Russia: హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా మరణంపై రష్యా సంచలన ప్రకటన
- హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా మరణంపై రష్యా కీలక ప్రకటన
- రాజకీయ హత్యగా అభివర్ణించిన రష్యా
- లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణం తర్వాత పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్- లెబనాన్- ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా హిజ్బుల్లా లక్ష్యంగా లెబనాన్పై ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. పేజర్లు, వాకీటాకీలు పేల్చడంతో మొదలు పెట్టిన ఇజ్రాయెల్.. చివరికి హిజ్బుల్లా అగ్ర నేతలను అంతమొందించింది. అతి ముఖ్యమైన కమాండర్లను లేపేసింది. ఇక హిజ్బుల్లాలో అత్యంత శక్తివంతమైన నేత, దాని అధినేత నస్రల్లాను ఇజ్రాయెల్ తుదిముట్టించడం ప్రపంచాన్ని కలవరానికి గురి చేసింది. అత్యంత రహస్య ప్రాంతాల్లో దాగి ఉన్న నస్రల్లాను తుదిముట్టించడం హిజ్బుల్లా మద్దతుదారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఇది కూడా చదవండి: US Embassy: అమెరికా వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్.. 2.5 లక్షల వీసా అపాయింట్మెంట్స్..!
Also Read
- PoK Protests: "మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్ను సహాయం కోరుతాం!".. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
- Pakistan-Afghanistan: పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. పాకిస్థాన్పై ఆఫ్ఘనిస్థాన్ డ్రోన్ దాడులు!
- Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో అంతర్జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
ఇక ఇదే అంశంపై రష్యా కీలక ప్రకటన చేసింది. నస్రల్లా మరణాన్ని రాజకీయ హత్యగా అభివర్ణించింది. తక్షణమే లెబనాన్పై దాడులు ఆపాలని సూచించింది. ఇక ఇరాన్ రాజధాని టెహ్రాన్లో తమ ప్రధాని మిఖాయల్ మిషుస్తిన్ పర్యటిస్తున్నారని తెలిపింది. ఇరాన్ అధ్యక్షుడితో కూడా భేటీ కానున్నారని వెల్లడించింది. ఇరాన్, లెబనాన్ విదేశాంగ మంత్రులతో కూడా రష్యా విదేశాంగ మంత్రి చర్చలు జరుపుతారని స్పష్టం చేసింది. ఉక్రెయిన్తో యుద్ధం వేళ ఇరాన్ సాయం ఎప్పటికీ మరిచిపోనిది అని తెలిపింది. ఇరాన్తో మైత్రి పెంపొందించుకుంటామని.. అలాగే వ్యాపార సంబంధాలు కూడా బలపరుచుకుంటామని రష్యా స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Houthis- Israel: హౌతీలే టార్గెట్గా ఇజ్రాయిల్ దాడులు..
నస్రల్లా మరణం తర్వాత కూడా లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా లెబనాన్ రాజధాని బీరుట్లో భీకర దాడులు చేస్తోంది. పెద్ద పెద్ద భవంతులను కూల్చివేస్తోంది. నివాస సముదాయాల్లోనే హిజ్బుల్లా ఆయుధాలను దాచి పెట్టినట్లుగా ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో బీరుట్ నగరంలోని హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే లెబనాన్ పౌరులను ఇజ్రాయెల్ ఖాళీ చేయాలని సూచించింది. తమ లక్ష్యం పూర్తయ్యాక తిరిగి పౌరులు రావొచ్చని వెల్లడించింది. ఇక ఇరాన్ కాలుదువ్వితే.. ప్రతీకార దాడులు తప్పవని ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Special Trains to Araku: అరకు పర్యాటకులకు గుడ్న్యూస్.. రైళ్లేశాఖ ప్రత్యేక సర్వీసులు
తాజావార్తలు
-
YS Jagan: పీఎస్కు వెళ్లాలంటే భయపడే పరిస్థితి.. జగన్ సంచలన వ్యాఖ్యలు
-
UK Roads Melt at 40°C: 40°Cకే UK రోడ్లు కరుగుతుంటే.. 45°C దాటినా తట్టుకుంటున్న భారతీయ రోడ్లు.. ఆసక్తికరమైన కారణాలు
-
Varanasi : ‘వారణాసి’ వార్ సీన్స్.. మైండ్ బ్లోయింగ్ అంతే
-
Ayodhya: “వాష్రూమ్లలో డబ్బు దాచాం”.. అయోధ్య కేసులో నిందితుడు బయటపెట్టిన సంచలన నిజాలు
-
Yadagirigutta: మెగా ఫ్యామిలీకి గుడ్ న్యూస్.. యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డులో కొనిదెల సురేఖకు చోటు
ట్రెండింగ్
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!