Russia: హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా మరణంపై రష్యా సంచలన ప్రకటన
- హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా మరణంపై రష్యా కీలక ప్రకటన
- రాజకీయ హత్యగా అభివర్ణించిన రష్యా
- లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని సూచన
హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణం తర్వాత పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్- లెబనాన్- ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా హిజ్బుల్లా లక్ష్యంగా లెబనాన్పై ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. పేజర్లు, వాకీటాకీలు పేల్చడంతో మొదలు పెట్టిన ఇజ్రాయెల్.. చివరికి హిజ్బుల్లా అగ్ర నేతలను అంతమొందించింది. అతి ముఖ్యమైన కమాండర్లను లేపేసింది. ఇక హిజ్బుల్లాలో అత్యంత శక్తివంతమైన నేత, దాని అధినేత నస్రల్లాను ఇజ్రాయెల్ తుదిముట్టించడం ప్రపంచాన్ని కలవరానికి గురి చేసింది. అత్యంత రహస్య ప్రాంతాల్లో దాగి ఉన్న నస్రల్లాను తుదిముట్టించడం హిజ్బుల్లా మద్దతుదారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఇది కూడా చదవండి: US Embassy: అమెరికా వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్.. 2.5 లక్షల వీసా అపాయింట్మెంట్స్..!
Also Read
- Jeffrey Epstein: ఎప్స్టీన్ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఏడేళ్లుగా దాచిన 'సూసైడ్ లేటర్'.. ప్రపంచ కుబేరులకు దడ!
- US: ముంచుకొస్తున్న ముప్పు.. ఇరాన్ను తుడిచిపెట్టేందుకు ట్రంప్ 'మాస్టర్ ప్లాన్' సిద్ధం!
- Imran Khan: 85% చూపు కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్.. వైద్య కారణాలతో విడుదల కోరుతూ కోర్టుకు అప్పీల్
- Mojtaba Khamenei: "సముద్ర గర్భంలో పాతిపెడతాం".. అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ వార్నింగ్..
ఇక ఇదే అంశంపై రష్యా కీలక ప్రకటన చేసింది. నస్రల్లా మరణాన్ని రాజకీయ హత్యగా అభివర్ణించింది. తక్షణమే లెబనాన్పై దాడులు ఆపాలని సూచించింది. ఇక ఇరాన్ రాజధాని టెహ్రాన్లో తమ ప్రధాని మిఖాయల్ మిషుస్తిన్ పర్యటిస్తున్నారని తెలిపింది. ఇరాన్ అధ్యక్షుడితో కూడా భేటీ కానున్నారని వెల్లడించింది. ఇరాన్, లెబనాన్ విదేశాంగ మంత్రులతో కూడా రష్యా విదేశాంగ మంత్రి చర్చలు జరుపుతారని స్పష్టం చేసింది. ఉక్రెయిన్తో యుద్ధం వేళ ఇరాన్ సాయం ఎప్పటికీ మరిచిపోనిది అని తెలిపింది. ఇరాన్తో మైత్రి పెంపొందించుకుంటామని.. అలాగే వ్యాపార సంబంధాలు కూడా బలపరుచుకుంటామని రష్యా స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Houthis- Israel: హౌతీలే టార్గెట్గా ఇజ్రాయిల్ దాడులు..
నస్రల్లా మరణం తర్వాత కూడా లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా లెబనాన్ రాజధాని బీరుట్లో భీకర దాడులు చేస్తోంది. పెద్ద పెద్ద భవంతులను కూల్చివేస్తోంది. నివాస సముదాయాల్లోనే హిజ్బుల్లా ఆయుధాలను దాచి పెట్టినట్లుగా ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో బీరుట్ నగరంలోని హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే లెబనాన్ పౌరులను ఇజ్రాయెల్ ఖాళీ చేయాలని సూచించింది. తమ లక్ష్యం పూర్తయ్యాక తిరిగి పౌరులు రావొచ్చని వెల్లడించింది. ఇక ఇరాన్ కాలుదువ్వితే.. ప్రతీకార దాడులు తప్పవని ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Special Trains to Araku: అరకు పర్యాటకులకు గుడ్న్యూస్.. రైళ్లేశాఖ ప్రత్యేక సర్వీసులు
తాజావార్తలు
-
Babar Azam: టీ20 క్రికెట్లో నయా హిస్టరీ.. కోహ్లీ, డుప్లెసిస్ను వెనక్కి నెట్టేసిన బాబర్ ఆజామ్..
-
Instagram Star Murder: భర్త చేతితో ఇన్స్టా స్టార్ దారుణ హత్య.. ట్విస్ట్ ఏంటంటే..?
-
TGSRTC: రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసిన టికెట్ ఇన్ స్పెక్టర్.. చెప్పుతో దాడి చేసిన కండక్టర్, ప్రయాణికులు
-
Bhuvneshwar Kumar Record: దూసుకెళ్తున్న స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్.. జస్ప్రీత్ బుమ్రా రికార్డు బ్రేక్!
-
AC Health Risks: గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా..? ఈ వ్యాధులకు కారణం కావచ్చు..! ఏం చేయాలి..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!