబనాన్ పౌరులను ఇజ్రాయెల్ ఖాళీ చేయాలని సూచించింది. తమ లక్ష్యం పూర్తయ్యాక తిరిగి పౌరులు రావొచ్చని వెల్లడించింది. ఇక ఇరాన్ కాలుదువ్వితే.. ప్రతీకార దాడులు తప్పవని ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Special Trains to Araku: అరకు పర్యాటకులకు గుడ్న్యూస్.. రైళ్లేశాఖ ప్రత్యేక సర్వీసులు
తాజావార్తలు
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!